Krishna

News December 16, 2024

కృష్ణా: శబరిమలై వెళ్లేవారికి 4 ప్రత్యేక రైళ్లు

image

శబరిమలై వెళ్లేవారికై విజయవాడ(BZA)-కొల్లామ్‌(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు DEC 21, 28న BZA- QLN(నం.07177), DEC 23, 30న QLN-CCT(నం.07178) రైళ్లు నడుపుతామన్నారు. నం.07177 రైలు BZAలో రాత్రి 10.15కు బయలుదేరి సోమవారం ఉదయం 6.30కి QLN చేరుకుంటుందని, నం.07178 రైలు సోమవారం ఉదయం 10.45కి బయలుదేరి మంగళవారం రాత్రి 9 గంటలకు BZA చేరుకుంటుందన్నారు.

News December 16, 2024

విజయవాడ: ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మిశ 

image

విజయవాడలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS-పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టంలో భాగంగా ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మిశ అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులు ఇచ్చిన గ్రీవెన్సులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనా, DRO ఎం.లక్ష్మి నరసింహం, DRDA పీడీ ఎస్.శ్రీనివాసరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

News December 16, 2024

మచిలీపట్నం: పేర్ని నాని ఎక్కడ.!

image

రేషన్ బియ్యం మాయం కేసు నమోదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పేర్ని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకులాట మొదలు పెట్టాయి. బందరు మండలం పొట్లపాలెంలో జయసుధ పేరిట పేర్ని గోడౌన్ నిర్మించగా అందులో 185 టన్నుల రేషన్ బియ్యం మాయంపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆ కుటుంబం తరఫున రూ.కోటి డీడీ తీసి న్యాయవాది ద్వారా సమర్పించారు. 

News December 16, 2024

కృష్ణా: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో పీజీ(సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు) చదివే విద్యార్థులు రాయాల్సిన మూడో సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరింది.

News December 16, 2024

కృష్ణా: ‘ఈ రోజే లాస్ట్ డేట్.. అప్లయ్ చేసుకోండి’

image

కృష్ణా జిల్లాలో వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన 18 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ల్యాబ్ టెక్నీషియన్(4), ఫిమేల్ నర్సింగ్(8), వాచ్‌మెన్(6) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు వివరాలకై https://krishna.ap.gov.in/ చూడాలని, పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం సాయంత్రం 5గంటల లోపు మచిలీపట్నంలోని DM&HO కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.

News December 15, 2024

ఉయ్యూరు: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

image

ఉయ్యూరు మండలంలోని గండిగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గండిగుంట గ్రామానికి చెందిన పట్టపు విజయరాణి (22) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 15, 2024

కృష్ణా: లా కోర్సు రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన బీఏ.ఎల్‌ఎల్‌బీ 6వ సెమిస్టర్ పరీక్షలకు2023- 24 విద్యా సంవత్సరం రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షల రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని KRU తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.

News December 15, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ANU పరిధిలోని కళాశాలల్లో ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch)కోర్సు (C-16) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను 2025 జనవరి 6 నుంచి నిర్వహించనున్నట్లు శనివారం వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News December 14, 2024

డోకిపర్రు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న CM చంద్రబాబు

image

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో CM  చంద్రబాబునాయుడు శనివారం పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో డోకిపర్రు చేరుకున్న చంద్రబాబుకు భూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వాహకులు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

News December 14, 2024

ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: కలెక్టర్

image

ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌తో ఇంధ‌న పొదుపు చ‌ర్య‌లు పాటించాలని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. భావిత‌రాల‌కు భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. శ‌నివారం జాతీయ ఇంధన ప‌రిర‌క్ష‌ణ వారోత్స‌వాల సందర్భంగా ప్ర‌త్యేక ర్యాలీని విజ‌య‌వాడలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడారు.