Krishna

News July 13, 2024

నడిరోడ్డుపై ప్రయాణికులకు అగచాట్లు

image

విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి బాపులపాడు మం. వీరవల్లి వద్ద మొరాయించింది. బస్సుకు మరమ్మతు చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరారవ్వడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో వీరవల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించారు. బస్ యాజమాన్యం టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంతో ఇతర బస్సుల్లో వెళ్లిపోయారు.

News July 13, 2024

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భద్రత కట్టుదిట్టం

image

విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2020లో ఆలయ భద్రతపై ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు అమలు కాకపోవడంతో తాజాగా అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు ఆడిట్ నిర్వాహకులు ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించారు. మెటల్ డిటెక్టర్లు, భద్రతా సిబ్బంది పెంపు, వారికి శిక్షణ తదితర అంశాలను వారు తమ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

News July 13, 2024

విజయవాడలో బాడీ మసాజ్ కేంద్రంపై దాడి

image

విజయవాడలో బాడీ మసాజ్ కేంద్రంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ గుణరామ్ వివరాల మేరకు.. గుణదల పంచాయతీ ఆఫీస్ రోడ్డులో బాడీ స్పా నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. అక్కడ స్పా నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇద్దరు యువతులను రక్షించామని తెలిపారు. నిందితులు కల్లం మెరీన్ వెంకటేశ్వర్లు, నాయక్‌పై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

News July 13, 2024

కృష్ణా: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు’

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

News July 13, 2024

కృష్ణా: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

విజయవాడ: TODAY HEADLINES

image

*YS జగన్‌పై కేసు నమోదు.!
*వల్లభనేని వంశీకి అరెస్ట్ గండం?
*గన్నవరం విమానాశ్రయాన్ని నం.1 చేస్తాం: ఎంపీ చిన్నీ
*ఉండవల్లిలో కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన చంద్రబాబు
*జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తా: MP బాలశౌరి
* నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం.. VRO మృతి
*చంద్రబాబు తన మార్క్ చూపించారు: దేవినేని ఉమా

News July 12, 2024

కృష్ణా: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 12, 2024

జగన్, సునీల్ కుమార్‌లపై కేసు నమోదు.. సెక్షన్లు ఇవే

image

మాజీ సీఎం <<13613892>>జగన్<<>>, సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌తో పాటు మరొక ముగ్గురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పీఎస్‍‌లో కేసు నమోదైంది. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టారు.

News July 12, 2024

విజయవాడ-బెంగుళూరు మధ్య మరో విమాన సర్వీస్

image

విజయవాడ, బెంగుళూరు మధ్య సెప్టెంబర్ 1 నుంచి నూతనంగా విమాన సర్వీస్ నడపనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. బెంగుళూరులో సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి 5.40 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, విజయవాడలో సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగుళూరు చేరుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

News July 12, 2024

బూదవాడ ప్రమాద ఘటన.. మరొకరు మృతి

image

జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ కర్మాగారం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా గురువారం అర్ధరాత్రి మరొకరు ప్రాణాలు వదిలారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూదవాడకు చెందిన అర్జున్ తుది శ్వాస విడిచారు. ఆయన ఈ ఫ్యాక్టరీలో కొన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.