Krishna

News November 15, 2024

విజయవాడ: సికింద్రాబాద్, లక్నో మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు, విజయవాడ మీదగా సికింద్రాబాద్, లక్నో మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15, 22 తేదీలలో (నం.07084) సికింద్రాబాద్ నుంచి రాత్రి 7:50కి బయలుదేరి లక్నోకు ఆదివారం రాత్రి 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 18, 25 తేదీలలో (నం.07083) సోమవారం ఉదయం 9:50కి లక్నోలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

News November 15, 2024

క‌ృష్ణా: 4 థియేటర్లలో ‘దేవర’ 50రోజులు

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 4 థియేటర్లలో ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది. మొత్తంగా 52 సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని చిత్రబృందం గురువారం ట్వీట్ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు సెంటర్లలో “దేవర” విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

News November 15, 2024

మచిలీపట్నం: సాగర హారతితో ప్రారంభం కానున్న సముద్ర స్నానాలు

image

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

News November 14, 2024

విజయవాడ: నెహ్రూకి నివాళులర్పించిన వైఎస్ షర్మిల

image

భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి విశేష సేవలు అందించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందించిన ఏకైక కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు.

News November 14, 2024

హైవేపై టైర్ పంక్చర్.. పల్టీ కొట్టిన బొలెరో వాహనం

image

కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, అతణ్ని ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. బండిలోని సరుకు రోడ్డుపై పడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

News November 14, 2024

కృష్ణా: విద్యార్థులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు. 

News November 14, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), లక్నో(LKO) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు నవంబర్ 15, 22 తేదీలలో SC- LKO(నం.07084), నవంబర్ 18, 25 తేదీలలో LKO-SC(నం.07083) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News November 14, 2024

బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్ 

image

బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు. 

News November 14, 2024

అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఉపాధి హామీ, జల్‌జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులకు నిధుల కొరత లేకున్నా పనులు గ్రౌండింగ్‌లో ఉండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమై పలు పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 13, 2024

గన్నవరంలో బాలికపై అత్యాచారం

image

గన్నవరంలో ఓ బాలికపై కొన్నాళ్లుగా అదే ఊరికి చెందిన ప్రశాంత్ అలియాస్ బన్ను అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలికకు కడుపునొప్పి రాగా తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంలో గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.