Krishna

News December 5, 2024

రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్‌డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.

News December 5, 2024

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహశీల్దార్‌లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

News December 5, 2024

7న కానూరుకు సీఎం చంద్రబాబు రాక

image

పెనమలూరు మండలంలోని కానూరుకు ఈనెల 7వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. ఈ విషయమై అధికారులతో గురువారం మచిలీపట్నంలో సమావేశమయ్యారు. కానూరులోని మురళీ రిసార్ట్స్‌లో ‘ఉర్జవీర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

News December 5, 2024

జిల్లా అధికారుల పర్యవేక్షణలో రెవెన్యూ సదస్సులు: కలెక్టర్‌

image

రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు విజయవంతానికి జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని కలెక్టర్‌ జి.లక్ష్మిశ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామపంచాయతీల పరిధితో పాటు, విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయల పరిధిలో కూడా సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

News December 5, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా బ్రహ్మపూర్(BAM), సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07027 SC-BAM ట్రైన్‌ DEC 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, నం.07028 BAM-SC ట్రైన్‌ DEC 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News December 5, 2024

కృష్ణా: RWS అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

జిల్లాలో RWS అధికారుల పనితీరుపై కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో RWS ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమీక్షించారు. RWS అధికారులు చేపట్టిన పనుల్లో 25% కూడా పూర్తి కాకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 

News December 5, 2024

కృష్ణా: స్పెషల్ రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-చెన్నై ఎగ్మోర్(MS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08557 VSKP-MS రైలును DEC 7 నుంచి 2025 MARCH 1 వరకు ప్రతి శనివారం, నం.08558 MS-VSKP మధ్య నడిచే రైలును DEC 8 నుంచి 2025 MARCH 2 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News December 5, 2024

RWS అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మండలాలవారీగా తాగునీటి పథకాల మరమ్మతు పనులు, అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణాలు, మరమ్మతు పనుల గురించి సమీక్షించారు. CSR, ఎంపీ ల్యాడ్స్, జిల్లా మినరల్ ఫండ్స్‌తో ఈ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని RWS అధికారులకు కలెక్టర్ DK బాలాజీ ఆదేశాలిచ్చారు. 

News December 4, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2020-21 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. DEC 18-2025 JAN 3 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

News December 4, 2024

ఎన్టీఆర్: వైసీపీ నేత విద్యాసాగర్ కేసులో తీర్పు రిజర్వ్ 

image

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసును బుధవారం హైకోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈనెల 9న ఇస్తామని పేర్కొంది. విద్యాసాగర్ 76 రోజులుగా జైలులో ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే నిందితుడు విద్యాసాగర్ కేసును ప్రభావితం చేస్తారని నటి కాదంబరి తరఫు లాయర్ పేర్కొన్నారని తాజాగా సమాచారం వెలువడింది. 

error: Content is protected !!