India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని ధనం బోర్డు కాలనీలో వివాహిత మణిపై ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సాంబశివరావు మద్యం మత్తులో బ్లేడుతో శనివారం రాత్రి 11:30 సమయంలో నిద్రపోతున్న మహిళ గొంతు కోశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడలో మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ఇటీవల ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై YCP NTR జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం డోర్ డెలివరి చేస్తామంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో ఏకంగా సోషల్ మీడియాలో సైతం వాపారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం గడప వద్దేకే సంక్షేమం అందిస్తే.. కూటమి ప్రభుత్వం గడప వద్దకే మద్యం అందించి మత్తులో ఉంచుతోందన్నారు.
విజయవాడ కృష్ణలంకలో ఆదివారం సాయంత్రం RTC డ్రైవర్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కృష్ణలంక సీఐ నాగరాజు స్పందిస్తూ.. డ్రైవర్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. RTC డ్రైవర్ బస్టాండ్ నుంచి తెనాలివైపు వస్తుండగా ఇనోవా కారులో ఉన్న వ్యక్తులు అడ్డగించి దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణా కలెక్టర్ DK బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజానీకం ‘మీకోసం’ కార్యక్రమంలో సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.
విజయవాడ కృష్ణలంకలో ఆర్టీసీ డ్రైవర్పై మద్యం మత్తులో ఆదివారం ముగ్గురు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. రాంగ్ రూట్లో వస్తున్న కారు యజమాని అందులో ఉన్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్పై దాడికి తెగబడటంతో స్థానికులు అడ్డుకొని కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ కృష్ణలంక సీఐ నాగరాజు తెలిపారు.
సీపీఐ నేత రామకృష్ణ పోలవరం ప్రాజెక్టుపై ఆదివారం విజయవాడలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి కేంద్రం రూ.25 వేల కోట్లు ఆదా చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్ ప్రకారం 6 ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు.
కార్తీక మాసం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆదివారం వన సమారాధనలు జోరుగా సాగుతున్నాయి. దీంతో విజయవాడ, మచిలీపట్నం శివార్లలోని తోటలలో ఈ రోజు వనభోజనాల హడావిడి ఎక్కువగా ఉంది. సెలవురోజు కావడంతో పవిత్రమైన కార్తీక మాసంలో సముద్ర స్నానాల కోసం ప్రజలు హంసలదీవి, మంగినపూడి తదితర బీచ్లకు తరలివచ్చారు. అటు కృష్ణా నదీ తీరాన సైతం భక్తులు ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరించించారు.
ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.
సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్ను విజయవాడ CID కోర్టు కొట్టివేసింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు రాగా విద్యాసాగర్కు బెయిల్ ఇవ్వవద్దని CID తరపున వాదిస్తోన్న న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విద్యాసాగర్ బెయిల్కై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్ను విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
Sorry, no posts matched your criteria.