India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్ను విజయవాడ CID కోర్టు కొట్టివేసింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు రాగా విద్యాసాగర్కు బెయిల్ ఇవ్వవద్దని CID తరపున వాదిస్తోన్న న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విద్యాసాగర్ బెయిల్కై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్ను విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
గుడివాడ మాజీ MLA కొడాలి నానిపై విశాఖపట్నంలోని 3టౌన్ పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. AU న్యాయకళాశాల విద్యార్థిని అంజనిప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లను దుర్భాషలాడారని, ఆ తిట్లను తాను భరించలేక పోయానని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై కేసు నమోదు చేశామని CI రమణయ్య చెప్పారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన BA L.L.B(హానర్స్) ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
ఉయ్యూరు మండలం ఆనందపురంలో భార్యపై కోపంతో పుల్లేరు కాలువలో దూకి బిట్రా పోతురాజు (44) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు పోతురాజు కిరాణా షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. శనివారం భార్యాభర్తలు గొడవ పడడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 26, 27, 28, 29 తేదీలలో బీఈడీ, నవంబర్ 26, 27, 28, 29, 30, డిసెంబర్ 2 తేదీలలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. విజయవాడకు చెందిన నర్ర నాగశ్రీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) అనే మహిళకు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల నుంచి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. భయపడిన ఆమె వెంటనే తన అకౌంట్లో రూ.కోటీ పాతిక లక్షల పదివేల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మోసం అని తెలుసుకున్న బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయవాడ: సూపర్ సిక్స్ పథకాల హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖకు టీడీపీ నేత బుద్ధా స్పందించి శుక్రవారం ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అధికారం కోసం కాదు, ప్రజల కోసమే సూపర్ సిక్స్’ హామీలని బుద్ధా తెలిపారు. టీడీపీ, మా కులం బీసీ.. ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోవాలని బుద్ధ ముద్రగడ లేఖపై ఘాటుగా కౌంటరిచ్చారు.
జిల్లా లెక్టర్ బాలాజీ శుక్రవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా వాటిలో 52 దరఖాస్తులకు అనుమతులు రావడంతో వాటిని ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 28 దరఖాస్తులకు సంబంధించి 6 ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని కోరారు.
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం, కృష్ణా నదీ వద్ద పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. వేకువజాము నుంచే నదిలో భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పవిత్ర స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం భక్తులు పాత శివాలయానికి వెళ్లారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.
Sorry, no posts matched your criteria.