Kurnool

News October 26, 2024

కర్నూలులో నిలిచిన ఉల్లి క్రయవిక్రయాలు

image

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన సరకు బయటకు తరలించేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండటంతో ఈనెల 28 వరకు కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు. రైతులు మార్కెట్‌కు సరకు తీసుకురావొద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి సూచించారు. 24న 19,711, నిన్న 22,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు చేసింది. నిన్నటి సరకును కొనుగోలు చేయలేదు. రైతులు నిరీక్షిస్తున్నారు.

News October 26, 2024

నంద్యాల పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీకి వినతులు

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 13 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, బదిలీల గురించి ఎస్పీకి విన్నవించారు. తగిన పరిష్కారం చూపుతామని ఎస్పీ భరోసా కల్పించారు.

News October 25, 2024

మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు

image

పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని ఎస్ఐ నిరంజన్ రెడ్డి శుక్రవారం వెలికి తీశారు. మహిళా మృతదేహంగా గుర్తించామని, సుమారు 60 ఏళ్ల వయస్సు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు కోసిగి సీఐ 91211 01154, పెద్దకడుబూరు ఎస్ఐ 91211 ఎస్సై నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 25, 2024

పంట నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

image

సంజామల మండలం ముదిగేడులో విషాదం నెలకొంది. పసుపల పెద్ద అలీఖాన్(58) ప్రమాదవశాత్తు పంట నూర్పిడి యంత్రంలో పడి గురువారం దుర్మరణం చెందాడు. అతని తల, శరీరం నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అలీఖాన్ సహా పలువురు కూలీలను గ్రామానికి చెందిన సూర్యుడు పంట నూర్పిడికి తీసుకెళ్లారు. యంత్రంపై నిలబడి మినుమును వేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సోదరుడు మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 25, 2024

లేబర్ మొబిలైజేషన్‌ను పెంచండి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద లేబర్ మొబిలైజేషన్‌ను పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఓలను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాలు, గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఎన్టీఆర్ హౌసింగ్ సర్వే కింద పెండింగ్‌లో ఉన్న 1,526 గృహాల సర్వేను 26వ తేదీలోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు.

News October 25, 2024

అలగనూరు రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

మిడుతూరు మండలం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గురువారం పరిశీలించారు. రిజర్వాయర్‌లోకి నీరు ఏ విధంగా చేరుతుంది, రిజర్వాయర్‌ కట్ట కుంగడానికి గల కారణాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కట్ట కింది భాగంలో గతంలో ప్రవహిస్తున్న చల్లవాగు కారణంగా కుంగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

News October 24, 2024

రేపు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం

image

పాణ్యం సమీపంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి 3 రోజులపాటు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామాంజనేయులు గురువారం తెలిపారు. రగ్బీ పోటీల ఏర్పాట్లను ముంబాయికి చెందిన జాతీయ రగ్బీ కాంపిటీషన్ మేనేజర్ వికాస్ చౌరాసియా, టెక్నికల్ మేనేజర్ నోయల్ మాథ్యూస్ పరిశీలించారు.

News October 24, 2024

కర్నూలు: త్వరలో పెళ్లి.. అంతలోనే విషాదం

image

పెద్దకడబూరు మండలం ఓంనగర్ సమీపంలో ఆదోని-మాధవరం రహదారిపై ఆటో బోల్తా పడి మంత్రాలయానికి చెందిన ముల్లా ఖాజా హుస్సేన్(50) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతుని కుమారుడి వివాహం నిమిత్తం ఆదోనిలో షాపింగ్ చేసుకొని తిరిగి ఆటోలో మంత్రాలయానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడిందన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

News October 24, 2024

కర్నూలు: ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

కోడుమూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు- పెంచికలపాడు గ్రామాల మధ్య బొలెరో వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2024

హోంశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

image

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ పగిడ్యాల మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి గురువారం కలిశారు. నియోజకవర్గంలో జరగాల్సిన పనులపై, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.