Krishna

News December 1, 2024

కృష్ణా: CM చంద్రబాబు నిర్ణయంపై మీరేమంటారు

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేసి పింఛన్ అందిందా లేదా అని అడిగే వ్యవస్థను తీసుకొస్తామని CM చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో IVRS ద్వారా ఆయన పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాలో 4,70,210 మంది పింఛన్ లబ్దిదారులుండగా రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. సీఎం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మీ స్పందన ఏమిటో తెలియజేయండి.

News December 1, 2024

విజయవాడలో హరిహరవీరమల్లు షూటింగ్‌

image

హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలో జరుగుతున్న హరిహరవీరమల్లు షూటింగ్‌లో ఉన్నానని తన ఇన్‌స్టాలో ఆదివారం పోస్ట్ చేశారు. ఈ షూటింగ్‌లో పాల్గొనే నిమిత్తం ఆమె నిన్న విజయవాడ చేరుకున్నట్లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 

News December 1, 2024

కొడుకు లేడ‌ని తెలిసి.. త‌ల్లి మ‌ర‌ణం

image

కంకిపాడులో శనివారం మిని వ్యాన్‌ను ఓ కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌నలో ఏసుబాబు అనే వ్యక్తి మ‌ర‌ణ‌వార్త విన్న తన త‌ల్లి సుధారాణి (60) కుప్పకూలింది. తన కొడుకు మరణ వార్త తట్టుకోలేక కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే ఆమె కూడా మ‌ర‌ణించింది. కాగా ఈ విషాద ఘ‌ట‌న‌లు చూప‌రుల‌ను కంట‌త‌డి పెట్టించాయి. వీరి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

News December 1, 2024

కృష్ణా: MBA రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA(హాస్పిటల్ మేనేజ్‌మెంట్ )కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 30, 2024

వేధింపుల నుంచి ఇలా రక్షణ పొందండి: ఎన్టీఆర్ జిల్లా పోలీసులు

image

ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఎవరైనా వేధిస్తుంటే భయపడవద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సూచించారు. ఇలాంటి బెదిరింపులు ఎదురైతే https://stopncii.org/ సైట్‌లో ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలు సోషల్ మీడియా నుంచి తొలగిస్తారన్నారు. ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. 

News November 30, 2024

విజయవాడ‌లో నిధి అగర్వాల్..HHVM షూటింగ్ షురూ

image

పవన్ కళ్యాణ్, నిధిఅగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు(HHVM) షూటింగ్‌కి హాజరయ్యే నిమిత్తం నిధిఅగర్వాల్ నగరానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఆమె ‘గుడ్‌మార్నింగ్ విజయవాడ #hhvm’ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ అప్డేట్ చేశారు. కాగా విజయవాడ పరిసర ప్రాంతాలలో హరిహర వీరమల్లు తుది షెడ్యూల్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

News November 30, 2024

కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు 

image

గుంతకల్ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్‌లో ఆగవని తెలిపారు. 

News November 30, 2024

విజయవాడ: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిరాకరించడంతో సూసైడ్

image

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్‌పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News November 30, 2024

ఎన్టీఆర్ జిల్లాలో 4,600 మందికి ఉపాధి కల్పించాం: బీజేపీ

image

కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.

News November 29, 2024

‘ఫెంగల్’ తుఫానుపై APSDMA ఏం చెప్పిందంటే..

image

కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.