India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ సోమవారం పర్యటించనున్నట్లు పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో రూ.3కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పవన్ పరిశీలించనున్నట్లు చెప్పారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ (E1)విద్యార్ధి మురపాల అనూష(17) బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని సాయం కావాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు మంత్రి లోకేశ్ స్పందించారు. పేద కుటుంబానికి చెందిన అనూష కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదని తెలుపగా.. తన కార్యాలయ సిబ్బంది ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటారని లోకేశ్ తాజాగా హామీ ఇచ్చారు.
తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో సామేలు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని హాస్పిటల్కు తీసుకు వెళుతున్న క్రమంలో ఆటో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో సామేలు అక్కడికక్కడే మృతిచెందగా అతనికి సాయంగా వస్తున్న అతని భార్య పున్నమ్మ, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.
మోటుమర్రి జంక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా CST ముంబై, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.11019 & 11020 కోణార్క్ ఎక్స్ప్రెస్లు 2025 జనవరి 6 నుంచి 8 వరకు గుంటూరు – పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయన్నారు. ఆయా తేదీలలో ఈ రైళ్లు మధిర, ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేటలో ఆగవని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 2025 జనవరి 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు ANU వెబ్సైట్ చూడాలంది.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావుతో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
కృష్ణా జిల్లా పెనమలూరులో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అభిమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెనమలూరుకు చెందిన ఓ అభిమాని కోరిక మేరకు ఆయన గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దీంతో ఆ అభిమానికి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుతో నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సెల్ఫీలు దిగారు.
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.