Krishna

News July 3, 2024

విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.

News July 2, 2024

విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ

image

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.

News July 2, 2024

డిప్యూటీ CM ఆదేశాలతో మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి <<13500067>>మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు.<<>> దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.

News July 2, 2024

విజయవాడ: పోలీసులకు చేరిన బాలిక పోస్టుమార్టం రిపోర్ట్

image

అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో జూన్ 28న మరణించిన కరిష్మా(17) పోస్టుమార్టం రిపోర్ట్ తాజాగా పోలీసులకు చేరింది. మృతురాలు అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. కాగా మృతురాలి శరీర భాగాలను పరీక్షల నిమిత్తం హిస్టో పాథాలజీ పరీక్షలకు పంపామని, కరిష్మా మరణించిన సమయంపై స్పష్టత వచ్చేందుకు నిపుణుల నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాలని పోలీసులు చెబుతున్నారు.

News July 2, 2024

విజయవాడ: ఇంజినీరింగ్ కళాశాలలో రూ.82 లక్షల చోరీ

image

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రూ.82 లక్షలు చోరికి గురయ్యాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం కళాశాలలో భద్రపరిచిన నగదు చోరికి గురైన విషయాన్ని సోమవారం కళాశాలకు వచ్చిన సిబ్బంది ఆలస్యంగా గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ చోరీ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News July 2, 2024

కృష్ణా: కార్గో సేవలపై మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో ఆపరేషన్స్ జులై 1 నుంచి పునఃప్రారంభం అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కార్గో రవాణా ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కార్గో కార్యకలాపాల ద్వారా విజయవాడ విమానాశ్రయ ఆదాయం పెరగనుందని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.

News July 2, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీ-ఫార్మసీ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్సిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News July 2, 2024

వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ సమీక్ష

image

ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్ట కార్యాచ‌రణ ప్రణాళికతో ప్ర‌త్యేకంగా దృష్టిసారించి సీజ‌న్‌ను విజ‌య‌వంతం చేసేలా కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ సృజ‌న ఆదేశించారు.సోమవారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌ట్టు, ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య శాఖ‌ల‌తో పాటు మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

News July 2, 2024

డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జులై 1 సోమ‌వారం నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు స్టాప్ డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కలెక్టర్ సృజన ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో డీఎమ్‌హెచ్‌ఓ సుహాసినితో కలిసి కలెక్టర్ స్టాప్ డ‌యేరియా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News July 1, 2024

కృష్ణా: జిల్లాలో 95.58% మేర పెన్షన్ల పంపిణీ పూర్తి

image

NTR భరోసా పథకం కింద 95.58% మేర పెన్షన్ల పంపిణీతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 2,42,321 మంది పెన్షనర్లకు రూ.162.49కోట్లకు గాను రాత్రి 7.30ని.ల సమయానికి 2,31,598 మందికి రూ.155.31 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 97.2% మందికి, అత్యల్పంగా తాడేపల్లి మున్సిపాల్టీలో 91.52% మందికి పెన్షన్ల పంపిణీ చేశారు.