India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 8న మొత్తంగా 180 మార్కులకు ఈ పరీక్ష జరగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://portal.bseap.org/APNMMSTFR/frmDownloadNmmsHT_C.aspx అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయి అమ్మిన సరఫరా చేసిన వారితో సత్సంబంధాలు కొనసాగించిన గంజాయ్ షీట్ తెరుస్తామని సెంటర్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. విజయవాడలో నేడు ఆయన మాట్లాడుతూ.. గంజాయి విషయంలో ఒక కేసుకు మించి ఎన్ని కేసులున్నా రౌడీషీటు తెరుస్తామని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందవంటూ హెచ్చరించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేసి పింఛన్ అందిందా లేదా అని అడిగే వ్యవస్థను తీసుకొస్తామని CM చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో IVRS ద్వారా ఆయన పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాలో 4,70,210 మంది పింఛన్ లబ్దిదారులుండగా రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. సీఎం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మీ స్పందన ఏమిటో తెలియజేయండి.
హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలో జరుగుతున్న హరిహరవీరమల్లు షూటింగ్లో ఉన్నానని తన ఇన్స్టాలో ఆదివారం పోస్ట్ చేశారు. ఈ షూటింగ్లో పాల్గొనే నిమిత్తం ఆమె నిన్న విజయవాడ చేరుకున్నట్లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
కంకిపాడులో శనివారం మిని వ్యాన్ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏసుబాబు అనే వ్యక్తి మరణవార్త విన్న తన తల్లి సుధారాణి (60) కుప్పకూలింది. తన కొడుకు మరణ వార్త తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా మరణించింది. కాగా ఈ విషాద ఘటనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీరి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA(హాస్పిటల్ మేనేజ్మెంట్ )కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఎవరైనా వేధిస్తుంటే భయపడవద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సూచించారు. ఇలాంటి బెదిరింపులు ఎదురైతే https://stopncii.org/ సైట్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలు సోషల్ మీడియా నుంచి తొలగిస్తారన్నారు. ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ యంత్రాంగం సూచించింది.
పవన్ కళ్యాణ్, నిధిఅగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు(HHVM) షూటింగ్కి హాజరయ్యే నిమిత్తం నిధిఅగర్వాల్ నగరానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఆమె ‘గుడ్మార్నింగ్ విజయవాడ #hhvm’ అంటూ తన ఇన్స్టా ఖాతాలో స్టోరీ అప్డేట్ చేశారు. కాగా విజయవాడ పరిసర ప్రాంతాలలో హరిహర వీరమల్లు తుది షెడ్యూల్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.
గుంతకల్ డివిజన్లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్పూర్(YPR) గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్లో ఆగవని తెలిపారు.
Sorry, no posts matched your criteria.