India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపైన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమావేశమైన ఆయన స్టాప్ డయేరియా క్యాంపైన్ నిర్వహణ తీరుపట్ల సమీక్షించారు. మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయం ఎమినిటీస్ సెక్రటరీల పరిధిలోని పైపులైనుల తనిఖీపై సమీక్షించారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి కుటుంబ సమేతంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడకు వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.
జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఉత్తర్ప్రదేశ్కి చెందిన హేమంత్ కుమార్ ఐదుగురి ప్రాణాలు కాపాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో 4వ అంతస్తులో పనిచేస్తున్నాని, కంగారులో పై అంతస్తులోని వారు కిందకు దిగుతుంటే వేడి తగ్గేవరకు ఇక్కడే ఉండాలని వారిని నిలువరించానన్నారు. కంగారులో కొందరు కిందకు వెళ్లడంతో వేడి సిమెంట్ ధూళి పడి గాయపడ్డారని చెప్పాడు.
విజయవాడలో ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన EPFO పర్సనల్ అసిస్టెంట్, ESIC నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. EPFO పరీక్షకు సంబంధించి 2,401 మందికి, ESIC పరీక్షకు 5,433 మంది అభ్యర్థులకు విజయవాడలో ఏర్పాటు చేసిన 25 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సృజన పరిశీలించారు.
జగ్గయ్యపేట మండలం, బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనలో పలువురు గాయపడి విజయవాడలోని మణిపాల్, గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సృజన పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
మండలంలోని పెనుగొలను గ్రామంలో ఓ వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. తిరువూరు సీఐ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగొలనులోని ఓ వ్యభిచార గృహంపై చేసిన దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
మండలంలోని పెనుగొలను గ్రామంలో ఓ వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. తిరువూరు సీఐ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగొలనులోని ఓ వ్యభిచార గృహంపై చేసిన దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ORR వెళ్తుంది.
Sorry, no posts matched your criteria.