India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఇతర అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలియజేశారు. నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, పార్టీలు నేరుగా లేదా ఆన్లైన్లో సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు కొనసాగినట్లు సమాచారం.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ వెస్ట్ టికెట్పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. బుధవారం బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ ఖరారు చేశారు. దీంతో నియోజక వర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలుచేస్తున్నామని సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.
మచిలీపట్నం పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పార్టీ అధినేత పవన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పేరు కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. రేపు వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారైతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.
ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
స్పా ముసుగులో విజయవాడలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగాయి. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ సెలూన్పై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కలిగించారు. స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రత్నరాజ్ అన్నారు.
Sorry, no posts matched your criteria.