Kurnool

News October 29, 2024

క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయండి: కలెక్టర్

image

రుద్రవరం మండలంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేస్తూ డయేరియాను నియంత్రణలోకి తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీవో, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పీజీఆర్ఎస్, ఏపీ సేవా సర్వీసులు, నైపుణ్య గణన, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

News October 28, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులు

image

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 115 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.

News October 28, 2024

ఇసుక ధర టన్నుకు రూ.88 తగ్గింపు: కలెక్టర్

image

ఇసుకకు సీనరేజీ ఫీజు, డీఎంఎఫ్, మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు రూ.88 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News October 28, 2024

కబడ్డీ పోటీలకు రాయలసీమ యూనివర్సిటీ జట్టు పయనం

image

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు చెన్నైలోని ఎస్ఆర్ఎం ఐఎస్టీలో జరుగుతున్న సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు రాయలసీమ యూనివర్సిటీ జట్టు పయనమైంది. సోమవారం యూనివర్సిటీ హాల్లో ఎంపికైన జట్టుకు రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎన్టీకే నాయక్ క్రీడా దుస్తులను అందించి వీడ్కోలు పలికారు. స్పోర్ట్స్ డైరెక్టర్ శివ కిషోర్ కూడా పాల్గొన్నారు.

News October 28, 2024

అర్జీల పరిష్కారంలో గడువు దాటితే చర్యలు తప్పవు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంలో గడువు దాటితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.

News October 28, 2024

రక్తదానం చేయడమంటే పునర్జన్మ కల్పించడమే: ఎస్పీ

image

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్పీ రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం, పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యల నుంచి తొలగిపోయి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.

News October 28, 2024

నంద్యాల: బాలుడి ప్రాణం తీసిన చికెన్‌ ముక్క

image

చికెన్ ముక్క తిని రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు రాజంపేటలోని మన్నూరు సాతవీధిలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం వారు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అనంతరం పనుల్లో నిమగ్నమవ్వగా బాలుడు సుశాంక్(2) చికెన్ ముక్క మింగాడు. తర్వాత ఊపిరాడక మృతి చెందాడు.

News October 28, 2024

పెళ్లి ఇష్టం లేక మిడుతూరులో యువతి ఆత్మహత్య

image

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మిడుతూరుకు చెందిన ఓ యువతి ఇంటర్ చదువుతోంది. ఇటీవల బంధువుల నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. దీంతో తనకు పెళ్లి చేస్తారేమో అని మనస్తాపం చెందిన యువతి విష ద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 28, 2024

నిబంధనల ప్రకారం అనుమతులు: కర్నూలు కలెక్టర్

image

బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్‌లను అధికారులు నిబంధనల ప్రకారం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఏమైనా నేర చరిత్ర ఉందా, లేదా అని పరిశీలించి లైసెన్స్ ఇవ్వాలని తెలిపారు. దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూడాలన్నారు. ఒక క్లస్టర్‌లో 50 దుకాణాలకు మించి ఉండకూడదన్నారు.

News October 28, 2024

ప్రతి నెల చివరి ఆదివారం నాటకాలు

image

రాష్ట్రంలోని ప్రముఖ కళా సంస్థలను ఆహ్వానించి ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటకాలు నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. ఆదివారం రాత్రి కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో ఆరాధన ఆర్ట్స్ గుంటూరు వారిచే నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ‘మరీ అంత వద్దు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాటిక దర్శకుడు నడింపల్లి వెంకటేశ్వరరావును సత్కారించారు.