India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాలోనూ ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు పదవి వరించలేదు. నామినేటెడ్ పదవి దక్కుందని భావించిన కృష్ణమ్మకు మరోసారి నిరాశే మిగిలింది. మంత్రి లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కృష్ణమ్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని ఆమె వర్గం ఆశిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరికి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు దక్కాయి. ☞ హెచ్.సత్యనారాయణ రావు (HM, జడ్పీ హై స్కూల్-వెలుగోడు)☞ డా.తొగట సురేశ్ (HM, డోన్)☞ ఎం.ఖాజా బేగ్ (SA-హిందీ, ZPHS ఎస్.బోయినపల్లి, వెల్దుర్తి మండలం)☞ కే.సత్యప్రకాశ్ (SGT, MPPS KASBA బనగానపల్లె)☞ బీ.నాన్సీ మేరీ (SA-సోషల్, ZPHS ఎర్రగుంట్ల, సిరివెళ్ల మండలం)☞ ML ప్రేమకాంత్ బాబు (SGT, MPUPS పుసులూరు, నంద్యాల మండలం)
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM చంద్రబాబు అన్నారు. ‘శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయి. సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయి. శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్ రోడ్డును నిర్మించాం. త్వరలో శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మంత్రులు పవన్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం, దుర్గేశ్తో ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం’ అని CM చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు. శనివారం కర్నూల్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ అవేర్నెస్, కౌన్సెలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కర్నూలు డిఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరుకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేదు. అయితే 30 ఏళ్ల తర్వాత నేపాల్ నుంచి శనివారం ఎమ్మిగనూరులోని సొంత వాళ్లను కలుసుకున్నారు. నేపాల్లో ఆశ్రమ నిర్వాహకులు, ఎమ్మిగనూరులోని వేదాస్ నిరాశ్రయుల వసతి గృహం డైరెక్టర్ సునీల్తో వివరాలు తెలుసుకొని ఏకంగా సొంతవాళ్లకు అప్పగించారు.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు TDP నేతలకు పదవులు దక్కాయి. వారిలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీ కురుబ-కురుమ సంక్షేమ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా దేవేంద్రప్ప, వాల్మీకి-బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా కప్పట్రాళ్ల సుశీలమ్మ(బొజ్జమ్మ) ఉన్నారు.
CM చంద్రబాబు మరి కాసేపట్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ ద్వారా శ్రీశైలం చేరుకోనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, ఇతర ఉన్నతాధికారులు సీ ప్లేన్లో మధ్యాహ్నం 12:40 గంటలకు శ్రీశైలం రానున్నారు. కాగా సీఎం రాక కోసం శ్రీశైలంలో టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
తుగ్గలి మండలం గిరిగేట్ల గ్రామంలోని నూతన సచివాలయం వద్ద ఉండే బ్రిడ్జి శుక్రవారం రాత్రి కూలిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో చెన్నంపల్లి, పగిడిరాయి, కొత్తూరు, తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి యథావిధిగా రాకపోకలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో శనివారం సెలవు ప్రకటించామని, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని సంబంధిత డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పన్నారు.
Sorry, no posts matched your criteria.