India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.
అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.
హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ఓ రఘురామిరెడ్డి వైద్యాధికారిణి సుజాత ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు. దోమలు పుట్టకూడదు అని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలన్నారు. ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో నూనె గింజల ఉత్పత్తి పెంపుకు జేసీ డా.బి.నవ్య అధికారులకు సూచనలు ఇచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ జేసీ ఛాంబర్లో ఆయిల్ సీడ్స్ కన్వర్జెన్సీ సమావేశంలో జేసీ మాట్లాడారు. క్రిషోన్నతి పథకం కింద 5 ఏళ్లలో ఉత్పత్తి పెంచాలని, 1000 హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేసి, రైతులను క్లస్టర్లుగా ప్రోత్సహించాలని సూచించారు. ఎఫ్పీఓల ద్వారా విత్తనాలు, లోన్లు, శిక్షణ అందించాలని ఆదేశించారు.
➤ఆదోని: పెహల్గాం ఉగ్రదాడిపై ఎమ్మెల్యే తీవ్ర ఖండన➤కర్నూలు జిల్లాలో మర్డర్..?➤గోరుకల్లు సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే➤కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష➤కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!➤ప్రియురాలి కోసం భార్యను చంపాడు!➤ఉగ్రదాడికి నిరసనగా ఆదోనిలో బంద్ పాటించిన వ్యాపారులు➤నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం:జేసి➤పెద్దకడబూరు: పంచాయతీ కార్యదర్శుల కొరతతో ఇబ్బందులు.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని పొలాల్లో రక్తగాయాలతో పడి ఉన్న వెంకటేశ్ను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తికి వ్యక్తిగత కక్షలు, గ్రామంలో తగాదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న ఫైనల్ పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అందులో 4,348 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. వారందరికీ జూన్ 1న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.