Krishna

News April 2, 2024

ఈ నెల 9నుంచి దుర్గగుడి వసంత నవరాత్రోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 9 నుంచి 18 వరకు, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 8.15 గంటలకు లక్ష్మీగణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశస్థాపన, అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తారన్నారు.

News April 2, 2024

విజయవాడ: ‘ఆ వాహనాలకు ఈ దారిలో అనుమతి లేదు’

image

విజయవాడ నగరంలో తిరిగే టిప్పర్ వాహనాల యజమానులతో పోలీస్ అధికారులు సోమవారం KS వ్యాస్ భవనంలో సమావేశమయ్యారు. గ్రావెల్ మొదలైన మెటీరియల్‌ను రవాణా చేసే టిప్పర్లు, కనకదుర్గ వారధి మీదుగా వారధి వైపునకు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. టిప్పర్లు గొల్లపూడి వై జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లాలన్నారు. టిప్పర్లపై టార్పాలిన్ కప్పి మెటీరియల్‌ రవాణా చేయాలని పోలీసులు టిప్పర్ల యజమానులను ఆదేశించారు.

News April 2, 2024

సరుకు రవాణాలో సత్తా చాటిన విజయవాడ రైల్వే డివిజన్

image

విజయవాడ రైల్వే డివిజన్ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.4029.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డివిజన్ ఏర్పడ్డ అనంతరం సరుకు రవాణాలో ఇదే అత్యధిక ఆదాయమని డివిజన్ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార పదార్థాలు, స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకులను డివిజన్ నుంచి ఎక్కువగా రవాణా చేశామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

News April 1, 2024

అవనిగడ్డలో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరు.?

image

అవనిగడ్డలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. ప్రస్తుతం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేడు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జనసేనలోకి వెళ్లడంతో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరో అనే చర్చ మొదలైంది. టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

News April 1, 2024

పెనమలూరులో మంత్రి జోగి గెలిస్తే చరిత్రే!

image

పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2019 ఎన్నికలు అప్పటి మంత్రులైన కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాకు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. 2019లో పెడన నుంచి గెలిచిన మంత్రి జోగిని సైతం సీఎం జగన్ పెనమలూరుకు బదిలీ చేయగా, టీడీపీ తమ అభ్యర్థిగా పెనమలూరులో బోడె ప్రసాద్‌ను నిలబెట్టింది. ఇక్కడ జోగి విజయం సాధిస్తారా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News April 1, 2024

హోంగార్డ్‌తో సహజీవనం.. మందలించాడని దాడి

image

వివాహేతర సంబంధం విషయమై హోంగార్డ్‌పై దాడి చేసిన యువకుడు, మహిళపై అజిత్‌సింగ్‌నగర్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. న్యూరాజేశ్వరిపేటకు చెందిన రవికుమార్(46)విజయవాడలో హోంగార్డ్‌. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటూ.. 18ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా సదరు మహిళ మరో యువకుడితో తిరగడం చూసిన రవి మందలించాడు. దీంతో ఆ మహిళ, యువకుడు రవిపై దాడి చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

మండవల్లి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

image

మండవల్లి మండలంలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు ఈ నెల 26న భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెంది, రాత్రి కూల్ డ్రింక్‌లో ఎలుకుల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ.. మహిళ మృతిచెందినట్లు SI రామచంద్రరావు తెలిపారు.

News April 1, 2024

USలో ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి

image

అమెరికాలోని పోర్టులాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ బాలిక మృత్యువాత పడింది. పెనుగ్రంచిపోలు మండలం కొణకంచికి చెందిన నరేశ్, గీంతాంజలి దంపతులు జాబ్ నిమిత్తం 10ఏళ్లుగా USలో ఉంటున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై వారి కుమార్తె హానిక(6)మృతిచెందింది. తల్లి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కొణకంచిలో విషాధాన్ని నింపింది.

News April 1, 2024

విజయవాడ: నేటినుంచి మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ

image

విజయవాడ మధురా నగర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 2024- 25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో అడ్మిషన్లకై నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును https://no1vijayawada.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రిన్సిపాల్ ఆదిశేషవర్మ తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్‌ కై మార్చి 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లలు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 31, 2024

పెడనలో అత్యధిక మెజారిటీ రికార్డు బద్దలయ్యేనా..

image

2008లో ఏర్పడ్డ పెడన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ తరఫున దివంగత కాగిత వెంకట్రావు 13,694 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి బరిలో ఉండగా.. వైసీపీ ఉప్పాల రాముకు టికెట్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో వెంకట్రావు రికార్డు చెరిగిపోతుందా.. మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.