India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా అమలుచేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇవ్వడంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.
ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్ గురువారం తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది స్విమ్మర్లు పాల్గొంటారని అయన పేర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కృష్ణా (D), నాగాయలంకకు చెందిన పృథ్వీరాజ్ RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లై పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు 2004 సంవత్సరం పీడకలను మిగిల్చింది. పెను విధ్వంసంలో 27 మంది అసువులు బాసారు. సరిగ్గా నేటికి ఆ విషాద విపత్తు సంభవించి 20 ఏళ్లు. సునామీ సృష్టించిన భీభత్స అలల కారణంగా మంగినపూడి బీచ్ చూడటానికి వచ్చిన 27 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. 4 మండలాలను సునామీ ముంచేయగా రూ.కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు నీట మునగ్గా, మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
పొన్నవరం గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు. ఈ పోటీలకు 2008 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
గుడ్లవల్లేరు మండలం అంగళూరులో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతుడి స్నేహితుల వివరాల మేరకు.. అంగళూరు గ్రామానికి చెందిన కొమ్మలపాటి సాయి (26) కౌతవరం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. సాయి బౌలింగ్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు గుడివాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కోడూరు మండలం పిట్టల్లంకలో విద్యుత్ షాక్తో పంచాయతీ స్వీపర్ రంగారావు (54) మృతి చెందారు. ఎస్సై చాణిక్య వివరాల మేరకు.. పంచాయతీలో స్వీపర్గా పని చేస్తున్న రంగారావు బుధవారం వాటర్ ట్యాంక్ నిండడంతో స్విచ్ ఆపేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Sorry, no posts matched your criteria.