Kurnool

News May 23, 2024

కర్నూలు: మహిళల మృతిలో వీడిన మిస్టరీ

image

నగరవనం చెరువులో మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మమబూబ్ బాషాను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు..మహబూబ్‌నగర్(D)కు చెందిన జానకి, అరుణలు వేశ్యవృత్తిలో కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. ఈక్రమంలో బాషాతో పరిచయం ఏర్పడింది. మనస్పర్థలతో జానకి అతడిని కొట్టించింది. ఈనెల19న వారిద్దరు బాషా ఆటోలోనే బట్టలు ఉతకడానికి వెళ్లారు. అవకాశం కోసం చూస్తున్న బాషా జానకిని చెరువులోకి తోశాడు. కాపాడే క్రమంలో అరుణ కూడా మునిగిపోయింది.

News May 23, 2024

పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.

News May 22, 2024

24 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ

image

ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరానికి 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో 15,981 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 2వ సంవత్సరానికి 22 పరీక్షా కేంద్రాలలో 6,962 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News May 22, 2024

ఈనెల 27 లోగా ఫామ్-18లో ఏజెంట్ల వివరాలు ఇవ్వండి: కలెక్టర్

image

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్-18 ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 22, 2024

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ కే.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఆయన ఇసుక అక్రమ తవ్వకాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా చేపట్టామని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఏర్పాటు చేశామని తెలిపారు.

News May 22, 2024

విధులకు హాజరు కాని వారిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 79 మంది ఉపాధ్యాయులు, 21 మంది ఇతర శాఖలకు చెందిన అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. ఎందుకు హాజరు కాలేదని సంబంధిత అధికారులు మంగళవారం వారిని వివరణ కోరారు. వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

News May 22, 2024

ఆదోనిలో ఓటువేయడంలో వెనుకబాటు

image

సార్వత్రిక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఆదోని నియోజకవర్గం ఓటర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదోనిలో 66.5శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,63,058మంది ఓటర్లు ఉండగా..1,75,064మంది ఓటు వేశారు. 87,994మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

News May 22, 2024

కర్నూలు: కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

కర్నూలులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు వేసిన చోట కాకుండా వేరే బూత్‌లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కామేశ్ నాయక్‌ను ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కామేశ్ నాయక్ కృష్ణానగర్‌లో ఉన్న ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు డ్యూటీ వేశారు. ఆయన సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించారని వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేశారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ ఫీడ్ వారు పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్ బ్లాక్ పరిసరాలను వారు పరిశీలించారు. పాణ్యం ఆర్ఓ నారపు రెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ తేజ్ పాల్గొన్నారు.