India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం సర్వీస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అయ్యలూరులోని ఓ మసీదులో ఇమామ్గా పని చేస్తున్న జిల్లెల్ల గ్రామానికి చెందిన ముల్లా మహమ్మద్ హుస్సేన్(38) మధ్యాహ్నం సిరివెళ్ల నుంచి స్కూటీపై అయ్యలూరు వస్తుండగా వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ రావడంపై బాలిక తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 121 రోజులు గడుస్తున్న ఇంకా తమ పాప ఆచూకీ దొరకలేదని, హత్యాచారం చేసిన వారు మాత్రం బెయిల్పై వచ్చి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
ఈనెల 4వ తేదీన (సోమవారం) కర్నూలు కలెక్టరేట్లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని రెవెన్యూ, మున్సిపల్, మండల కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు తప్పక పాల్గొని ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పరిధిలోని ఓ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు క్రషర్లో పడి ఓ యువకుడు మరణించాడు. అందిన వివరాల మేరకు.. మృతుడు సురేశ్ ఆచారి (25) మెకానికల్ హెల్పర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం అవుతుండటంపై జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి స్పందించారు. జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులిచ్చారని తెలిపారు. నేడు ఆలూరు వైసీపీ నాయకులు రోడ్లెక్కి సీఎం చంద్రబాబుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల ప్రవర్తన మారలేదని ఆయన విమర్శించారు.
మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వాహనాలతో పోలీసులకు తల నొప్పిగా మారింది. సెలవు రోజులు వచ్చాయంటే భక్తుల సంఖ్యతో వాహనాల రద్దీ పెరిగి పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే తమ వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శనివారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఐ రామాంజులు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గండ్లేరు రిజర్వాయర్లో ఆదయ్య(78) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్ఐ భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఆదయ్యగా గుర్తించామన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడని, మృతుని కుమారుడు వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని చెంచు గూడెల్లో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సర్వే నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెల్లో 2,095 కుటుంబాల్లో దాదాపు 8,000 మంది చెంచులు జీవనం సాగిస్తున్నారన్నారు.
ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి టీజీ భరత్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆస్పత్రుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా, ఇతర రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని వెన్నెల పాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి CM చంద్రబాబు ప్రారంభించారు. రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం రూ.826 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు CM చంద్రబాబు, మంత్రి బీసీ పేర్కొన్నారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.