Krishna

News December 9, 2024

కృష్ణా: వరి రైతులకు APSDMA అధికారుల కీలక సూచనలు

image

కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తడిసిన వరి పనలు కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేయడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేలా పిచికారీ చేయాలన్నారు.

News December 9, 2024

కృష్ణాజిల్లా రైతాంగానికి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక విజ్ఞప్తి

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 10,11,12 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటను కోయకుండా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

News December 9, 2024

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాలతో పాటు మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. 

News December 9, 2024

కృష్ణా: MCA పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MCA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చంది. 

News December 9, 2024

విజయవాడ మీదుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు 

image

అయ్యప్ప భక్తులకై విజయవాడ మీదుగా మౌలాలి(MLY)-కొల్లామ్‌(QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 2025 జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి శనివారం MLY-QLN(నం.07171), 2025 జనవరి 6 నుంచి 27వరకు ప్రతి సోమవారం QLN-MLY(నం.07172) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News December 8, 2024

విజయవాడలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నటల్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

News December 8, 2024

మాజేరులో ధాన్యం పరిశీలించిన కలెక్టర్

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం, దేవరకోట గ్రామాల్లో పర్యటించి రోడ్డు వెంబడి ఆరబోసుకున్న ధాన్యం పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

News December 8, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02811 BBS- YPR రైలును DEC 14 నుంచి 2025 FEB 22 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR- BBS మధ్య నడిచే రైలును DEC 9 నుంచి 2025 FEB 24 వరకు ప్రతి సోమవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, విజయవనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News December 8, 2024

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..APSSDC ద్వారా ఉచిత శిక్షణ

image

కృష్ణా: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకై APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. BSC నర్సింగ్, మిడ్‌వైఫరీ(GNM), జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 10లోపు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి 6 నెలల శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు APSSDC కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

News December 8, 2024

మైలవరం: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని  శుక్రవారం సాయంత్రం రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థినిని వెంటనే ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతోంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.