Krishna

News December 4, 2024

పశువుల ఆశ్రయ నిర్మాణాలు ఆవశ్యకం: DK బాలాజీ

image

హోమ్ మంత్రి అనిత బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని లంక గ్రామాలలో పశువుల ఆశ్రయ నిర్మాణాలు నిర్మించాలని బాలాజీ వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు పశు నష్టం జరగకుండా ఈ భవనాలు ఉపయుక్తంగా ఉంటాయని బాలాజీ వివరించారు.

News December 4, 2024

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నాం: కలెక్టర్ 

image

ఈనెల 6 నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజలకు ముందుగానే తెలియపరిచేలా సదస్సుల షెడ్యూల్‌ను కరపత్రాల రూపంలో ముద్రించామన్నారు. 

News December 4, 2024

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి

image

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో రహదారి వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతుతో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగిందని, రైతులు భయపడవద్దని ఆయన తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.

News December 4, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సు(Y17 నుంచి Y23 బ్యాచ్‌లు) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను 2025 జనవరి 28 నుండి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 13లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.

News December 4, 2024

బ్లేడ్‌తో భర్త గొంతు కోసి చంపిన భార్య.. అనుమానాలే కారణం

image

భర్త గొంతు కోసం భార్య <<14781158>>హతమార్చిన<<>> ఘటన నిన్న గుడివాడలో జరిగిన సంగతి తెలిసిందే. భార్యభర్తల మధ్య అనుమానపు విభేదాలే హత్యకు కారణంగా తెలిసింది. రైలుపేటకు చెందిన చిన్న, జ్యోతిలు ఐదు చోరీ కేసుల్లో నిందితులగా ఉన్నారు. విభేదాలు తలెత్తి ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. నిన్న జ్యోతి ఇంటికి రాగా ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బ్లేడ్‌తో భర్త పీక కోసి చంపింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.

News December 4, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు

image

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు రాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. నూజివీడులోని కోనేరుపేటలో భూప్రకంపనలు వచ్చాయి. నిమిషం పాటు భూమి కంపించడంతో ఇల్లు మొత్తం కదిలి, సామాను చిందర వందర అయినట్లు స్థానికురాలు మస్తాన్ బీ  Way2Newsతో చెప్పారు. ఇటు VJA, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలోనూ భూకంపం వచ్చింది.

News December 4, 2024

బాలికను మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు

image

బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన వ్యక్తిపై బంటుమిల్లి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరిసే వెంకటేశ్వరస్వామి(23)కి బాలికతో(16)తో ఏడాది క్రితం పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకుని తల్లిని చేశాడు. నిన్న బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పెళ్లికి నిరాకరించడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది.

News December 3, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2023 – 24 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 18 – 2025 జనవరి 3 మధ్య నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని KRU సూచించింది.

News December 3, 2024

విద్యావ్య‌వ‌స్థ‌కే అతిపెద్ద పండుగ: కలెక్టర్ లక్ష్మి షా

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 7న పాఠ‌శాల విద్యావ్య‌వ‌స్థ‌కే అతిపెద్ద పండ‌గ‌గా రాష్ట్ర వ్యాప్తంగా మెగా త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నుంద‌ని కలెక్టర్ లక్ష్మి షా తెలిపారు. మంగ‌ళ‌వారం విజయవాడ మెగా పేరెంట్స్‌, టీచ‌ర్స్ మీటింగ్ స‌న్న‌ద్ధ‌త‌పై ఎంఈవోల‌తో పాటు అధికారుల‌తో స‌మావేశం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని డీఈఓ సుబ్బారావు కోరారు.

News December 3, 2024

విజయవాడలో రెండు దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు 

image

విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.

error: Content is protected !!