Krishna

News December 23, 2024

క్రీడాకారుల భ‌విష్య‌త్తే ప్రభుత్వానికి ముఖ్యం: శాప్ ఛైర్మన్

image

క్రీడాకారుల భ‌విష్య‌త్తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని, దానికి అనుగుణంగా క్రీడా సంఘాలు, శాప్ అధికార యంత్రాంగం స‌మ‌న్వ‌యం చేసుకుని క్రీడాకారుల‌కు అన్ని విధాలుగా తోడ్పాటు నందించాల‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు. విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ అధికారుల‌కు, కోచ్‌ల‌కు క్రీడారంగంలో అమ‌లు చేయాల్సిన అంశాల‌పై సోమ‌వారం ఆయ‌న దిశానిర్ధేశం చేశారు.

News December 23, 2024

కాంట్రాక్టు సంస్థలపై ఏపీ సీఆర్డీఏ కీలక ప్రకటన 

image

అమరావతి నిర్మాణంలో రూ.100కోట్లకు పైబడి పనులను ప్యాకేజీల వారీగా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. ఈ పనులలో కాంట్రాక్టు సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు సులభతర విధానాన్ని రూపొందించామని కమిషనర్ కె.భాస్కర్ తాజాగా విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్‌కై https://crda.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News December 23, 2024

కృష్ణా: రేషన్ బియ్యం కేసు.. అజ్ఞాతంలోకి ఆ ముగ్గురు

image

రేషన్ బియ్యం కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ, కుమారుడు కిట్టుతో పాటు గోడౌన్ మేనేజర్ మానసతేజ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి శనివారం పోలీసులు వెళ్లగా.. ఆయన లేకపోవడంతో ఆ ఇంటికి నోటీసులు అంటించామని పోలీసులు పేర్కొంటున్నారు.  

News December 23, 2024

నేటి సాయంత్రం విజయవాడలో సీఎం పర్యటన

image

విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో నేడు ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు కూటమి మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.

News December 23, 2024

హత్య ఘటనలో నిందితుడిని పట్టించిన బంపర్

image

NTR జిల్లా రెడ్డిగూడెంకు చెందిన మురళి రెడ్డి.. తన భార్య, కుమార్తెతో హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. అతని కుమార్తె(14)ను కుమార్ అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఏడాది కిందట కుమార్‌ను మురళి రెడ్డి హత్య చేశాడు. ఆ తర్వాత నంబర్ మార్చి ఆ ఆటోను మురళి రెడ్డే వాడుతున్నాడు. తాజాగా ఆ ఆటోను కుమార్ బావమరిది యోహాన్ గుర్తించి పోలీసులకు చెప్పాడు. దీంతో మురళి రెడ్డిని అరెస్ట్ చేశారు.

News December 23, 2024

నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం.. షెడ్యూల్ ఇదే.! 

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కృష్ణాజిల్లా కంకిపాడులో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామం 10.40గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి 11:15 నుంచి 12గంటల వరకు గుడివాడలోని మల్లయ్యపాలెం గ్రామం వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి 1:30కు మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌కి చేరుకుంటారు. 

News December 22, 2024

విజయవాడ: కనకదుర్గమ్మని దర్శించుకున్న మంత్రి అనిత

image

విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మవారిని మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను మంత్రికి అందజేశారు.  అనంతరం మంత్రి దీక్షల విరమణకు విచ్చేసిన భవానీలతో మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

News December 22, 2024

రేపు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ 

image

కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ సోమవారం పర్యటించనున్నట్లు పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో రూ.3కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పవన్ పరిశీలించనున్నట్లు చెప్పారు. 

News December 22, 2024

అనూష వైద్య చికిత్స బాధ్యత నాది: మంత్రి లోకేశ్

image

నూజివీడు ట్రిపుల్ ఐటీ (E1)విద్యార్ధి మురపాల అనూష(17) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని సాయం కావాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. పేద కుటుంబానికి చెందిన అనూష కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదని తెలుపగా.. తన కార్యాలయ సిబ్బంది ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటారని లోకేశ్ తాజాగా హామీ ఇచ్చారు. 

News December 22, 2024

గుండెపోటుతో హాస్పిటల్‌కి వెళుతుండగా ప్రమాదం 

image

తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో సామేలు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని హాస్పిటల్‌కు తీసుకు వెళుతున్న క్రమంలో ఆటో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో సామేలు అక్కడికక్కడే మృతిచెందగా అతనికి సాయంగా వస్తున్న అతని భార్య పున్నమ్మ, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.