India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు.
కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.
నూజివీడులో తెలుగు తమ్ముళ్ల రగడ అధిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి పార్థసారథి వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండా పట్టిన వారికి కాకుండా, అధికారంలోకి రాగానే టీడీపీ తీర్థం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాగా చాట్రాయి మండలంలో టీడీపీకి కార్యకర్తలు రాజీనామా చేశారు.
సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో అన్నదమ్ముల స్థల పంచాయితీ పరిష్కారానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ 5వ వార్డు సభ్యురాలు భూక్యా చంటి ఇంట్లోకి వెళ్లి తిట్టి, కొట్టారని శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే నుంచి వివరణ కోరినట్లు తాజాగా సమాచారం వెలువడింది.
మంత్రి అనిత శనివారం విజయవాడలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తర్వాతి తరంలో సామాజిక స్పృహ నింపాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. బాలలకు క్రమశిక్షణ నేర్పేలా మొదటి పోలీసింగ్ తల్లి దగ్గరే మొదలవ్వాలన్నారు.
వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.
Sorry, no posts matched your criteria.