Kurnool

News December 4, 2024

పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: కలెక్టర్

image

డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాట్లపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.

News December 4, 2024

CM రేవంత్ రెడ్డితో మంత్రి టీజీ భరత్ భేటీ

image

తెలంగాణ CM రేవంత్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ‘స్ఫూర్తిదాయకమైన, కష్టంతో ఎదిగిన ఓ రాజకీయ నాయకుడిని కలవడం అదృష్టంగా భావిస్తున్నా. పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయాణం ఆయన శక్తికి నిదర్శనం. రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఆయన నాయకత్వం నన్ను ఆకట్టుకుంటోంది. ప్రజలకు సేవ చేయడంలో, సానుకూల ప్రభావం చూపడంలో ఆయన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ టీజీ భరత్ పోస్ట్ చేశారు.

News December 4, 2024

కర్నూలు జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!

image

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం కర్నూలు జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది క్రితం జిల్లాలోని రాతన గ్రామం కురువ గేరిలో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీని ప్రభావానికి అప్పట్లో 12ఇళ్లు బీటలు వారాయి.

News December 4, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడూ వర్షాలు

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లాలో రెండ్రోజుల నుంచి వర్షం పడుతోంది. పట్టణాలు, గ్రామాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఈ వర్షాలు నేడూ కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News December 4, 2024

నేడు జగన్ కీలక సమావేశం.. హాజరుకానున్న ఎస్వీ, కాటసాని.!

image

మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేడు తాడేపల్లిలో జరిగే YCP రాష్ట్ర స్థాయి సమావేశంలో కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారుల దోపిడీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు.

News December 4, 2024

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2024లో సక్తా చాటిన కర్నూలు విద్యార్థులు

image

స్మార్ట్ ఇండియా హ్యాక్ థాన్-2024లో భాగంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీల ఫైనల్స్‌లో కర్నూలులోని ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలు ఈనెల 11 నుంచి ఎన్ఐటీ శ్రీనగర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా 57,378 ఐడియాలను ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్నారు.

News December 4, 2024

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చర్యలు: కలెక్టర్

image

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31 వేల 69 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.18.96 కోట్ల పెన్షన్‌ను అందచేస్తున్నామని తెలిపారు. అవసరం ఉన్న వారికి ట్రై సైకిళ్లను, హియరింగ్ ఎయిడ్స్, తదితర పరికరాలను కూడా అందచేస్తున్నామన్నారు.

News December 3, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్‌ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితాలకు మోసపోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

News December 3, 2024

కర్నూలు: సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

image

కర్నూలు జిల్లాలో ఎల్లుండి నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపిన ప్రభుత్వం.. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా, కొద్దిరోజులుగా తుఫాన్‌, భారీ వర్షాల నేపథ్యంలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 3, 2024

సాగునీటి సంఘం ఎన్నికల్లో అన్ని చోట్లా వైసీపీ పోటీ: ఎమ్మెల్యే విరుపాక్షి

image

సాగునీటి సంఘం ఎన్నికలపై దృష్టి సాధించాలంటూ ఎమ్మెల్యే విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల వైసీపీ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.