India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్సైట్లో ఈ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఏ.కొండూరు మండలం కంభంపాడులో పోలింగ్ జరిగిన రోజున ఎంపీ కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై తిరువూరు MLA కొలికపూడి శ్రీను తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. MLA ఫిర్యాదు మేరకు రాళ్ల దాడికి పాల్పడ్డ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు, రామకృష్ణ, శివకృష్ణతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏ.కొండూరు పోలీసులు తెలిపారు.
మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లారీ తిరగబడింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ సాయంత్రం 6.30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాలన్నారు.
జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మండలంలోని చేవేండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు దేశ సరిహద్దుల్లో మృతి చెందారు. 2 రోజుల క్రితం దేశ సరిహద్దుల్లో వరద ముంపులో ట్యాంకర్ కొట్టుకుపోగా అందులో ఉన్న నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు సైన్యంలో చేరారు. నాగరాజుకు భార్య, యేడాది పాప ఉంది. సోమవారం నాగరాజు మృతదేహం స్వగ్రామానికి రానుందని కలెక్టర్ తెలిపారు.
జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తానని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగు తమ్ముళ్లు నేరుగా కలుసుకునే సదవకాశాన్ని కల్పించినట్లు పామర్రు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఎందుకు సీఎం చంద్రబాబును కలవాలనుకుంటున్నారో సహేతుకమైన కారణాన్ని 73062 99999 సెల్ నంబర్కు తెలియజేస్తే, ఎప్పుడు వచ్చి కలవాలో చెబుతామంది. కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులకు చేరువుగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
టీడీపీ ప్రభుత్వం రాకతో రాజధాని అమరావతి పునర్నిర్మాణం పురుడు పోసుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. ఐదేళ్లపాటు అమరావతిపై జగన్ సాగించిన విధ్వంసానికి తెరపడిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ను సరిచేసి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం ముందుకు సాగుతుందని ఉమ Xలో పోస్ట్ చేశారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సత్రాగచ్చి (SRC), సికింద్రాబాద్ (SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07222 SRC- SC ట్రైన్ను జూలై 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు, నం. 07221 SC- SRC ట్రైన్ను జూలై 2 నుంచి సెప్టెంబర్ 28 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Sorry, no posts matched your criteria.