India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలో విద్యను అభ్యసించి కోర్సును పూర్తి చేసుకోలేని 2015, 2016, 2017, 2018, 2019 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దీపావళి వేళ ఆదోని మార్కెట్ యార్డుకు రేపటి నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. హమాలీ సంఘాలు, కమీషన్ ఏజెంట్ల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 4 నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని చెప్పారు. రైతులు గమనించాలని కోరారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, తహశీల్దార్ వెంకటలక్ష్మి ముసాయిదాను ప్రచురించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ప్రతులను అందజేశారు. వచ్చే నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు.
కర్నూలు జిల్లాలోని కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ రెండు మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం పేర్కొందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్-2024 నివేదికల ప్రకారం ఈ మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
మండల కేంద్రమైన దేవనకొండలో మొండి గోడలకే పరిమితమైన ఉర్దూ పాఠశాల నిర్మాణ గదులు పూర్తిచేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కాకర్ల శాంతి కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం డీఈవో శ్యాముల్ పాల్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాల భవనం ఏర్పాటు కోసం దేవనకొండ సంతమార్కెట్ వద్ద గ్రామ పంచాయతీ స్థలం ఇచ్చిందని, 2014లో నిర్మాణ పనులు ప్రారంభించి మొండి గోడలకే పరిమితం చేశారన్నారు.
గోనెగండ్ల మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొనకండ్లకు చెందిన కుమ్మరి హేమాద్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంగళవారం కర్నూలుకు వెళ్తుండగా ఎస్.లింగందిన్నె సమీపంలో లారీ రివర్స్లో వచ్చి కారును ఢీకొంది. హేమాద్రికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక హేమాద్రి(38) మృతి చెందాడు.
ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ట్రాన్స్ జెండర్కు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పదోన్నతులు పొందిన 11 మంది ఎస్ఐలు డీఐజీ కోయ ప్రవీణ్ను మంగళవారం కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని డీఐజీ వారికి సూచించారు. విధులలో మంచి ప్రతిభ కనబరచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐజీ మేనేజర్ విజయరాజు ఉన్నారు.
నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం సమీక్ష చేశారు. ముందుగా నంద్యాలకు వచ్చిన ఆయనకు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఘన స్వాగతం పలికారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులకు ఏడాదికి 3సిలిండర్లు ఇవ్వనున్నారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేయనుండగా నేటి నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని నంద్యాల JC విష్ణు చరణ్ తెలిపారు. లబ్ధిదారులు ముందుగా సొమ్ము చెల్లించాలని, సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 24 నుంచి 48 గంటలలోపు తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.