Kurnool

News June 26, 2024

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో బైరెడ్డి ఫ్యామిలీ

image

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతికి శ్రీశైల మల్లికార్జున స్వామి ప్రసాదం, వస్త్రాన్ని అందించారు. త్వరలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తానని రాష్ట్రపతి చెప్పినట్లు శబరి తెలిపారు.

News June 26, 2024

నేడు ఓటేయనున్న కర్నూల్, నంద్యాల జిల్లా ఎంపీలు

image

పార్లమెంట్‌లో నేడు లోక్‌సభ స్పీకర్ ఎలక్షన్​ జరగనుంది. కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు టీడీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.

News June 26, 2024

కర్నూల్: కుక్కను హింసించిన యువకుడిపై కేసు

image

కర్నూలు జిల్లాలో జంతువుపై క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోలీసులు బుద్ధి చెప్పారు. ఆలూరుకు చెందిన వినోద్‌ తన పెంపుడు కుక్క కాళ్లు పట్టుకొని పైకి లేపి తిప్పుతూ హింసించాడు. పైగా ఈ వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశాడు. తెలంగాణకు చెందిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు వినోద్‌ కుక్కను హింసించాడని కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో అతడిపై ఆలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 26, 2024

కొలిమిగుండ్ల: ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.కొలిమిగుండ్ల మండలకేంద్రానికి చెందిన పుల్లయ్య కుమారుడు సింహాద్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందో లేదోనన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సీఐ గోపీనాథ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News June 26, 2024

కర్నూలు జిల్లాలో వైసీపీ భవనాలకు నోటీసులు

image

కర్నూలు, ఆదోని పట్టణంలో నిర్మిస్తున్న వైసీపీ భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయా కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఆదోని భవనానికి సంబంధించి వైసీపీ నాయకుడు ఎర్రిస్వామికి నోటీసులు ఇవ్వగా కర్నూలు నగరంలోని కార్యాలయానికి సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.సత్యనారాయణమ్మకు అందజేశారు.

News June 26, 2024

కర్నూలు: 10 పడకలతో ప్రత్యేక వార్డు

image

పీడియాట్రిక్ కేసుల కోసం 10 పడకలతో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేయాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో సీజనల్ వ్యాధుల కేసులపై సమీక్ష నిర్వహించారు. పీడియాట్రిక్ కేసుల వ్యాప్తిపై రోజువారీ డేటాను తన దృష్టికి తీసుకురావాలని పీడియాట్రిక్ HODని ఆదేశించారు.

News June 25, 2024

నంద్యాల: చిరుత పులి దాడిలో మహిళ మృతి

image

చిరుత పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న పచ్చళ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరూన్ బి కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఆమెపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో మృతి చెందిందని  బంధువులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News June 25, 2024

నంద్యాల: నకిలీ బంగారం పెట్టి.. బ్యాంక్ లోన్

image

నకిలీ బంగారంతో రూ.6.66లక్షల లోన్ తీసుకుని మోసిగించిన ఘటనపై కేసు నమోదైంది. ఎస్సై వరప్రసాద్ వివరాలు..ఉయ్యాలవాడ(M) మాయలూరుకు చెందిన లక్ష్మీనారయణ కోవెలకుంట్ల ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 8నకిలీ బంగారు గాజులు తాకట్టుపెట్టి రూ.2.63లక్షలు, సంజామల(M) పేరుసోములకి చెందిన అమీర్ 4గాజులు, కడియం తాకట్టు పెట్టి రూ.3.03లక్షల రుణం తీసుకున్నారు. ఆడిట్‌లో 10శాతం మాత్రమే బంగారం ఉన్నట్లు తేలడంతో మేనేజర్ psలో ఫిర్యాదు చేశారు.

News June 25, 2024

ప్రధాని మోదీతో ఎంపీ బైరెడ్డి ఫ్యామిలీ

image

ప్రధాని నరేంద్ర మోదీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిశారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలను బైరెడ్డి శబరి నెట్టింట పోస్ట్ చేశారు. ‘ప్రధాని మోదీని నా కుటుంబ సభ్యులతో కలిసి ఆశీస్సులు తీసుకున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 25, 2024

కర్నూలు జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1801 ఎస్టీటీలతో కలిపి మొత్తం 2678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.