Kurnool

News September 28, 2025

తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News September 28, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ (08518-277305) పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.

News September 27, 2025

ఆపదలో ఉంటే 112కు కాల్ చేయండి: కర్నూలు ఎస్పీ

image

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీసులు చేరుకుంటారన్నారు. డయల్ 112 హెల్ప్ లైన్ నంబర్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.

News September 27, 2025

అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100: కలెక్టర్

image

అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100కు సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలో అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1,100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అర్జీదారులు. Meekosam.ap.gov.i వెబ్‌సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

News September 27, 2025

100 కాదు 112: కర్నూలు ఎస్పీ

image

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 112 సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్ రక్షక్ పోలీసులు చేరుకుంటారన్నారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 నుంచి 112కు ప్రభుత్వం మార్చిందని, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

News September 27, 2025

గల్లంతయిన విద్యార్థి కుటుంబానికి కలెక్టర్ భరోసా

image

ఈనెల 25న కర్నూలు కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లి అశోక్ మృతిచెందగా, ప్రశాంత్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిరి మరణించిన విద్యార్థి అశోక్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థి ప్రశాంత్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 26, 2025

పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డా.సిరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

News September 26, 2025

మెగా ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి టీజీ

image

రాష్ట్రంలో కేంద్ర భాగస్వామ్యంతో మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ శాస‌నమండ‌లిలో తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్‌లు, బల్క్ డ్రగ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

News September 26, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో కర్నూలు జిల్లాకు రెండో స్థానం

image

ఈనెల 25 నుంచి 26 వరకు పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల ఆట్యాపాట్యా పోటీలలో ఫైనల్స్‌లో కర్నూలు జిల్లా జట్టు పల్నాడు జట్టుపై 20-16 తేడాతో ఓడి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జిల్లా సంఘం సీఈవో నాగరత్నమయ్య తెలిపారు. లీగ్ దశలో మంచి ప్రతిభ చూపి ఫైనల్‌కు చేరుకొని పోరాడి ఓడిందన్నారు. టీమ్ శిక్షకుడిగా చరణ్ వ్యవహరించారు.

News September 26, 2025

ఆటో డ్రైవర్ నిజాయితీకి సీఐ ఫిదా

image

నిజాయితీకి ప్రతీకగా ఆటో డ్రైవర్ రవికుమార్ నాయక్ నిలిచారు. గురువారం కర్నూలులోని మౌర్య ఇన్ దగ్గర ఆటో ఎక్కిన ప్యాసింజర్ తన ఐఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారు. డ్రైవర్ నిజాయితీతో రూ.80,000 విలువైన ఐ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. నిజాయితీకి మెచ్చిన నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ శాలువా కప్పి రవికుమార్ నాయక్‌ను సన్మానించారు. పోలీసుల సమక్షంలో బాధితుడికి ఫోన్ అప్పగించారు.