Krishna

News July 12, 2024

విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

image

గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యనమలకుదురుకు చెందిన మస్తాన్ బీ (44) పున్నమ్మ తోటలో ఒక నివాసాన్ని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పోలీసులకు వచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేసి మస్తాన్ బీని మరో యువకుడిని అరెస్టు చేశారు. మరో యువతిని హోంకు తరలించారు.

News July 12, 2024

వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచడం, ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడంతో చర్చ జరుగుతోంది. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల తర్వాత వంశీ నియోజకవర్గానికి రాలేదు. అప్పటి నుంచి ఎక్కడున్నారనే సమాచారం లేదు.

News July 12, 2024

కృష్ణా: భగవద్గీతపై MA కోర్సు ఆఫర్ చేస్తున్న ఇగ్నో

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో హిందీ మాధ్యమంలో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై MA కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా.. రెండేళ్లకు ఫీజు రూ.12,600. కోర్స్ అడ్మిషన్, పూర్తి వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించవచ్చు లేదా https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News July 12, 2024

కృష్ణా: ‘100 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లు’

image

కృష్ణా జిల్లాలో ఎంపిక చేసిన 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను (కిచెన్ గార్డెన్స్) పెంచాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుపై మచిలీపట్నంలోని సన్‌స్టార్ హైస్కూల్‌లో, కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

News July 12, 2024

నూజివీడు: త్రిపుల్ ఐటీ సీట్ల సాధనలో బాలికలదే పై చేయి

image

రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించి విడుదల చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాలో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేయగా అందులో 2,713 మంది బాలికలు, 1,327 మంది బాలురు ఉన్నారు. సీట్లు సాధించిన బాలికల శాతం 67.15 కాగా, బాలురు శాతం 32.85 మాత్రమే. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,757 మందికి సీట్లు రాగా, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 283 మందికి సీట్లు వచ్చాయి.

News July 11, 2024

విజయవాడకు కొత్త పోలీస్ కమిషనర్‌

image

విజయవాడ నూతన <<13611371>>పోలీస్ కమిషనర్‌గా<<>> SV రాజశేఖర్ బాబుని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజశేఖర్ బాబు గుంటూరు రూరల్ ఎస్పీగా, లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డీజీగా కూడా పని చేశారు. రాజశేఖర్ 2006 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి. ఈ నియామక ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 11, 2024

కృష్ణా: పీసీబీ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతం

image

పెదపులిపాకలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ)కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో OSD రామారావు ఇంట్లో గురువారం పోలీసులు సోదాలు జరిపారు. OSD రామారావు ఆదేశాలతోనే కార్యాలయం నుంచి ఫైల్స్ బయటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106 కింద కేసు నమోదు చేశారు.

News July 11, 2024

‘ఈ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణించవు’

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా వెళ్లే హైదరాబాద్- షాలిమార్, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18046 రైలును ఆగస్టు 3-11 వరకు, నం.18045 ట్రైన్‌ను ఆగస్టు 2-10 వరకు విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు. 

News July 11, 2024

ANU: 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.

News July 11, 2024

మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ బ్లాక్

image

సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది. తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీకి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని కోరారు.