India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టమాటా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వారం క్రితం కిలో రూ.50కి పైగా అమ్ముడుపోగా ప్రస్తుతం భారీగా పడిపోయాయి. పత్తికొండ టమాటా మార్కెట్లో నిన్న కిలో రూ.5 నుంచి రూ.8 వరకు పలకడం విశేషం. క్వింటా గరిష్ఠంగా రూ.800, కనిష్ఠంగా రూ.500తో విక్రయాలు జరిగాయి. ధరలు పతనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
కర్నూలు జిల్లా కౌతాళంలో బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బదినేహాల్లోని ఆదోని రోడ్డులో ఉన్న ప్రభుత్వాస్పత్రి వద్ద వన్నూర్ బాషా, మల్లికార్జునను అరెస్టు చేసినట్లు సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ మొహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. వారి వద్ద నుంచి 7 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు.
అవినీతిని అంతమొందించే ప్రక్రియ స్వీయ సత్ప్రవర్తన ద్వారానే సాధ్యమవుతుందని కలెక్టర్ జీ.రాజకుమారి ఉద్ఘాటించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
కర్నూలు రాయలసీమ వర్సిటీలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు బుధవారం నాటికి ముగిశాయి. వర్సిటీ పరిధిలోని 17 పరీక్షా కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. చివరి రోజు పరీక్షకు 4,050 మంది విద్యార్థులు హాజరయ్యారు. 429 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నంద్యాల జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ పరీక్షా నిర్వహణను పరిశీలించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన ఛైర్మన్గా TV5 అధినేత బీఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు నంద్యాల MP డా.బైరెడ్డి శబరి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో TTD మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా MP శబరి ‘X’లో పేర్కొన్నారు.
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిలో ఆయనకు సభ్యుడిగా చోటు కల్పించారు. TTD నూతన ఛైర్మన్గా బీఆర్ నాయుడును నియమించగా, మరో 23 మందికి ఇందులో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు-సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పిలుపునిచ్చింది. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలి అని సూచించింది. జాగ్రత్తలు-సూచనలకు సంబంధించి ఈ మేరకు APSDMA ఓ ఫోటోను Xలో ట్వీట్ చేసింది.
కర్నూలు జిల్లాలో 412 కి.మీ R&B రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం రూ.11.16 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ పనులు రెండు, మూడు రోజుల్లో మొదలు కావాలని R&B అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ల నిర్మాణంపై సంబంధిత శాఖ ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. ఏఆర్ ఎస్ఐ జీవీ సుబ్బారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కుటుంబంతో సంతోషంగా గడపాలని, పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు.
కర్నూలులోని బుధవారం పేటలో ఉన్న ఓ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ 8వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తాజాగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిన్న రాత్రి 9 గంటల సమయంలో స్కూల్పై దాడి చేసి కరస్పాండెంట్ చంద్రశేఖర్ను చితకబాదారు. ఆపై మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టాలను అనుసరించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.