India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో 605, కృష్ణాలో 508 సచివాలయాల పరిధిలో వేలాదిమందికి ఈ పథకం కింద లబ్ధి అందనుంది. గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలలో పీజీ చదివిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది.
ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)- విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08538 CHZ- VSKP రైలును ఈ నెల 12,16,17 తేదీలలో, నం.08537 VSKP- CHZ రైలును ఈ నెల 15, 16న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన పవన్ విజయవాడ బుక్ ఫెయిర్ను శనివారం ఉదయం సందర్శించారు. మాములుగా ఐతే మధ్యాహ్నం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ పవన్ కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాల్స్ను ఓపెన్ చేసి ఉంచారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్లో పుస్తకాలను పరిశీలించారు.
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13 నుంచి నం.20708, 20707 వందే భారత్ రైళ్లు 16కోచ్లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్లను 7 నుంచి 14కి పెంచామని, తద్వారా 530గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,128కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ నగరంలో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ను పవన్ పరిశీలించారు. పలు రకాల పుస్తకాలను స్వయంగా ఆయన పర్యవేక్షణ చేశారు. అనంతరం నిర్వహకులు పలు పుస్తకాలను పవన్కు అందించి వాటి విశిష్టతను వివరించారు.
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో వేముల సబ్బులు అనే యువతి ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆదివారం రామవరప్పాడు గ్రామంలో ఇంట్లో తండ్రి, కూతుర్లు ఉంటున్న సమయంలోనే మరొక గదిలోకి వెళ్లి యువతి ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి నం.20833,84 వందేభారత్ రైళ్లు 20 కోచ్లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్లను 14 నుంచి 18కి పెంచామని, తద్వారా 1,128గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,440కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)-విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08534 CHZ-VSKP రైలును ఈనెల 11,13,16,18 తేదీలలో, నం.08533 VSKP-CHZ రైలును ఈనెల 12,15,17న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయి.
కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కోడి పందేల నిర్వహణకై ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బరులను రెవెన్యూ అధికారులతో కలసి ధ్వంసం చేశామన్నారు. శాంతియుత వాతావరణంలో సంక్రాంతి పండుగను జిల్లా వాసులు జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది Xలో సూచించారు.
Sorry, no posts matched your criteria.