Krishna

News June 30, 2024

విజయవాడలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

రామలింగేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు పటమట ఎస్సై శాతకర్ణి తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మృతుడి వయసు సుమారు 50సం. వరకు ఉంటుందని చెప్పారు. మృతిని ఆచూకీ తెలిసిన ఎడల పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News June 30, 2024

కృష్ణా: పెన్షన్ల పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్‌లు

image

జులై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీకి జిల్లాలో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు గాను కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 2.42లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

News June 30, 2024

తొలిరోజే 100% పంపిణీ పూర్తి చేయాలి: నీరభ్ కుమార్

image

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని రేపే 100% పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఉదయం 6 నుంచే పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇందులో నిర్లక్ష్యం జరిగితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.

News June 30, 2024

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు: సీపీ రామకృష్ణ

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ రామకృష్ణ తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మొత్తం 92 రోజుల పాటు సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. 30 పోలీస్ యాక్ట్ అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసు కుంటామని సీపీ స్పష్టం చేశారు.

News June 30, 2024

విజయవాడ విమానాశ్రయంలో రేపటి నుంచి కార్గో సేవలు ప్రారంభం

image

గన్నవరం విమానాశ్రయంలో రేపటి నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నట్లు విమానశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ సేవలకు ముందడుగు పడినప్పటికీ కరోనా వల్ల నిలిచిపోయిందన్నారు. తాజాగా కార్గో సేవలను ఒమెగా ఎంటర్ ప్రైజెస్ దక్కించుకుంది. చేప, రొయ్యలతో పాటు, పాలు, పూలు, పండ్లు, మిర్చి, తదితరాలను దేశంలోని ఏప్రాంతానికైనా గంటల వ్యవధిలో చేర్చేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందన్నారు.

News June 30, 2024

చందర్లపాడు: గొడ్డలితో తమ్ముడిపై అన్న దాడి

image

మండలంలోని తుర్లపాడులో శనివారం తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. SI ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యానందం, సత్యంబాబులు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికీ తల్లికి గృహనిర్మాణ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నపై చేయి చేసుకోగా అన్న గొడ్డలితో తమ్ముడిపై మెడపై నరికాడు. పోలీసులు సత్యానందాన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. క్షతగాత్రుడు విజయవాడలో చికిత్సపొందులతున్నాడు.

News June 30, 2024

కృష్ణా: పీజీ విద్యార్థులకు అలర్ట్..రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన పీజీ- ఆర్ట్స్ గ్రూపులు(సెమిస్టర్ ఎండ్)పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు http://anucde.info/ వెబ్‌సైట్ చూడాలంది.

News June 30, 2024

కృష్ణా: నేడు రాష్ట్ర చెస్ జట్టు ఎంపిక పోటీలు

image

విజయవాడలోని స్ప్రింగ్ బోర్డు ప్లే స్కూల్‌లో రేపు ఆదివారం రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చెస్ సంఘ అనుమతితో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టోర్నీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన వారిని, అండర్- 7, 9, 11, 13, 15 కేటగిరీల్లో తొలి స్థానం పొందిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు.

News June 30, 2024

కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 30, 2024

ఫించన్ల పంపిణీపై కలెక్టర్లతో వీసీ నిర్వహించిన నీరభ్ కుమార్

image

రాష్ట్రంలో జులై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జులై 1వ తేదీన 65,18,496 మందికి వివిధ ఫించన్ దారులకు పెన్షన్ అందిస్తామన్నారు.