India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో బజాజ్ క్యాపిటల్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్, గూగుల్ పే వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. టెన్త్ ,ఇంటర్ ,డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి 20వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 24 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో SEPT 2024లో నిర్వహించిన LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
తూర్పు నియోజకవర్గంలోని సమస్యలపై కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం సమావేశం నిర్వహించారు. విజయవాడ అశోక్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కార్పొరేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా రిటైనింగ్ వాల్ సమీపంలో 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని సూచించారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్పై బుద్ధా వెంకన్న Xలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ పాలనలో నువ్వు, జగన్ సర్వం నాకేశారని, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకే ద్రోహం చేశావు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి నిన్ను తీసుకువెళ్లిన చంద్రబాబును అవమానించిన నీ సానుభూతి కూటమి పాలనకు అవసరం లేదు’ అని పోస్ట్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్, ఊసరవెల్లి ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు.
వైసీపీ నేత గౌతమ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కోర్టు బెయిల్ కొట్టి వేయడంతో అరెస్ట్కు మార్గం సుగమైంది. విజయవాడకి చెందిన ఉమామహేశ్వర శాస్త్రి స్థలం కబ్జా, హత్యాయత్నం కేసుకు సంబంధించి గౌతమ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆయన కోసం పోలీసుల పత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.
విజయవాడలోని యార్లగడ్డ శివ, తన బావ పోసిన సాంబశివరావుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈనెల 10న శివ అతని బావమరిది రాజేశ్లు బైక్పై వెళుతుండగా శివ బావ సాంబశివరావు ట్రాక్టర్తో వెంబడించి ఢీకొట్టాడు. ఈ ఘటనలో శివ వంద అడుగులకుపైగా ఈడ్చుకు వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శివ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.