India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని ఉయ్యూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం.. ఐటీఐ చదివిన మధుబాబు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈనెల 13న కాటూరు అంబేడ్కర్ నగర్లోని ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి రూ. 6.30 లక్షలు విలువచేసే నగలు దోచేశాడు. దీంతో బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొమ్ము రికవరీ చేశారు.
మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం నూజివీడులో జరిగిన కార్యక్రమంలో జోగి రమేశ్ ప్రత్యక్షమవ్వడంపై ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటే క్షమించాలని కోరారు. ఆ కార్యక్రమం పార్టీ పరంగా కాకుండా సామాజికపరంగా జరిగిందని తెలిపారు. తనను అక్కున చేర్చుకొని గౌరవించిన చంద్రబాబుకి క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.
గుంటూరులో ఓ బాలికను తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. విజయవాడ మీదుగా కారులో తీసుకు వెళ్లే క్రమంలో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కిడ్నాపర్లు భోజనానికి కారు ఆపారు. బాలిక హోటల్లోకి భోజనానికి వెళ్లకుండా తప్పించుకొని ఆర్టీసీ అధికారులకు కిడ్నాప్ విషయం తెలిపింది. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శబరిమలై వెళ్లేవారికై విజయవాడ(BZA)-కొల్లామ్(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు DEC 21, 28న BZA- QLN(నం.07177), DEC 23, 30న QLN-CCT(నం.07178) రైళ్లు నడుపుతామన్నారు. నం.07177 రైలు BZAలో రాత్రి 10.15కు బయలుదేరి సోమవారం ఉదయం 6.30కి QLN చేరుకుంటుందని, నం.07178 రైలు సోమవారం ఉదయం 10.45కి బయలుదేరి మంగళవారం రాత్రి 9 గంటలకు BZA చేరుకుంటుందన్నారు.
విజయవాడలోని కలెక్టరేట్లో సోమవారం PGRS-పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టంలో భాగంగా ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మిశ అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులు ఇచ్చిన గ్రీవెన్సులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనా, DRO ఎం.లక్ష్మి నరసింహం, DRDA పీడీ ఎస్.శ్రీనివాసరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం మాయం కేసు నమోదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పేర్ని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకులాట మొదలు పెట్టాయి. బందరు మండలం పొట్లపాలెంలో జయసుధ పేరిట పేర్ని గోడౌన్ నిర్మించగా అందులో 185 టన్నుల రేషన్ బియ్యం మాయంపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆ కుటుంబం తరఫున రూ.కోటి డీడీ తీసి న్యాయవాది ద్వారా సమర్పించారు.
కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో పీజీ(సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు) చదివే విద్యార్థులు రాయాల్సిన మూడో సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరింది.
కృష్ణా జిల్లాలో వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన 18 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ల్యాబ్ టెక్నీషియన్(4), ఫిమేల్ నర్సింగ్(8), వాచ్మెన్(6) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు వివరాలకై https://krishna.ap.gov.in/ చూడాలని, పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం సాయంత్రం 5గంటల లోపు మచిలీపట్నంలోని DM&HO కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.
ఉయ్యూరు మండలంలోని గండిగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గండిగుంట గ్రామానికి చెందిన పట్టపు విజయరాణి (22) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన బీఏ.ఎల్ఎల్బీ 6వ సెమిస్టర్ పరీక్షలకు2023- 24 విద్యా సంవత్సరం రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షల రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని KRU తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.