Krishna

News March 24, 2024

ఎన్టీఆర్: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తాంబరం (తమిళనాడు), సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26, ఏప్రిల్ 2వ తేదీల్లో తాంబరం- సత్రాగచ్చి (నెం.06079), ఈ నెల 27, ఏప్రిల్ 3వ తేదీన సత్రాగచ్చి- తాంబరం (నెం.06080) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విజయనగరం, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని స్పష్టం చేశారు.

News March 24, 2024

కృష్ణా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌ (40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

‘టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగిరేనా’

image

1982లో టీడీపీ స్థాపన అనంతరం నందిగామ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989లో కాంగ్రెస్, 2019లో వైసీపీ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ తమ ఇన్‌ఛార్జ్ తంగిరాల సౌమ్యకు టికెట్ ఇవ్వగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ను బరిలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగురుతుందా, వైసీపీ ఆధిపత్యం చూపునా మీ కామెంట్.

News March 24, 2024

అవనిగడ్డ BSP అభ్యర్థిగా నాగేశ్వరావు

image

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన గుంటూరు నాగేశ్వరావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొక్కా పరంజ్యోతి శనివారం పార్టీ కార్యాలయంలో నాగేశ్వరావును సన్మానించి, టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయం సాధిస్తానని నాగేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు. నాగేశ్వరావును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

News March 23, 2024

ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

image

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇరువురు హర్ష (21) వెంకటేష్ (21) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులుగా తెలుస్తోంది.. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2024

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం

image

విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్ ఖాన్ వర్గం అడ్డుకునేందుకు యత్నించారు. పొత్తులో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుందని, అయితే టికెట్ జలీల్ ఖాన్‌కు ఇవ్వాలని నిరసన తెలిపినట్లు సమాచారం.

News March 23, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు వార్తలు అవాస్తవం: కృష్ణా జిల్లా I&PR డీడీ

image

సమాచార శాఖ ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కృష్ణా జిల్లా I&PR DD వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా మంత్రుల పేషీల్లో పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న పీఆర్ఓలు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు మాత్రమే ఆ మెమో వర్తిస్తుందన్నారు. ఈ మేరకు ఉదయం విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను అధికారులు సవరించారు.

News March 23, 2024

గుడివాడ: గుంతలో పడి వ్యక్తి మృతి 

image

గుడివాడలో పామర్రు- కత్తిపూడి జాతీయ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి గుంతలో పడి టెంట్ హౌస్ కూలి కాటూరి స్వామి(54)అనే వ్యక్తి మృతిచెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిందని, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.   

News March 23, 2024

ఎన్టీఆర్‌: భర్త గొంతు కోసిన భార్య

image

వత్సవాయిలో భర్త గొంతును భార్య బ్లేడుతో కోసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఏడుకొండలు, పార్వతీ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి దంపతులు మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మాట మాటా పెరగడంతో భార్య పార్వతీ తన దగ్గర ఉన్న బ్లేడుతో భర్త గొంతు కోసింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

News March 23, 2024

కృష్ణా: డీఎడ్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిధిలోని డీఎడ్ విద్యార్థులు (2022- 24 బ్యాచ్) రాయాల్సిన సెకండియర్ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు దేవానందరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.