Krishna

News November 22, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. 25తో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA & MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 25లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది. 

News November 21, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 6,7,9, 10న బీఈడీ, డిసెంబర్ 6,7, 9,10,11,12న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ చూడాలని కోరింది. 

News November 21, 2024

విజయవాడలో పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత 

image

విజయవాడ పటమట పోలీసులు పనితీరుపై ప్రజలు ప్రశంసించారు. విజయవాడ మహానాడు రోడ్‌లో ఓ బ్యాంక్‌లో పీఓగా పనిచేస్తున్న కిషోర్ అనే వ్యక్తి తన ఫోన్ ఈనెల 1వ తేదీన పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాంకేతిక సాయంతో ఫోన్ గుర్తించి బాధితుడికి గురువారం అందజేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఫోన్లు పోతే ఎవరు నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదని సీఐ అన్నారు. 

News November 21, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్‌డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.

News November 21, 2024

విజయవాడ: అరెస్టు భయంతో సూసైడ్

image

అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నీలం సూర్యప్రభాస్(21)పై 15 కేసులున్నాయి. భార్య, కుమారుడితో ప్రభాస్ 3 నెలలుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. ప్రభాస్‌ను గాలిస్తూ పోలీసులు ఇంటి వద్దకు వెళ్లారు. వారిని చూసి అరెస్టు చేస్తారని భయపడి బుధవారం ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News November 21, 2024

కృష్ణా: బీపీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలు, రీవాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

News November 21, 2024

విజయవాడ: డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు బ్రూసెల్లోసిస్ టీకా కార్య‌క్ర‌మం

image

ఆడ ప‌శువుల్లో గ‌ర్భ‌స్రావానికి, మ‌గ ప‌శువుల్లో కీళ్ల వాపులు, వంధ్య‌త్వానికి కార‌ణ‌మ‌య్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్ర‌ణ‌కు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు బ్రూసెల్లోసిస్ టీకా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా ప‌శు సంవ‌ర్థ‌క అధికారుల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది.

News November 20, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో ఇటీవల నిర్వహించిన బీ-ఫార్మసీ కోర్సు 4, 6వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

News November 20, 2024

కిశోరి వికాసం.. బాలిక బంగారు భ‌విష్య‌త్‌కు పునాది: కలెక్టర్

image

కిశోరి వికాసం-2 కార్య‌క్ర‌మం బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్‌కు పునాది వేస్తుంద‌ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ఉజ్వ‌ల‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, సాధికార‌త దిశ‌గా వేసే అడుగుకు స‌మ‌ష్టి కృషితో చేయూతనిద్దామని పిలుపునిచ్చారు. బుధ‌వారం విజయవాడ కలెక్టరేట్‌లో కిశోరి వికాసం-2 కార్య‌క్రమాన్ని ప్రారంభించారు. కిశోరి వికాసం పునఃప్రారంభం ప్ర‌తి బాలిక భ‌విష్య‌త్తును మెరుగుప‌ర‌చడానికి ఓ మంచి కార్యక్రమన్నారు. 

News November 20, 2024

గుడివాడ: సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. అనంతరం ఈ పిటిషన్‌ను ఎల్లుండి నవంబర్ 22వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. 

error: Content is protected !!