India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ANU పరిధిలోని కళాశాలల్లో ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch)కోర్సు (C-16) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను 2025 జనవరి 6 నుంచి నిర్వహించనున్నట్లు శనివారం వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో CM చంద్రబాబునాయుడు శనివారం పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో డోకిపర్రు చేరుకున్న చంద్రబాబుకు భూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వాహకులు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు.
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు.
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు.
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి రానున్నారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొంటారు.
ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు.
కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మచిలీపట్నం, విజయవాడలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.
సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టుని ఆశ్రయించారు. కాగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు. పెదపట్నంలో కబ్జా చేసిన 100ఎకరాల మడ అడవుల విషయంలో కూడా పేర్ని నాని శిక్షార్హుడే అన్నారు. అయితే పేర్ని కుటుంబం అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2024లో జరగాల్సిన డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షలు వాయిదా పడినట్లు యూనివర్శిటీ యాజమాన్యం గురువారం తెలిపింది. ఈ పరీక్షలను 2025 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 14 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. రివైజ్డ్ టైం టేబుల్కు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని యూనివర్శిటీ తాజాగా ఒక ప్రకటనలో సూచించింది.
Sorry, no posts matched your criteria.