Krishna

News December 29, 2024

కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక 

image

కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరవ్వాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు సోమవారం నుంచి జనవరి 20 వరకు జరగనున్నాయి. మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగే ఈవెంట్లకు హాజరవ్వాల్సిన అభ్యర్థులకు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు PMT/ PET ఈవెంట్లకు వచ్చే అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను విడుదల చేశారు. 

News December 29, 2024

కొడాలి నానికి కూడా స్కాంలో భాగం ఉందా?: కొల్లు రవీంద్ర

image

మచిలీపట్నం: పేర్ని జయసుధ బఫర్ గిడ్డంగిలో జరిగిన స్కాంలో పేర్ని నాని స్నేహితుడు కొడాలి నాని నోరు మెదపడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈ స్కాంలో ఆయనకూ భాగస్వామ్యం ఉందా? అని Xలో ప్రశ్నించారు. గతంలో తరచూ ప్రెస్‌మీట్‌లు పెట్టే పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని, ఇప్పుడు పేర్ని నానిని సమర్థించడం లేదే? అని అన్నారు. కొడాలి నాని పాత్ర ఉందా? లేదా? అనే విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

News December 29, 2024

విజయవాడ: నేడు రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌ ఆవిష్కరణ

image

విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్‌ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.

News December 29, 2024

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.

News December 29, 2024

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా గాక విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News December 29, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. వాయిదా పడ్డ పరీక్షలు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 3న జరగనున్న 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. వచ్చే నెల 3న మచిలీపట్నంలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో UG 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు జనవరి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. PG, MBA & MCA 1వ & 3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 20న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

News December 29, 2024

కృష్ణా: ఎంటెక్ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, రివైజ్డ్ షెడ్యూల్ వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని పరీక్షల విభాగం శనివారం పేర్కొంది.

News December 28, 2024

విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్

image

విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2024

విజయవాడ: 1400 మంది యువతకు ఉద్యోగాలు

image

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమానికి సుమారు 5000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ జాబ్ మేళాలో 1400 మంది నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అనంతరం ఉద్యోగం సాధించిన యువతకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

News December 28, 2024

తెలుగును చిన్నచూపు చూస్తున్నారు: ఎన్వీ రమణ

image

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు తెలుగుభాషా అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విజయవాడ కేబిఎన్‌లో జరుగుతున్న తెలుగు రచయితల మహాసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉన్నారన్నారు.