India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారంలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, ఫీజు పేమెంట్ వివరాలకై https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.
మైనర్ బాలికను మోసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుణదల పోలీసుల వివరాల మేరకు.. ఏలూరుకి చెందిన పద్మావతి అనే బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. పద్మావతి 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా రాంపండును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాంపండు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో వారిపై కేసు నమోదు చేశామని గుణదల పోలీసులు శనివారం తెలిపారు.
2022లో చంద్రబాబు బస్సు యాత్రపై రాళ్ల దాడి ఘటనలో సంబంధమున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సజ్జనరావు, కిశోర్, కార్తీక్లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకోగా శ్రీనివాస్ అనే వ్యక్తిపై తాజాగా కేసు నమోదైంది. నందిగామ పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుండగా నందిగామలో ఈ ఘటన జరగగా, తాజాగా ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
అమరావతి నిర్మాణానికి భూములిచ్చి గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని వారికై CRDA అధికారులు శనివారం విజయవాడలోని తమ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు అందజేశారు. మొత్తం 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్ల ప్రొవిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చామని CRDA అదనపు కమిషనర్ ఎం. నవీన్ చెప్పారు. రైతులు సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ (60), సురేశ్ (21)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఇంటిలో వీరు హత్యకు గురి కావడం గ్రామంలో సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెనమలూరులోని పోరంకి కుమ్మరి బజార్కు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా వేరుగా పాపతో కుట్టుమిషన్తో జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ మహిళ బట్టలు కుట్టించుకొని భర్త సుందర్ సెల్ నుంచి డబ్బులు పంపేది. సుందర్ మహిళకు ఫోన్ చేసి మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకునేవాడు. గతంలో అబార్షన్ కూడా చేయించాడు. అంతే కాకుండా తన డబ్బులు, బంగారం తీసుకుని మోసం చేశాడని పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది.
విజయవాడలో శుక్రవారం విషాద ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. పి.సమ్మక్క భర్తతో విడిపోయి కొడుకుతో దుర్గా ఘాట్లో స్వీపర్గా పనిచేస్తుంది. ఈక్రమంలో నాగరాజు పరిచయమై పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క 8నెలల గర్భణీ. ఈనెల 19న నాగరాజు పనికెళ్లాడు. చుట్టుపక్కల వారు నాగరాజుకు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చెప్పగా, వెళ్లి చూడగా రక్తపు మడుగులో మగ శిశువుకు జన్మనిచ్చి బిడ్డతో సహా మృతి చెంది ఉంది.
విజయవాడ నగర శివారులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. జక్కంపూడి పోలవరం పట్టిసీమ కాలవ సమీపంలో ఘటన జరిగింది. విజయవాడకి చెందిన ఆరుగురు యువకులు గురువారం పట్టిసీమ కాలంలో స్నానానికి దిగగా ఇద్దరు గల్లంతు కాగా నలుగురు యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతయిన వారు విజయవాడ సింగ్ నగర్కు చెందిన మునీర్ శివతేజగా గుర్తించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధిష్ఠానం గురువారం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్-కో ఆర్డినేటర్గా ఉన్న ఆయనకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు.
Sorry, no posts matched your criteria.