Krishna

News December 11, 2024

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 16లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News December 11, 2024

కృష్ణా: వెన్నెల AC స్లీపర్ సర్వీసును ఆదరించండి

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి ప్రతి రోజూ విశాఖపట్నంకు వెన్నెల AC స్లీపర్ బస్సు నడపుతున్నామని RTC తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, విశాఖలో రాత్రి 10.45కి బయలుదేరి తర్వాత రోజు ఉదయం 05.35కి విజయవాడ వస్తుందని, ఈ సర్వీసును ప్రజలు ఆదరించాలని RTC అధికారులు విజ్ఞప్తి చేశారు. 

News December 11, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుండి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News December 11, 2024

సీఎం మీటింగ్‌కు వెళ్లనున్న కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీ.కే బాలాజీ, లక్ష్మిశ నేడు సీఎం మీటింగ్‌కు వెళ్లనున్నారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

విజయవాడ: రెండు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557 & 08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్ ఎకానమీ, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును డిసెంబర్ 14 నుంచి 2025 మార్చి 1 వరకు, నం.08558 MS- VSKP రైలును డిసెంబర్ 15 నుంచి 2025 మార్చి 2 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.

News December 11, 2024

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్షత గల వారు ఈ నెల 16 లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News December 11, 2024

కృష్ణా: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 10 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.

News December 11, 2024

విజయవాడలో అత్యాచార నిందితుడికి శిక్ష, జరిమానా

image

2015లో మొఘలరాజపురంకు చెందిన ఇంటర్ చదివే బాలిక(17)ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోతిన నాని(21)కి కోర్టు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షవిధించింది. నాని ఆమెను అపహరించడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2015లో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని ఈ కేసులో తుది తీర్పు చెప్పారు. నేరం ఋజువైనందున నానికి కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.

News December 11, 2024

17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

image

ఈ నెల 17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌న్నారు. ఈనెల 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మంగ‌ళ‌గిరి వెళ్త‌ర‌ని చెప్పారు. మధ్యాహ్నం 12.05 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

News December 10, 2024

13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.