Kurnool

News April 9, 2025

కర్నూలు: 1,78,466 పేపర్ల మూల్యాంకనం

image

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం మంగళవారం నాటికి 1,78,466 పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆరవ రోజు మూల్యాంకనం ముగిసే సమయానికి 93%గా నమోదయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. 114 మంది చీఫ్ ఎగ్జామినర్లు,682 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు, 215 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్‌కు సంబంధించి మూల్యంకనం పూర్తయినట్లు వెల్లడించారు.

News April 8, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

image

➤ ఆదోని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
➤ కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు
➤ వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని
➤ సీతమ్మకు తాళి.. క్షమాపణ చెప్పిన ఆలూరు MLA
➤ ఆదోని MLA డౌన్ డౌన్ అంటూ TDP నినాదాలు
➤ కోడుమూరు: ‘పొలం ఆన్ లైన్ చేయమంటే లైంగికంగా వేధిస్తున్నారు’
➤ పెద్దకడబూరు: ఈతకు వెళ్లి బాలుడి మృతి.

News April 8, 2025

మెప్మా ఉత్పత్తులకు గిన్నిస్ రికార్డు: ఎమ్మిగనూరు కమిషనర్

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు వారు తెలిపారు.

News April 8, 2025

‘పురమిత్ర యాప్‌‌‌తో కర్నూలు నగర సేవలు’

image

రాష్ట్ర ప్రభుత్వం నగరాల్లో, పట్టణాల్లో స్థానిక సంస్థల సేవలను పౌరులకు సులువుగా అందించేందుకు వీలుగా రూపొందించిన ‘పురమిత్ర’ యాప్‌ను నగర ప్రజలు డౌన్లోడ్ చేసుకుని నగరపాలక సంస్థ సేవలను సులువుగా పొందాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో పరికరాలు, రహదారుల మరమ్మత్తులపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

News April 8, 2025

వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని

image

అధికార పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాటసాని హెచ్చరించారు.

News April 8, 2025

కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు

image

కర్నూలు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరివెళ్ల సీఐ వంశీధర్ నంద్యాల వీఆర్‌కు, దస్తగిరి బాబు అన్నమయ్య డీటీసీ నుంచి సిరివెళ్ల, ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి నంద్యాల ఫ్యాక్షన్ జోన్, గౌతమి కర్నూల్ డీటీసీ నుంచి నంద్యాల ఉమెన్ పీఎస్, రమేశ్ కుమార్ నంద్యాల ఉమెన్ పీఎస్ నుంచి నంద్యాల వీఆర్, కృష్ణయ్య డీసీఆర్బీ నంద్యాలకు బదిలీ అయ్యారు.

News April 8, 2025

కర్నూలు జిల్లా ముఖ్యాంశాలు

image

➤మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ ➤ వెల్దుర్తి: బొమ్మిరెడ్డిపల్లెలో టెన్షన్.. టెన్షన్..➤ కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: ఎంపీ➤ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే..!➤ పెద్దకడబూరు: ‘ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి’➤ కౌతాళం: తుంగభద్ర కాలువలో పడి వ్యక్తి మృతి➤ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి➤ కర్నూలు: ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ ఒత్తిళ్లను ఆపాలి

News April 7, 2025

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: కర్నూలు ఎంపీ

image

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.

News April 7, 2025

ఫ్యామిలీతో బైరెడ్డి!

image

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి శ్రీరామనవమి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత బైరెడ్డి ఫ్యామిలీతో కనిపించడంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడిగా సిద్ధార్థ్‌ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.

News April 7, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

image

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.