Kurnool

News May 21, 2024

నంద్యాల: బంధువుల ఇంటికి పంపలేదని ఆత్మహత్య

image

చాగలమర్రిలోని చింతచెరువు రస్తాకు చెందిన బొర్ర వెంకటసుబ్బమ్మ(52) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంటికి పంపలేదన్న కారణంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు స్థానిక కేరళ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 21, 2024

కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు: కలెక్టర్

image

రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.

News May 21, 2024

22, 23న విద్యార్థులకు కౌన్సిలింగ్

image

22, 23వ తేదీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. 22న చిన్నటేకూరులో బాలురకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 23న దిన్నేదేవరపాడులో ఉన్న గురుకుల పాఠశాలలో ఆర్డర్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

News May 21, 2024

10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

image

ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జరగబోయే పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని వెల్లడించారు.

News May 21, 2024

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల కార్డెన్ సర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. రౌడీ షీటర్లను, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.

News May 21, 2024

నంద్యాల: ఓ వైపు విష్ణు స్వరూపం.. మరోవైపు శివుడిగా దర్శనం

image

ఆత్మకూరు మండలం నల్వకాల్వ గ్రామసమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో స్వామిఅమ్మవారు పాణిపట్టంపై కొలువుదీరి ముందు భాగంలో విష్ణుస్వరూపంగా వెనుక భాగంలో శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాయాణంలో పుష్యమాసం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం సూర్యకిరణాలు స్వామిఅమ్మవార్లపై ప్రసరించడంతో గర్భాలయ గోడలపై నీడ లింగకారంలో ప్రతిబింబిస్తుంది.

News May 21, 2024

కర్నూలు జిల్లాలో 33శాతం పంట నష్టం

image

2023-24 రబీ పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను వ్యవసాయం యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలో 70,982 హెక్టార్లలో 33 శాతంపైన పంట నష్టం జరిగిందని పేర్కొంది. 18 కరవు మండల్లాలో 58,901 మంది రైతులు పంటను నష్టపోయారని వారికి రూ.71.57 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ అవసరమవుతుందని నివేదికలోపేర్కొంది. సోషల్ ఆడిట్ చేపట్టిన అనంతరం కలెక్టర్ ద్యారా తుది నివేదిక పంపింది.

News May 21, 2024

కర్నూలు: ఆ ఇద్దరి మహిళది హత్యే

image

కర్నూలు గార్గేయపురం నగరవరం చెరువులో మహిళల మృతదేహాలు బయటపడిన సంగంతి తెలిసిందే. ఇద్దరు మహిళలో ఒకరు మహబూబ్‌‌నగర్ జిల్లాకు చెందిన జానకిగా, మరొకరు అరుణగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్‌తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్యచేసినట్లు విచారణలో తెలింది.

News May 21, 2024

కర్నూలు: చెట్టు విరిగి పడి బాలుడు మృతి

image

హాలహర్వి మండలంలోని విరుపాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శాంతమ్మ, బసవరాజు దంపతుల కుమారుడు సంతోష్ (9) గ్రామంలోని చెట్టు కింద ఆడుకుంటుండగా గాలివాన కురిసింది. దీంతో అక్కడున్న చెట్టు కిందకు వెళ్ళారు. ఆ సమయంలో చెట్టు విరిగి సంతోశ్‌పై పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన మరో బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 21, 2024

నంద్యాల:యువకుడిపై గొడ్డలితో దాడి

image

మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.