India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగు నీరు అందిస్తామన్నారు. కుళాయి ద్వారా నాణ్యమైన మంచి నీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ఒక మనిషికి 55 లీటర్ల నీటిని అందించే కార్యాచరణ రూపొందించామన్నారు.
టెక్ తోడుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ శాఖల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబుతో కలిసి యాప్ను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పులపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించబోమని అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల ద్వారా చేపట్టిన అర్జీల పరిష్కారంపై బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, ఆర్డీవో, తహసీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను వారం రోజుల్లో పూర్తిచేసి పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటా బేస్లో చేర్చాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రగతిపై బుధవారం సమీక్షా నిర్వహించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నవారు డేటాబేస్లో నమోదు చేయబడ్డారన్నారు.
తనతో సహజీవనం చేస్తున్న జ్యోతి అనే యువతిని తన తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పల్లవి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు జ్యోతిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఘటనపై న్యాయమూర్తులు జ్యోతితో మాట్లాడి ఆరా తీశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ విచారణను ముగించారు.
శబరిమలై వెళ్లేవారికై నరసాపురం(NS)- కొల్లామ్(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ PRO ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 2025 JAN 15, 22న NS- QLN(నం.07183), JAN 17, 24న QLN- NS(నం.07184) రైళ్లు నడుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయవాడలో వ్యభిచార గృహంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాలు మేరకు చిట్టినగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ ఘటనలో నిర్వాహకురాలు సరోజిని అలాగే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నమని పోలీసులు వెల్లడించారు. నగరంలో ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సమాచారం అందించాలని సీఐ తెలిపారు.
జమిలీ ఎన్నికలకు సిపిఐ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. మంగళవారం విజయవాడలో సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి, అదానికి మధ్య అవినీతి జరిగిందని ఈ ఘటనలో అదానిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదాని ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
గుంతకల్లు డివిజన్లో ట్రాక్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్పూర్(YPR) గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు ఈ నెల 20న, నం.22884 YPR- PURI రైలు ఈ నెల 21న నంద్యాల- డోన్ మీదుగా కాక నంద్యాల- ఎర్రగుంట్ల- గుత్తి మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2 రైళ్లు డోన్లో ఆగవని మంగళవారం తెలిపారు.
మైనర్ బాలికను మాయమాటలతో మానభంగం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని మంగళవారం తీర్పునిచ్చారు. విజయవాడ కొత్తపేటకు చెందిన ఓబాలిక (17) ఓ ఫ్యాన్సీ షాప్లో పనిచేసేది. ఈ క్రమంలో 2016లో పిల్ల మోహన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేశాడు. మోహన్ పై నేరం రుజువుకావడంతో 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించారు.
Sorry, no posts matched your criteria.