India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు బిర్లా గేట్ వద్దనున్న న్యాక్ సెంటర్లో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. 95 మంది ఇంటర్వ్యూలో పాల్గొనగా.. శ్రీరామ్ చిట్స్&ఇన్సూరెన్స్లో 12 మంది, టాటా క్యాపిటల్లో 8 మంది, ఎస్వీసీసీలో ఆరుగురు, మొత్తం 26 మంది ఉద్యోగాలు పొందారని నైపుణ్య అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ ప్రశాంత్, న్యాక్ ఏడీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కప్పట్రాళ్ల ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. యురేనియం కోసం 68 బోర్లు వేయడానికి అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవాలని చూడటం తగదని హెచ్చరించారు. గతంలో ఆళ్లగడ్డ, పులివెందులలో యురేనియం తవ్వకాలను టీడీపీ వ్యతిరేకించిందని చెప్పారు.
టెట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 150/150 మార్కులతో ఇద్దరు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ నిలిచారు. అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన తలారి క్రాంతికుమార్, కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు గ్రామానికి వడ్ల మంజుల అనే ఇరువురూ 150/150 మార్కులు సాధించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఇరువురూ స్టేట్ టాపర్లుగా నిలవడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 18వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈనెల 9న రాష్ట్ర సీఎం శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. విజయవాడ- శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పర్యాటక, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, జలవనరులు, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ బిందు మాధవ్ పోలీసులను ఆదేశించారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం చేయరాదన్నారు.
కార్తీక మాసం, మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చారు. భక్తులు ఉచిత, ఆర్జిత సేవ టికెట్లతో క్యూ లైనల్లో గంటల తరబడి వేచి ఉండి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ వేసిన దేవసుర చిత్రానికి భారతీయ చిత్రకళ అవార్డు వచ్చింది. ఆదివారం ఒంగోలులో కళాయజ్ఞ సృష్టి ఆర్ట్ అకాడమీ వారు ‘ప్రాచీన భారత్’ అనే అంశంపై పెయింటింగ్ పోటీలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. 100 మంది చిత్రకారులు పాల్గొని వారు వేసిన చిత్రాలు ప్రదర్శించారు. అందులో మొదటి బహుమతి కోటేశ్కు దక్కింది.
కర్నూలు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశాన్ని నేడు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరు కానున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చర్చించనున్నారు.
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, రెవెన్యూ, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.