Krishna

News July 5, 2024

ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్ సృజన

image

జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప‌టిష్ఠంగా అమ‌లు చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై ఆమె తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్ల‌లో నిల్వ‌లు, ఉచిత విధానం అమ‌లుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై చ‌ర్చించారు.

News July 4, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక స్టాక్ వివరాలు

image

జిల్లాలో 08 స్టాక్ పాయింట్ల‌లో 3.69లక్షల క్యూబిక్ మీట‌ర్ల మేర ఇసుక‌ అందుబాటులో ఉందని NTR జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. * పెండ్యాల (కంచిక‌చ‌ర్ల): 19,781* మాగ‌ల్లు (నందిగామ): 36,366* కొడ‌వ‌టిక‌ల్లు (చంద‌ర్ల‌పాడు): 9,713* అల్లూరుపాడు (వ‌త్స‌వాయి): 3,040* అనుమంచిప‌ల్లి (జ‌గ్గ‌య్య‌పేట): 56,820* పోలంప‌ల్లి (వ‌త్స‌వాయి): 922* కీస‌ర (కంచిక‌చ‌ర్ల): 1,49,703* మొగులూరు (కంచిక‌చ‌ర్ల): 93,243

News July 4, 2024

విజయవాడలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

అజిత్ సింగ్ నగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు గురువారం సాయంత్రం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్ఆర్ పేట వద్ద స్థానికులు మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా మగ మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సం. మధ్య ఉంటుందన్నారు. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

News July 4, 2024

NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరుకు ఫ్లైఓవర్: ఎంపీ చిన్ని

image

విజ‌య‌వాడ ఆర్థిక వృద్ధిని పున‌ః నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పుకున్నట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం గ‌డ్క‌రీతో స‌మావేశ‌మ‌య్యారని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 4, 2024

కృష్ణా: ‘100 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు’

image

జిల్లాలో ఎంపిక చేసిన 100 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుపై సమీక్షించారు. పెరటి తోటల పెంపకం పట్ల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ తాహేరా సుల్తాన తదితరులు పాల్గొన్నారు.

News July 4, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ నుంచి ముంబైకు ఆగస్టు 16 నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్స్ నడపనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. విజయవాడలో రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని, ముంబైలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 8.20 గంటలకు విజయవాడ చేరుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. వివరాలకు ఇండిగో సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

News July 4, 2024

విజయవాడ: YCP నాయకుల గుండెల్లో రైళ్లు..?

image

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

News July 4, 2024

విజయవాడ- విజయనగరానికి RTC సూపర్ లగ్జరీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విజయనగరానికి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని RTC విజ్ఞప్తి చేసింది.

News July 4, 2024

విజయవాడ: కవలలు సహా.. తల్లి మృతి

image

విజయవాడ రూరల్ పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి చెందారు. <<13556286>>తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉండగా కొద్దిసేపటికి ఆమే కన్నుమూశారు.<<>> వివరాల్లోకి వెళితే.. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు ఆ తర్వాత తల్లి కూడా మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు.

News July 4, 2024

క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

image

క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ సీపీ గుర్నాని‌, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. గుర్నాని బృందంతో అమరావతిలో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల వాతావరణం, వనరుల గురించి వివరించానని చంద్రబాబు స్పష్టం చేశారు.