Krishna

News June 30, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News June 30, 2024

ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో పెన్ష‌న్ల పంపిణీపై దృష్టిపెట్టండి: కలెక్టర్ సృజన

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు అందించేందుకు ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో, స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను శనివారం ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. 1వ తేదీ ఉద‌యం 6గంట‌ల‌కు పెన్ష‌న్ పంపిణీని ప్రారంభించి ల‌బ్ధిదారులంద‌రికీ పెన్ష‌న్ మొత్తం అందించేందుకు కృషిచేయాల‌న్నారు.

News June 29, 2024

కృష్ణా: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

image

కల్కి 2898 AD చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వాహనం అయిన బుజ్జి రేపు విజయవాడ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విజయవాడ ట్రెండ్‌సెట్ మాల్ వద్ద బుజ్జి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

News June 29, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ, భద్రాచలం రోడ్ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూలై 1 నుంచి 31 వరకు నం.07278 భద్రాచలం రోడ్-విజయవాడ, నం.07279 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఆయా రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించారు.

News June 29, 2024

కృష్ణా: స్త్రీ శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమానికి తోడ్పాటునందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి పథకం, సమగ్ర శిశు సంరక్షణ పథకం, గృహహింస, చైల్డ్ హెల్ప్ లైన్-1098, చిల్డ్రన్ హోమ్, శిశు గృహ, స్వధార్ గృహ తదితర అంశాలపై సమీక్షించారు.

News June 29, 2024

ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్ సృజన

image

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.

News June 29, 2024

కృష్ణా: సహాయం చేయడానికి వెళ్లి దుర్మరణం

image

నందిగామ మం. ఐతవరంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర టోల్‌గేట్‌లో పని చేసే సంకురామరాజు, అతని తండ్రి మాధవరావు ఐతవరం హైవే వద్ద నివాసం ఉంటారు. లారీ ప్రమాదం జరిగినట్లు గుర్తించి టోల్ ప్లాజాకు ఫోన్ చేస్తూ వారిద్దరూ లారీ ముందు నిల్చున్నారు. ఈ క్రమంలో ఓ లారీ వెనకవైపు నుంచి ప్రమాదం జరిగిన లారీని ఢీకొట్టింది. వీరిపైనుంచి ఆ వాహనం వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

News June 29, 2024

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచన

image

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.

News June 29, 2024

మున్సిపల్ అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఒకటో తేదీన 90 శాతం పైగా పింఛన్లు పంపిణీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మున్సిపల్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

News June 29, 2024

మచిలీపట్నం: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. ఐదేళ్ల జైలు శిక్ష

image

బాలిక స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మచిలీపట్నం పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. మైలవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2015లో స్నానం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన రాజా అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష , రూ.4వేల జరిమానా విధించారు.