India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్లతో పాటు 15 మందిని విప్లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్లుగా అవకాశం లభించింది.
కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
విజయవాడ: కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ 13న ఎస్జీఎఫ్ అండర్19 ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత్ తెలిపారు. ఈ పోటీలకు 01జనవరి2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్గా చదివేవారు అనర్హులని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 14న SMVT బెంగుళూరు(SMVB)- మాల్డా(MLDT) మధ్య అన్రిజర్వ్డ్ స్పెషల్ రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 14న ఉదయం 7 గంటలకు SMVBలో బయలుదేరి రాత్రి 8.05 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 16న ఉదయం 8 గంటలకు మాల్డా చేరుకుంటుందన్నారు. ఈ రైలులో 16 అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీటెక్ 1, 2, 3, 4వ ఏడాదికి సంబంధించిన రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్లో అకడమిక్ క్యాలెండర్ను చూడవచ్చు.
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జనవరి 2025 నాటికి అక్రెడిటేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పేర్కొన్నారు. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. అక్రెడిటేషన్ కమిటీలు యూనియన్ నేతలకు చాన్సు ఉంటుందన్నారు.
తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.
విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించారు.
ఆగిరిపల్లిలోని ఆంధ్ర న్యూ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అకాడమీలో నవంబర్ 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 బాల,బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్తో హాజరు కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.