India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్కోయిల్(NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నెం.06103 NCJ- DBRG రైలును ఏప్రిల్ 12, 26, మే 10, 24 తేదీలలో, నెం.06104 DBRG- NCJ రైలును ఏప్రిల్ 17, మే 1, 15, 29న నడుపుతామని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. సభ అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ చేరుకొని సాయంత్రం 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చంద్రబాబు రేపటి పర్యటనల షెడ్యూల్ విడుదల చేశాయి.
కృష్ణా వర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1,8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24 నుంచి మే 2వ తేదీ వరకూ నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
మచిలీపట్నం సముద్రంలో ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ జిల్లా మత్స్యశాఖకు శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ , మోటార్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటకు 61 రోజుల పాటు నిషేధించామని తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం ద్వారా మత్స్యసంపద పెరుగుతోందని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు రూ.18 లక్షలు కాజేశారు. పెనమలూరు మండలం కానూరుకు చెందిన శ్రీనివాసరావు బీమా కంపెనీలో పని చేస్తుంటాడు. జనవరిలో ఆయనకు వాట్సాప్లో గూగూల్ మ్యాప్ రేటింగ్, రివ్యూస్ చేస్తే సొమ్ము ఇస్తామని మెసేజ్ వచ్చింది. తొలుత ఆయనకు కొంతమేర ఆదాయం చూపి, వ్యాపార లావాదేవీల పేరుతో నేరగాళ్లు రూ.18 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విజయవాడలో పోక్సో కేసు నమోదైంది. మధురానగర్కు చెందిన బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. నవీన్ అనే యువకుడు బాలిక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలోనూ ఇలా జరిగితే అతడిని మందలించినట్లు బాలిక తల్లి చెప్పింది. మళ్లీ వేధించడంతో పాటు చంపేస్తానని యువకుడు బెదిరించడంతో గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విశాఖపట్నం(VSKP), తిరుపతి(SMVB) మధ్య నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.08543 VSKP-SMVB మధ్య నడిచే రైలును ఈ నెల 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, నెం.08544 SMVB-VSKP మధ్య నడిచే రైలును ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ స్పెషల్ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.
1. విజయవాడ: వాలంటీర్ల రాజీనామా.. TDPలో చేరిక
2. ‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?
3. జన సైనికులను మోసం చేసింది బుద్ధ ప్రసాదే: సింహాద్రి
4. విజయవాడ: పానీపూరీ లేదన్నందుకు దాడి
5. విజయవాడ: పింఛన్ సొమ్ముతో పరార్
6. కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
7. విజయవాడ: ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం స్థాపించినట్లే.!
8. తోట్లవల్లూరులో మహిళ అస్తిపంజరం
9. గుడివాడలో TDPకి ఆధిక్యం తెచ్చిన క్రాస్ ఓటింగ్
కృష్ణా వర్సిటీ పరిధిలో బీటెక్ విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని వర్సిటీతెలిపింది. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్, పరీక్షా కేంద్రాల వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
మండలంలోని కాసుమాలపల్లికి ఆనుకుని ఉన్న చెరుకు తోటలో అస్తిపంజరంగా ఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ కిషోర్ బాబు, ఎస్సై విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ చనిపోయి 15 నుంచి 20 రోజులు అయి ఉంటుందని వారు చెప్పారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.