Krishna

News January 8, 2025

కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్‌ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు. 

News January 8, 2025

కృష్ణా: రూ.4,612 కోట్ల పనులకు మోదీ ప్రారంభోత్సవాలు

image

విశాఖపట్నంలో నేడు బుధవారం పర్యటించనున్న ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం- గుడివాడ- భీమవరం- నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ చేసిన లైన్లను నేడు ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్‌ను రూ.4,612 కోట్లతో చేపట్టగా ఆ లైన్‌లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

News January 8, 2025

పేర్నినానికి బెయిల్ ఇవ్వొద్దు: అడ్వకేట్

image

మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యాన్ని మాయం చేశారన్న వాటిపై అన్ని ఆధారాలు ఉన్నాయని బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. గోడౌన్ మేనేజర్ నుంచి పేర్ని నాని బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నానికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్నారు. బెయిల్ పిటీషన్‌ను 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

News January 8, 2025

మచిలీపట్నంలో దారుణ హత్య

image

మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 8, 2025

’12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ’

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

News January 7, 2025

MTM: వసతి గృహంలో కలెక్టర్ పుట్టిన రోజు వేడుకలు

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థినుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మచిలీపట్నం బచ్చుపేటలోని వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్‌లతో కూడిన కిట్స్‌ను అందజేశారు. 

News January 7, 2025

’12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ’

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

News January 7, 2025

వీరవల్లి: ప్రియుడి మోజులో కూతురిని రోడ్డుపై వదిలిన తల్లి

image

బాపులపాడు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త రవి నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు మోజులో పడి బిడ్డను తల్లి వీరవల్లి రోడ్డుపై వదిలేసింది. సోమవారం బాలికను గుర్తించి నంద్యాల పోలీసులకు అప్పగించనున్నట్లు వీరవల్లి SI శ్రీనివాస్ తెలిపారు.

News January 7, 2025

పెనుగొలనులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

image

గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.

News January 7, 2025

జగన్‌కు షాక్ ఇచ్చిన విజయవాడ కోర్ట్

image

పాస్‌పోర్టు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌ను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుకు NOC ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. 2024లోనే పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కాగా పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సూచించింది.