India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు తెలుగుభాషా అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విజయవాడ కేబిఎన్లో జరుగుతున్న తెలుగు రచయితల మహాసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉన్నారన్నారు.

ప్రపంచ 6వ తెలుగు మహాసభలు శనివారం విజయవాడలోని KBN కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు నిర్వాహకులు 3 సభావేదికలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు మాజీ CJI ఎన్వీ రమణ, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవిదేశాల నుంచి 1500 మందికిపైగా కవులు, రచయితలు ఈ సభలకు తరలివచ్చారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపల్లిలో నివాసముంటున్న బాలిక కుటుంబానికి పాస్టర్ దగ్గరి బంధువు. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు కొండపల్లిలోని బాలిక నివాసానికి వచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్కు చెందిన ఓ మైనర్ బాలిక(14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈనెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలన్నారు.

స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా అమలుచేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇవ్వడంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.

ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్ గురువారం తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది స్విమ్మర్లు పాల్గొంటారని అయన పేర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కృష్ణా (D), నాగాయలంకకు చెందిన పృథ్వీరాజ్ RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లై పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.