Kurnool

News November 7, 2024

కర్నూలు: AHAల ఫలితాల విడుదల

image

ఏపీ వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(SVVU) ఆధ్వర్యంలో ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం సెప్టెంబర్ 15న నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో 125 మంది, కర్నూలు జిల్లాలో 120 మంది AHAలు తాజా ఫలితాల్లో అర్హత సాధించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత సాధించిన 245 మంది AHAలకు 2026 మార్చి 1న ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

News November 7, 2024

దీపం-2 పకడ్బందీగా అమలు చేయండి: జేసీ

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం-2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని కర్నూలు జేసీ నవ్య పేర్కొన్నారు. గురువారం ఆమె ఛాంబర్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రక్రియ గురించి ఆరా తీశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

News November 7, 2024

‘యుటీయఫ్ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయండి’

image

యుటియఫ్ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి దేవపాల్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. నందవరం మండలంలోని వివిధ పాఠశాలలో యుటియఫ్ నాయకులు ఆహ్వాన పత్రికలను అందించి ఉపధ్యాయులను ఆహ్వానించారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను గూడూరు, సీ.బెళగల్ మండల శాఖల ఆతిథ్యంలో ఈ నెల 9, 10వ తేదీలలో గూడూరులో నిర్వహించనున్నామని అన్నారు.

News November 7, 2024

YCP ఎమ్మెల్సీ ఇసాక్ బాషాపై కేసు నమోదు

image

నంద్యాల జిల్లాకు చెందిన YCP ఎమ్మెల్సీ ఇసాక్ బాషాపై కేసు నమోదైంది. ఆయన మసీదు నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు బాధితుడు సలాం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 7, 2024

కర్నూలులో ఉల్లి ధర పైపైకి..

image

ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండ్రోజుల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో నిన్న క్వింటా గరిష్ఠంగా రూ.4,849 పలికింది. సరాసరి ధర రూ.3,896తో విక్రయాలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి దిగుబడిని రైతులు కర్నూలు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్నారు. కిలోకు సుమారు రూ.40కిపైగా ధర దక్కుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2024

‘వెలివేయాలని చూస్తున్నారు.. పోలీసులే న్యాయం చేయాలి’

image

ఎరుకలు కులస్థులైనందున ఆ ప్రాంతం నుంచి తమను వెలివేయాలని కుట్ర చేస్తున్నారని, పోలీసులు న్యాయం చేయాలని బుధవారం ఎరుకలి రామన్న కుటుంబ సభ్యులు వాపోయారు. ఆదోనిలోని గణేశ్ సర్కిల్ ప్రాంతంలో తాము జీవిస్తున్నామని, సోమవారం ఇంటి పక్కన వారు దాడి చేసి, కులవివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తమకు ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ న్యాయం చేయాలని కోరారు.

News November 7, 2024

చలి మొదలు..

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా చలి మొదలైంది. తెల్లవారుజామున పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో 22°C, 8 గంటల సమయంలో 25 °C నమోదైంది. మరోవైపు వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగాల్సి వస్తోంది. మరి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి..

News November 7, 2024

యురేనియం తవ్వకాలపై దుష్ప్రచారం: ఎంపీ నాగరాజు

image

కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలంటూ ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ నాగరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోర్ల తవ్వకాలు జరగడం లేదని అన్నారు. మరోవైపు యురేనియం తవ్వకాలంటూ అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.

News November 7, 2024

కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కమిషనర్

image

కర్నూలులో ఈ నెల 15న వినాయక ఘాట్‌ వద్ద నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్‌లో నగరపాలక, ఫైర్, విద్యుత్, ట్రాన్స్‌కో, జలవనరుల, మత్సకార, పోలీసు శాఖల అధికారులతో పాటు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్తీక దీపోత్సవం నాడు సమన్వయంతో పనిచేయాలన్నారు.

News November 6, 2024

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. R&B కాంట్రాక్ట్ బిడ్‌లకు అర్హత కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి R&B కాంట్రాక్టర్లకు భారీ ఊరట లభించనుంది.