Krishna

News March 27, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన జనసేన కీలక నేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కీలక నేత బత్తిన రాము మంగళవారం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈయన బత్తిన ట్రాన్స్‌ఫోర్ట్ అధినేత. గతంలో ఈయన ప్రజారాజ్యం తరఫున గన్నవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ‌చేసి ఓటమి చెందారు. నిన్న ఆయన కేశినేని నానితో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.

News March 27, 2024

కృష్ణా జిల్లా వాసులకు పోలీసుల ముఖ్య విజ్ఞప్తి

image

డబ్బు సంపాదన కోసం క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం నుంచి మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్నందున అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి కుటుంబాలను అంధకారంలో పడవేయవద్దని అద్నాన్ నయీం అస్మి కోరారు.

News March 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.

News March 26, 2024

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీ గూటికి చేరారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకోటయ్య 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి 5,143 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ అప్పారావుపై గెలిచారు.

News March 26, 2024

కంకిపాడు: విద్యాసంస్థలో బాలిక మృతి

image

కంకిపాడులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. త్రిపురకి చెందిన విద్యార్థిని క్యాంపస్‌లో హాస్టల్ నుంచి క్లాస్ రూంకి స్నేహితులతో కలిసి మంగళవారం వెళ్తుండగా అకస్మాత్తుగా పడిపోయింది. కాలేజీ స్టాఫ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు.

News March 26, 2024

పెనుగంచిప్రోలులో దొంగ నోట్లు కలకలం

image

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో దొంగనోట్లు కలకలం రేపాయి. వ్యాపారులు హడావుడిలో ఉన్న సమయంలో ఈ నోట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మార్చారన్నారు. గతేడాది కూడా తిరునాళ్ల సమయంలో ఆలయ లడ్డూ ప్రసాదాల కౌంటర్లలో దొంగనోట్లు వచ్చాయన్నారు. తాజాగా గ్రామంలోని తూర్పు బజారులో బడ్డీకొట్టులో రూ.200 నోట్లు చెల్లనివి రావటంతో వ్యాపారులు అవాక్కయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News March 26, 2024

మాచవరం పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి

image

విజయవాడ గుణదల విజయనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చానంటూ హల్ చల్ చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాచవరం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

News March 26, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News March 26, 2024

మచిలీపట్నం MP టికెట్ రేసులో కొత్త పేరు

image

మచిలీపట్నం ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి ఈ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా, గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ నరసింహారావు పేరు కూడా పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని రెండ్రోజుల్లో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు.. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News March 26, 2024

ఎన్టీఆర్ జిల్లాకు పోలింగ్ సిబ్బంది ఎంత మందో తెలుసా?

image

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికల టీమ్‌ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ సిబ్బంది కసరత్తు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా 23 వేలమంది ఎన్నికల సిబ్బందిని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. పోలింగ్‌ పర్యవేక్షణ కోసం 7,200 మంది పోలీసు బలగాలు అవసరమని నిర్ణయించారు. మొత్తం ఐదు కంపెనీల బలగాలకు ఇప్పటి వరకు నాలుగు కంపెనీల బలగాలు వచ్చాయి.