Krishna

News December 14, 2024

నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు. 

News December 14, 2024

నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు. 

News December 14, 2024

నేడు డోకిపర్రు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి రానున్నారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొంటారు. 

News December 13, 2024

ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు: వనితా రాణి

image

ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు. 

News December 13, 2024

కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మచిలీపట్నం, విజయవాడలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

News December 13, 2024

కోర్టులో పేర్నినాని సతీమణి బెయిల్ పిటిషన్

image

సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టుని ఆశ్రయించారు. కాగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు.  పెదపట్నంలో కబ్జా చేసిన 100ఎకరాల మడ అడవుల విషయంలో కూడా పేర్ని నాని శిక్షార్హుడే అన్నారు. అయితే పేర్ని కుటుంబం అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

News December 13, 2024

కృష్ణా: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు.. రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2024లో జరగాల్సిన డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షలు వాయిదా పడినట్లు యూనివర్శిటీ యాజమాన్యం గురువారం తెలిపింది. ఈ పరీక్షలను 2025 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 14 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. రివైజ్డ్ టైం టేబుల్‌కు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని యూనివర్శిటీ తాజాగా ఒక ప్రకటనలో సూచించింది.

News December 13, 2024

ఉయ్యూరు: రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు

image

ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో బజాజ్ క్యాపిటల్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్, గూగుల్ పే వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. టెన్త్ ,ఇంటర్ ,డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి 20వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

News December 13, 2024

నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు రాక

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 24 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.

News December 13, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో SEPT 2024లో నిర్వహించిన LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.