India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.
‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. ఈ పథకం అమలుపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద రైతులకు పంట నష్టం జరిగినప్పుడు భీమా మొత్తం అందుతుందని, పథకం ప్రయోజనాలు రైతులకు వివరించి ఆసక్తి గల రైతులందరిని నమోదు చేస్తారన్నారు.
విజయవాడ మెట్రో మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు మధ్య 38.4 కి.మీ. మేర నిర్మించేలా DPR తయారైంది. దీనికి రూ.11,009కోట్ల వ్యయం అవ్వొచ్చని ప్రభుత్వ అంచనా.1A, 1B కారిడార్ల భూసేకరణకు రూ.1,152 కోట్ల వ్యయం రాష్ట్రమే భరిస్తుందని DPRలో పేర్కొంది. కాగా 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య 27.5 కి.మీ. మేర మెట్రో నిర్మించేలా DPR సిద్ధమైంది.
ప్రజా సమస్య చిన్నదైనా.. పెద్దదైనా సమాన ప్రాధాన్యమిచ్చి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చుతుందన్నారు.
కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ (DCHS)గా బాధ్యతలు స్వీకరించిన డా. జయకుమార్ సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న జయకుమార్ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కృష్ణాజిల్లా డీసీహెచ్ఎస్గా బదిలీపై వచ్చారు. ఈయన గతంలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా కూడా విధులు నిర్వర్తించారు.
మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పుల్లూరు, పోరాట నగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. వారి వద్ద నుంచి రూ.29,100నగదు, 10 కోడి పుంజులు, 10 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా HIV రోగులు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. జిల్లాలో 19,865 మంది HIV రోగులుండగా, ఈ జాబితాలో 13,166 మంది రోగులతో కృష్ణా జిల్లా 12వ స్థానంలో ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందిస్తున్నామన్నారు.
8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 8న మొత్తంగా 180 మార్కులకు ఈ పరీక్ష జరగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://portal.bseap.org/APNMMSTFR/frmDownloadNmmsHT_C.aspx అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయి అమ్మిన సరఫరా చేసిన వారితో సత్సంబంధాలు కొనసాగించిన గంజాయ్ షీట్ తెరుస్తామని సెంటర్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. విజయవాడలో నేడు ఆయన మాట్లాడుతూ.. గంజాయి విషయంలో ఒక కేసుకు మించి ఎన్ని కేసులున్నా రౌడీషీటు తెరుస్తామని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందవంటూ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.