India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలంది.
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా 8247693551 నంబర్కి ఫోన్ చేసి తెలియపర్చవచ్చన్నారు.
మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడారు. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.
ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కనకమేడల రవీంద్ర రాజ్యసభ ఎంపీగా పనిచేయగా.. ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్తో ముగిసింది. జిల్లా నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మరికొంతమందిని రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కాగా ఈ 3 పదవులను NDA కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వనుందో మరికొద్ది రోజులలో తెలియనుంది.
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సు 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సీటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.
కృష్ణా: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉమ్మడి కృష్ణాతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీవర్షాలు పడతాయని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.
కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఈనెల 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక ఓ ప్రకటన విడుదల చేశారు. 30న జరిగే సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కోరారు.
ముంబై నటి కాదంబరి కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పలువురు IPS ఆఫీసర్లు, పోలీసులు, లాయర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగ్గా.. కేసు విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. కౌంటర్ వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో కేసు విచారణ వాయిదా పడింది.
Sorry, no posts matched your criteria.