Krishna

News January 3, 2025

విధి నిర్వహణలో ప్రాణం విడిచిన జవాన్

image

అరుణాచల్ ప్రదేశ్‌లో సీఆర్పీఎఫ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం తన స్వగ్రామమైన గుడివాడలోని ఎన్జీవో కాలనీకి తీసుకురానున్నారు. రామకృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

News January 3, 2025

VJA: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఈ నెల 17లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్ చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.

News January 3, 2025

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, అగర్తల మధ్య (ట్రైన్ నం. 07029/07030) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ – అగర్తల, అగర్తల – సికింద్రాబాద్ రైలు ఈ నెల 10 నుంచి నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

News January 3, 2025

VJA: మద్యం తాగే చోటు కోసం ఘర్షణ.. వ్యక్తి హత్య

image

మద్యం తాగే చోటుతో వచ్చిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామవరప్పాడుకు చెందిన వైకుంఠం న్యూ ఇయర్ రోజు ఓ శ్మశాన వాటికలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే రోజు వైకుంఠం తాగే చోట సాయి అనే వ్యక్తి ఉండడంతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి తీసుకురాగా.. మళ్లీ వైకుంఠం బయట వెళ్లాడు. మరో సారి ఘర్షణ పడడంతో సాయి కత్తితో హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News January 3, 2025

విజయవాడ: చిరంజీవి బుక్‌తో పవన్ కళ్యాణ్

image

విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

News January 2, 2025

MTM : కానిస్టేబుల్ అభ్యర్థి మృతికి కారణాలివే.!

image

మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.

News January 2, 2025

విజయవాడ: వైసీపీ నేతకు సుప్రీంలో ఊరట

image

వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.

News January 2, 2025

నాకేం తెలియదు.. పోలీసుల విచారణలో జయసుధ

image

రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గుట్టు విప్పలేదు. నిజం రాబట్టేందుకు పోలీసులు క్లిష్ట ప్రశ్నలు సంధించినా ఆమె నోరు విప్పలేదని తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ వ్యవహారాలన్నీ తమ మేనేజరే చూసుకునే వారని, తనకేమీ తెలియదని విచారణాధికారికి చెప్పినట్టు సమాచారం. జయసుధ నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో ఆమెను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.

News January 2, 2025

విజయవాడ: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే అధికారులు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా మంగుళూరు సెంట్రల్(MAQ)- వారణాసి(BSB) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.06019 MAQ- BSB రైలు ఈ నెల 18న, ఫిబ్రవరి 15న, అదేవిధంగా నం.06020 BSB- MAQ రైలు ఈ నెల 21న, ఫిబ్రవరి 15న నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, చీరాల, తెనాలిలో ఆగుతాయని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News January 1, 2025

గన్నవరం: జాతీయ పోటీలకు ఎంపికైన చిన్మయి

image

రాష్ట్రస్థాయి ఖురాష్ క్రీడల్లో అండర్-17 బాలికల 63 కేజీల విభాగంలో గన్నవరానికి చెందిన చిన్మయ్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికయింది. జనవరి 2వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు కృష్ణా జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక బాలిక మానికొండ సాయిసత్య చిన్మయి అని పీఈటీ నాగరాజు తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్మయ్‌ని పలువురు అభినందించారు.