Kurnool

News October 27, 2024

ఉద్యమాలే శరణ్యం: ఎస్టీయూ

image

రాష్ట్రంలో నెలకొన్న విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి పేర్కొన్నారు. ఆదివారం కర్నూలులోని సలాం ఖాన్ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.

News October 27, 2024

మహిళ పట్ల దురుసు ప్రవర్తన.. వ్యక్తికి దేహశుద్ధి

image

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్‌ సమీపంలో అరువు మీద భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుతుండగా.. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భర్త అడ్డుకోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటాడి పట్టుకుని బాధిత మహిళ, భర్త ఇద్దరు కలిసి అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

News October 27, 2024

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

News October 27, 2024

నంద్యాల జిల్లాలో ప్రబలిన డయేరియా

image

నంద్యాల జిల్లా రుద్రవరంలో డయేరియా ప్రబలింది. స్థానిక ఎస్సీ కాలనీ, చంద్రుడుపేటలో ఇద్దరు మహిళలకు డయేరియా వ్యాధి సోకింది. వారిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవలే విజయనగం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలిన విషయం తెలిసిందే.

News October 27, 2024

RU వర్సిటీ ఫలితాలు విడుదల

image

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్‌టీకే నాయక్ తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను యూనివర్సిటీ <>వెబ్‌సైట్‌లో <<>>చూడాలన్నారు. రెండో సెమిస్టర్‌లో 1,068 మందికి 214, 4వ సెమిస్టర్‌లో 1,866 మందికి గానూ 460 మంది పాసయ్యారని చెప్పారు.

News October 27, 2024

భక్తులతో కళకళలాడుతున్న మహానంది ఆలయం

image

ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆదివారం రోజు కావడంతో భక్తులతో సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేకువజామున స్వామి, అమ్మవారికి స్థానిక అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతులు చేపట్టారు.

News October 27, 2024

పశుగణన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి బీసీ

image

21వ అఖిలభారత పశుగణనకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.గోవింద్ నాయక్‌తో కలిసి ఆవిష్కరించారు. నాలుగు నెలల పాటు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి రైతు సోదరులందరూ సహకరించాలన్నారు. పశువైద్యాధికారి రామ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

News October 26, 2024

బనగానపల్లె: చౌడమ్మను దర్శించుకున్న మల్టీ జోన్ 2 RJC

image

నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దేవదాయ -ధర్మాదాయ శాఖ మల్టీ జోన్ -2 రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ కామేశ్వరమ్మ, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, R.S.రంగాపురం, E.O.రామాంజనేయులు, ఎస్.కొత్తూరు E.O రామకృష్ణ ఉన్నారు.

News October 26, 2024

కేంద్ర మంత్రిత్వ శాఖల కమిటీల్లో జిల్లా ఎంపీలకు చోటు

image

కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరిలకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు(కన్సల్టేటివ్) కమిటీల్లో సభ్యులుగా వీరిద్దరికీ అవకాశం కల్పించింది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జౌళి శాఖ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి విద్యాశాఖ కమిటీలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 26, 2024

భర్తను చంపిన భార్య.. అనుమానమే కారణం!

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మం. కృష్ణాపురంలో ఆదిరామ్ రెడ్డిని భార్య లక్ష్మిదేవి <<14455943>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. భర్తకు మరో మహిళతో ఎఫైర్ ఉందన్న అనుమానమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. సీఐ ఓబులేసు వివరాల మేరకు.. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వీరి మధ్య గొడవలు ఉండగా నిన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమె గొడ్డలితో దాడి చేసింది. గాయాలతో మృతి చెందాడు.