Krishna

News August 13, 2025

కృష్ణా: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హెచ్చరికలు

image

ప్రకాశం బ్యారేజ్‌లో వరద ఉద్ధృతి పెరుగుతోందని, సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని, తొలి స్థాయి హెచ్చరిక ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. బుడమేరు నదికి 5,000-10,000 క్యూసెక్కుల వరద వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండి, కాల్వల పటిష్టత చర్యలు తీసుకోవాలని సూచించారు.

News August 13, 2025

కృష్ణా: ఉచిత బస్.. ఈ ప్రాంతాలకు వీటిలో వెళ్లొచ్చు

image

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రయాణ అవసరాన్ని బట్టి మహిళలు తగిన బస్సులను ఎంచుకోవచ్చు. జిల్లాలు దాటి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ బస్సులు, జిల్లా సరిహద్దుల వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సేవలను ఉపయోగించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిటీ లిమిట్స్ దాటి వెళ్లాలంటే మెట్రో ఎక్స్ప్రెస్, నగరంలో ప్రయాణానికి ఆర్డినరీ సర్వీసులు ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు.

News August 12, 2025

కృష్ణా జిల్లాకు మూడో స్థానం

image

నెల్లూరు జిల్లా మోత్కూరు గ్రామంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు మూడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాలియా ప్రసాద్ కంకిపాడు జిల్లా కార్యాలయం నుంచి క్రీడాకారులను అభినందించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని ఆయన అన్నారు.

News August 12, 2025

మచిలీపట్నం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

image

మచిలీపట్నంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (NDD) రెండో దశ ప్రారంభమైంది. చిలకలపూడి పాండురంగ హైస్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 99 శాతం మందికి మాత్రలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. ప్రేమ్ చందు పాల్గొన్నారు.

News August 12, 2025

కృష్ణా: పొలాలు ఎండిపోతున్నా.. పరిష్కారం కనిపించని దుస్థితి

image

ఓవైపు ఎరువుల కొరత.. మరోవైపు సాగు నీటి సమస్యలు రైతన్న జీవనాధారాన్ని చిదిమేస్తున్నాయి. పెడన మండలం వత్తర్లపల్లి గ్రామంలో పరిస్థితి మరింత దీనంగా మారింది. సకాలంలో సాగునీరు అందక, అవసరమైన యూరియా ఎరువు లభ్యం కాకపోవడంతో పంటలు ఎండిపోతూ రైతు కష్టాల గాధ రాస్తున్నాయి. రైతు సమస్యపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

News August 12, 2025

కృష్ణా: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపాధ్యాయుల కొరత

image

కృష్ణా జిల్లాలో ఐఈఆర్టీ ఉపాధ్యాయుల కొరతతో ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యా సేవలు అంతరించిపోతున్నాయి. 25 మండలాల్లో 50 పోస్టులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 45 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, కృత్తివెన్ను మండలాల్లో ఒక్కో ఉపాధ్యాయుడే ఉండటంతో సేవలు ప్రభావితమవుతున్నాయని తల్లిదండ్రులు రెండో పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు.

News August 12, 2025

కృష్ణా: ఈ ఉద్యోగాలకు నేడే లాస్ట్ డేట్

image

గుడివాడ ఆర్‌టీసీ డిపోలో ఔట్‌ సోర్సింగ్ విధానంలో రోజువారీ వేతనంతో డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. హెవీ లైసెన్స్ పొందిన 18 నెలలు పూర్తై ఉండాలి. బయోడేటా, యాక్సిడెంట్ లేని సర్టిఫికెట్, ఆధార్, లైసెన్స్‌తో 12-08-2025లోపు దరఖాస్తులు సమర్పించాలి. రికార్డుల పరిశీలన అనంతరం వైద్య పరీక్ష, శిక్షణతో ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

News August 12, 2025

కృష్ణా: మహిళల వేధింపులపై ఎస్పీ సత్వర స్పందన

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన “మీ కోసం” కార్యక్రమంలో మహిళల సమస్యలు ప్రధానంగా వినిపించాయి. ఎస్పీ ఆర్.గంగాధరరావు 33 ఫిర్యాదులు స్వీకరించి చట్టపరంగా త్వరిత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు, అవనిగడ్డ నుంచి వచ్చిన మహిళలు భర్తల వేధింపులు, బెదిరింపులు, అదనపు కట్నం డిమాండ్లపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 12, 2025

మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్

image

విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సోమవారం కలిశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల పురోగతిపై నివేదికను సమర్పించి, రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ వ్యూహాలపై కూడా చర్చించారు.

News August 11, 2025

MTM: PGRS కార్యక్రమంలో 103 అర్జీలు

image

కృష్ణా జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో DRO కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. మొత్తం 103 అర్జీలు స్వీకరించగా, వాటిని సంబంధిత శాఖలకు వర్చువల్‌గా పంపించారు. రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న 23 అర్జీలను 48 గంటల్లో పరిష్కరించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. పారదర్శక సేవలు, ఖాళీ పోస్టులను కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామన్నారు.