Krishna

News June 21, 2024

కృష్ణా: LLB రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2023లో నిర్వహించిన LLB కోర్సుల 5, 9వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 21, 2024

డయేరియా నియంత్రణకు చర్యలు: డీకే బాలాజీ

image

జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.

News June 21, 2024

విజయవాడలో దారుణం.. ఉరివేసుకొని భార్యాభర్తలు మృతి

image

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తలు ఫ్యాన్‌కు ఉరివేసుకొని శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పడమట సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇరువురు మృతిచెందడంతో ఒక్కసారిగా రామలింగేశ్వర నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 21, 2024

కృష్ణా: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది వీరే

image

ఉమ్మడి కృష్ణా నుంచి ఈ సారి ఆరుగురు నాయకులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ నుంచి సుజనా చౌదరి శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. వీరిలో కృష్ణప్రసాద్(పెడన), వెంకట్రావు(గన్నవరం) 2019లో పోటీ చేసి ఓడిపోయి రెండో పర్యాయం గెలుపొందగా, మిగతా నలుగురు తొలిసారి పోటీ చేసి విజయం అందుకున్నారు.

News June 21, 2024

కృష్ణా: 2019, 2024లో అసెంబ్లీలో అడుగుపెట్టింది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2019, 2024లో శాసనసభలో ముగ్గురు మాత్రమే అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ ఈ సారి నూజివీడు, మైలవరం నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గద్దె రామ్మోహన్ మరోమారు అసెంబ్లీకి వెళ్లారు.

News June 21, 2024

మచిలీపట్నం: ఈ నెల 23న పురుషుల హాకీ జట్టు ఎంపిక

image

నోబుల్ కళాశాలలో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా హాకీ సంఘ కార్యదర్శి హరికృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1995, జనవరి 1 కంటే ముందు జన్మించిన ఆటగాళ్లు ఎంపిక పోటీలకు ధ్రువపత్రాలతో 23న ఉదయం 8 గంటలకు నోబుల్ కళాశాలకు రావాలని చెప్పారు. ఎంపికైనవారు అంతర్ జిల్లాల పోటీలలో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గద్దె.. ఆయన హామీలివే.!

image

విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా 3వ సారి ఎన్నికైన గద్దె రామ్మోహన్ తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.
☞ కొండప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
☞ డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి
☞ పేదలకు ఇళ్ల పట్టాలు
☞ పథకాలను పారదర్శకంగా అమలు
☞ టిడ్కో ఇళ్లను పూర్తి చేయడం
☞ వాన నీటి మళ్లింపుకు డ్రైనేజ్ నిర్మాణం.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి సుజనా.. ఆయన హామీలివే.!

image

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన సుజనా చౌదరి తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు. కాగా నేడు సుజనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
☞ కొండప్రాంత వాసులకు ఇళ్ల రిజిస్ట్రేషన్
☞ లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం
☞ దుర్గ గుడి, భవానీ ద్వీపం అభివృద్ధికి కృషి
☞ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
☞ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
☞ హజ్ హౌస్ నిర్మాణం.

News June 21, 2024

కృష్ణా: శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

➤ సీనియర్లు: మండలి బుద్ధప్రసాద్(4వసారి)
➤ పార్థసారథి(4వసారి)
➤ గద్దె రామ్మోహన్(4వసారి)
➤ శ్రీరామ్ తాతయ్య(3వసారి)
➤బోడె ప్రసాద్(2వసారి)
➤ బొండా ఉమ(2వసారి)
➤ వసంత కృష్ణప్రసాద్(2వసారి)
➤తంగిరాల సౌమ్య(2వసారి)
➤కొల్లు రవీంద్ర(2వసారి)
➤కామినేని శ్రీనివాస్(2వసారి)
➤ తొలిసారి: వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, సుజనా చౌదరి, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు.

News June 21, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా డిబ్రుగఢ్(DBRG)-కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22504 DBRG-CAPE ట్రైన్‌ను జూలై 8 నుంచి నం.22503 CAPE-DBRG ట్రైన్‌ను జూలై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.