Kurnool

News March 17, 2024

KNL: ఇకపై ఊపందుకోనున్న అభ్యర్థుల ప్రచార పర్వం

image

మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.

News March 17, 2024

నంద్యాల: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.

News March 17, 2024

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News March 17, 2024

అనుమతులు తప్పనిసరి: భార్గవ తేజ

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్‌లైన్‌లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.

News March 17, 2024

స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

కర్నూలు: ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున “స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో, డివిజన్ స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కలెక్టర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

News March 17, 2024

కర్నూలు: ఒకే రోజు 24 పోటీలు.. విజయం సాధించిన జట్లు ఇవే..

image

ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెప‌క్ తక్రా పోటీల‌ను ఆదోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల‌లో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జ‌రిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ‌ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిక‌ట్‌, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్‌పూర్‌ విజయం సాధించాయి.

News March 17, 2024

కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్య

image

కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్యను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం కర్నూలులో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థిగా రామచంద్రయ్యను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

News March 17, 2024

కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

image

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 17, 2024

మ 3గం.లోపు అన్ని క్లియర్ చేయండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వేళ ఈ మ.3 గం.లోపు సచివాలయాలు, RBKలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా ప్రతినిధుల చిత్రపటాలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.

News March 17, 2024

కర్నూలు: ఆరోగ్యశ్రీ పేరుతో భారీ కుంభకోణం.. కేసులు నమోదు

image

కర్నూలులోని శ్రీగాయత్రీ ఆసుపత్రి నిర్వాహకుడు జిలానీబాషా, జ్యోతి డయాగ్నస్టిక్ మేనేజర్ కిరణ్‌పై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం కేసునమోదైంది. వైఎస్సా‌ర్ ఆసరా పథకం కింద 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470మందికి పైగా పక్షవాత రోగులకు చికిత్స చేసినట్లు తప్పుడు నివేదికలతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.రూ.5.28 కోట్లు అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడటంతో ఆసుపత్రి అనుమతిని రద్దు చేశారు.