India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ఉన్న ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆంగ్లో ఇండియన్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. గత ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్స్ సమస్యలను విస్మరించిందని మంత్రి ఫరూక్ అన్నారు.
దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, మన ఐక్యతకు భంగం కలిగించే శక్తులను తరిమికొడదామని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, పార్టీ మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు సాగడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు మన నాయకత్వాన్ని, మన కృషిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
నంద్యాలకు చెందిన ఓ యువతి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో ఆత్మహత్యాయత్నం చేసింది. విష ద్రావణం తాగిన విద్యార్థిని వసతి గృహం సిబ్బంది గుర్తించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల-గిద్దలూరు సమీపంలో గల నల్లమల అటవీ ప్రాంతంలోని రైలు మార్గం ప్రయాణికులు మైమరిచిపోయేలా ఉంటుంది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురియడంతో రైలు మార్గానికి ఇరువైపులా నల్లమల పచ్చటి అందాలతో కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని నల్లమల కొండల నుంచి చూస్తే ఎంతో ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ రైలు మార్గం అందుబాటులో ఉంది.
తమ సమస్యలను పరిష్కరించాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జే.మోహన్, ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు శేషమ్మ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు CM శ్రీశైలం పర్యటన ఖరారైంది. 9న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ సేవలను CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి CM పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రమైన కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి నిర్మించాలని మంత్రి టీజీ భరత్కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మండలమైన కౌతాళంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై ఏపీఐఐసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మెగా ఇండస్ట్రియల్ హబ్కు సంబంధించి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు.
రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీమ్ లాగా.. ఇద్దరే సభ్యులు నిలుస్తారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరులో మంగళవారం కర్నూలు-బళ్లారి హైవే మరమ్మతులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వైసీపీకి క్రికెట్ టీమ్ ఉందని, భవిష్యత్తులో షటిల్ టీమ్గా మిగులుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Sorry, no posts matched your criteria.