India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా పీ.శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలు బదిలీ కాగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను నంద్యాల డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ సీహెచ్ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
రాయలసీమ రేంజ్ జోన్-4 పరిధిలో 20మంది CIలను బదిలీ చేస్తూ శుక్రవారం కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బనగానపల్లె UPS సీఐగా కే.ప్రవీణ్ కుమార్, NDL CCS-3 సీఐగా ఎన్.కృష్ణయ్య, YMG UPS సీఐగా వీ.శ్రీనివాసులు, KNL సైబర్ క్రైమ్ సీఐగా వేణు గోపాల్, KNL CCS-2 సీఐగా మురళీధర్ రెడ్డి, ALR సీఐగా వెంకట చలపతి, KNL-1,3 టౌన్ సీఐలుగా పీ.నాగ శేఖర్, పీ.శేషయ్య, NDL సైబర్ క్రైమ్ సీఐగా జీ.మారుతి శంకర్.
ఆదోని నుంచి మంగళగిరికి దాదాపు 487 కి.మీ మేర సైకిల్ యాత్ర చేసిన జనసేన వీర మహిళ రాజేశ్వరి ఎట్టకేలకు తన అభిమాన నేత, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ను కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిసిన ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమెను పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెను అభినందించారు.
కర్నూలులో మహిళా అఘోరి హల్చల్ చేసింది. నంద్యాల మీదుగా కర్నూలు వైపు వస్తున్న అఘోరి తన కారు చెడిపోవడంతో నగర శివారులోని ఓ కారు షోరూంలో రిపేరుకు ఇచ్చి అక్కడి నుంచి డోన్ జాతీయ రహదారి వైపు నడుచుకుంటూ వెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనాలు ఆపి ఆసక్తిగా చూస్తున్నారు. మరికొందరు ఆమెను అనుసరిస్తూ పాదయాత్రగా వెళ్లారు.
సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్లో బయలుదేరుతారు. 12.40 గంటలకు శ్రీశైలంలోని ఫ్లోటింగ్ జెట్టీ వద్దకు చేరుకుంటారు. 1 నుంచి 1.25 గంటల వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. తర్వాత్ ప్రెస్మీట్ నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ సీప్లేన్లోనే విజయవాడకు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
విద్యార్థులకు అపార్ ఐడీ జనరేట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇదే కొనసాగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ నమోదు కేవం 56% మాత్రమే అయిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారని, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని వేగవంతం చేయాలన్నారు. వారంలోపు 70% మించి నమోదవ్వాలని, అనంతరం సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
తనపై ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని నంద్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. తనపై వన్ టౌన్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని అన్నారు. తాను చేపట్టిన అపార్ట్మెంట్ పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ను ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కర్నూలులోని V MEGA ఆనంద్ సినీ కాంప్లెక్స్లో టీజర్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్లో రామ్చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలని ఎంహెచ్వో డాక్టర్ భాస్కర్ అన్నారు. గురువారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్వో జెండా ఊపి ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి వారి ఇంటి వద్దే బ్రెస్ట్, ఓరల్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు.
దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నెకు చెందిన చిలంకూరు పుల్లయ్యకు గురువారం ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2022 ఏప్రిల్ 8న ముద్దాయి తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉందన్న అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి ముద్దాయిపై ఛార్జిషీట్ దాఖలు చేసి సాక్షాధారాలతో నిరూపించారు.
Sorry, no posts matched your criteria.