Krishna

News May 7, 2025

కృష్ణా: బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ఫలితాలను తన ఛాంబర్‌లో విడుదల చేశారు. 1,254 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 1012 మంది (80.70%) ఉత్తీర్ణులయ్యారన్నారు. సప్లమెంటరీలో 409 మంది పరీక్షలు రాయగా 279 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.

News May 7, 2025

కృష్ణా జిల్లాలో మత్స్యకారులకు రూ.26.15 కోట్ల భృతి

image

సముద్రంలో వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారుల జీవనోపాధికై రూ.20వేలు చొప్పున భృతిని శనివారం అందజేయనున్నారు. జిల్లాలో 2,263 మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉండగా 13,077 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20వేలు చొప్పున రూ.26.15కోట్లు మంజూరైనట్టు మత్స్య శాఖ జేడీ తెలిపారు. ఈ మొత్తాన్ని మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్ కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా అందజేయనున్నారు.

News May 7, 2025

ఉయ్యూరులో ఈనెల 30న జాబ్ మేళా

image

ఈనెల 30న ఉయ్యూరు AG&SG సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు నైపుణ్య అభివృద్ధి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజ్యూమ్, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.

News May 7, 2025

కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

image

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2025

కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

image

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2025

కృష్ణా: విడిదలైన సెలవులు.. గాలిలో గల్లంతైన ఉపశమనం.!

image

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుంటే, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు ప్రకటించాయి. కానీ అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం బ్రిడ్జ్ కోర్సుల పేరుతో విద్యార్థులపై హాజరు ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి మిడ్డే వరకు మండే ఎండలో తరగతులు సాగుతున్నాయి. ఇరు వైపుల ఒత్తిడితో విద్యార్థులు విసుగెత్తిపోతుండగా, తల్లిదండ్రులు అధికారుల జోక్యం కోరుతున్నారు. 

News May 7, 2025

మచిలీపట్నం: జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడు రోజులు క్రితం బాధ్యతలు స్వీకరించిన గోపిని శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని కలిసిన కలెక్టర్ మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు భేటీ అయి జిల్లాలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, న్యాయ అంశాలపై చర్చించారు. 

News May 7, 2025

గన్నవరం విమానాశ్రయంలో మోదీ పర్యటనపై సమీక్ష 

image

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. 

News April 25, 2025

తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

image

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. 

News April 25, 2025

కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

image

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.