Krishna

News July 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జులై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి గురువారం, నం.05951 SMVB- NTSK రైలును జులై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News July 3, 2024

విద్యార్థుల హాజ‌రుపై ప్ర‌త్యేక దృష్టి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఈఓ సుబ్బారావుతో కలిసి బుధ‌వారం జిల్లా విద్యాశాఖ కార్య‌క‌లాపాల‌పై కలెక్టర్ సృజన స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలోని వివిధ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ప్ర‌వేశాలు, బోధ‌నా సిబ్బంది, మౌలిక వ‌స‌తులు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల హాజ‌రుపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.

News July 3, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన డిగ్రీ(ఇయర్ ఎండ్)పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు http://anucde.info/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News July 3, 2024

ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి: క‌లెక్ట‌ర్ సృజ‌న‌

image

ర‌క్షిత తాగునీరు, పారిశుద్ధ్యంతో ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణాల మెరుగుకు దోహ‌దం చేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం ఆమె స‌మావేశం నిర్వ‌హించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల ప‌రిధిలో మంజూరైన ప‌నులు, చేప‌ట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తి త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు.

News July 3, 2024

బాపులపాడు వద్ద మృతదేహం లభ్యం

image

మండల పరిధిలోని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జంక్షన్ సీఐ నవీన్, నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇతని వయస్సు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతని చేతిపై ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉందని నిలువు చారల చొక్కా, గళ్ల లుంగి ధరించి ఉన్నాడని తెలిపారు. సమాచారం తెలిసినవారు హనుమాన్ జంక్షన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

News July 3, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ(సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.

News July 3, 2024

విజయవాడ: ప్రైవేటు ఆసుపత్రిలో కవలలు మృతి

image

విజయవాడ రూరల్ మండలం పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి తీవ్ర కలకలం సృష్టించింది. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి బండ్రపల్లి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో నేటి ఉదయం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News July 3, 2024

DSC అభ్యర్థులకు.. విజయవాడలో ఫ్రీ కోచింగ్

image

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ సంచాలకులు కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నం.8 అశోక్‌నగర్‌, విజయవాడలోని స్టడీ సర్కిల్‌లో నిర్ణీత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30తో దరఖాస్తు గడువు ముగియగా తాజాగా జులై 10 వరకు పెంచామని ఆమె చెప్పారు.

News July 3, 2024

విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం

image

ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.

News July 3, 2024

మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్‌ సోమవారం 43 మందికి పింఛన్‌లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.