Kurnool

News November 2, 2024

ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా

image

ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు 2,41,029 మంది లబ్ధిదారులకు గాను 2,39,111 మందికి పంపిణీ చేయడంతో 99.2% పూర్తయింది. నంద్యాల జిల్లా పదో స్థానానికి పరిమితమైంది. 2,17,375 మందికి గాను 98.83 శాతంతో 2,14,832 మందికి పంపిణీ చేశారు.

News November 2, 2024

కర్నూలు జిల్లాలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ

image

కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరాలయం, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరులోని క్షేత్రాల్లో కార్తీకమాస మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. వీటితోపాటు అహోబిలం, మంత్రాలయం, ఉరుకుంద క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శనివారం వేకువజామునే భక్తులు ఆయా ఆలయాలను సందర్శించి కార్తీకదీపాలను వెలిగించారు.

News November 2, 2024

నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుండే శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, వంకలు, చెరువులలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు చేశారు. తమ వెంట చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను తీసుకొని వెళ్తే.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలులో కార్తీక దీపాలు వదిలే వినాయక్ ఘాట్, ఓర్వకల్లు శ్రీ కాల్వబుగ్గ రామేశ్వరం శివాలయం, తదితర చోట్ల భక్తుల జాగ్రత్తగా ఉండాలన్నారు.

News November 1, 2024

రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి: మంత్రి భరత్

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.

News November 1, 2024

దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు: మంత్రి

image

సీఎం చంద్రబాబు దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు నింపుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.

News November 1, 2024

నంద్యాల: మద్యానికి బానిసైన కొడుకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

image

కొడుకు మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రైతునగరం గ్రామానికి చెందిన రత్నమ్మ (46) కుమారుడు జయరాం మద్యానికి బానిసవ్వడంతో ఆమె పలుసార్లు మందలించారు. మానుకోమని హెచ్చరించినా మాటవినకపోవడం, తరచూ గొడవ పడుతుండటంతో ఆమె మనస్తాపం చెంది అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ జలీల్ పేర్కొన్నారు.

News November 1, 2024

వెల్దుర్తి వద్ద ఘోర ప్రమాదం.. అన్నదమ్ముల మృతి

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని అల్లుగుండు నేషనల్ హైవేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వారు కర్నూల్ నుంచి వెల్దుర్తికి బైక్‌పై వస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన అడ్డాకుల చిన్న మునిస్వామి, అనిల్ కుమార్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2024

9Am UPDATE: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ పంపిణీ ఇలా!

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు నంద్యాల జిల్లాలో 45.59%, కర్నూలు జిల్లాలో 39.95% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 2,17,375 మందికి గానూ 99,102 మందికి, కర్నూలు జిల్లాలో 2,41,029 మందికి గానూ 96,281 మంది లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు. అయితే సర్వర్ స్లోగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.

News October 31, 2024

కర్నూలు జిల్లాలో టపాసుల మోత

image

జిల్లాలో వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రజలు లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు చేశారు. ఈ సారి 20 శాతం మేర టపాసుల ధరలు పెరిగినా ఎవరి సామర్థ్యం మేరకు వారు కొనుగోలు చేశారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ఎటుచూసినా పటాసుల శబ్దాలే వినిపిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆదోని వంటి ప్రధాన పట్టణాల్లో టపాసుల మోత మోగుతోంది. మరి మీ ఇంట దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కామెంట్ చేయండి..

News October 31, 2024

కర్నూలు జిల్లాలో దీపావళి సందడి

image

జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. ప్రజలు లక్ష్మీదేవిని పూజించి పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల, డోన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆదోని, పత్తకొండ తదితర పట్టణాల్లో టపాసుల దుకాణాలు కిటకిటలాడాయి. పల్లెల నుంచి తరలివచ్చిన ప్రజలు తమకు ఇష్టమైన టపాసులను కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే బాణసంచా సామగ్రి ధరలు ఈసారి పెరిగాయి. సుమారు 20% వరకు పెరిగినట్టు వినియోగదారులు చెబుతున్నారు.