India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు పిల్లలు అదృశ్యమైన కేసును పోలీసులు ఆరు గంటలలోపే ఛేదించారు. పిల్లల అదృశ్యమైన ఘటనపై శుక్రవారం భవానీపురం పోలీసులకు వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా, చిన్నారుల కోసం ఇద్దరు డీసీపీలు, 15 బృందాలతో గాలింపు చేపట్టారు. కాగా పోలీసులు, అదృశ్యమైన పిల్లలను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో గుర్తించారు.
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి టి.జి భరత్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ను కలసి ఈ అంశంపై చర్చించానని భరత్ చెప్పారు. విజయవాడ- కర్నూలు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఏడాదిలోపు రాత్రి సమయాల్లో కర్నూలులో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారని భరత్ అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై గతంలో జరిగిన దాడి కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్ పిటిషన్ను కోర్టు ఈ నెల 8న విచారించనున్నట్టు సమాచారం.
పెనుగంచిప్రోలు మున్నేరు వరద నీటిలో మృతదేహం కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు ప్రకాశం జిల్లా కడవకుదురు గ్రామానికి చెందిన అనిల్ నాయుడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహం అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేశ్ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తాజాగా.. సీఎంగా చంద్రబాబు తొలి పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారన్నారు. అదే విధంగా జగన్ తొలి పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారంటూ వ్యంగ్యంగా పలు ఫొటోలతో ‘నాయకుడు- ప్రతినాయకుడు’ అని రాసి Xలో పోస్ట్ చేశారు.
తిరుమల ఎక్స్ ప్రెస్ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.
NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సూరాయపాలెం వద్ద కృష్ణా నదిపై భారీ వంతెన కడుతున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. NHAIఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, ఏలూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజ వద్ద చెన్నై హైవేను చేరుకోవచ్చు.
బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిడిలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసుకు సంబంధించి హతుని భార్య కీర్తనను బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కీర్తన తన భర్త అప్పారావును స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా నిందితురాలు కీర్తనకు బంటుమిల్లి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై వాసు తెలిపారు.
విజయవాడలో కేంద్ర జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో రూ.2.46కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. గోల్డ్ స్టెప్ టుబాకో సంస్థ వీటిని తయారు చేసినట్లు గుర్తించిన అధికారులు, బిహార్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.