India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోన్ పట్టణ రైల్వే గేటు వద్ద ఈనెల 12న ఓ మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. డోన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిబ్బందితో కలిసి సీడీపీఓ.. పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి బాబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కర్నూలు చైల్డ్ హోమ్కు తరలించారు. బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని శుక్రవారం కోరారు.
జూన్ 4న నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్కు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శుక్రవారం తెలిపారు. కౌంటింగ్ విధులకు తగినంత ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అదనంగా సచివాలయ సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజలు అతిసారం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రామతీర్థం, యర్రగుంట్ల గ్రామాల్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్కు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ విధులకు ప్రభుత్వ ఉద్యోగులు తగినంత మంది ఉన్నారని, అదనంగా సచివాలయ సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.
శ్రీశైలం పోలీస్ స్టేషన్లో తుపాకితో కాల్చుకొని మృతిచెందిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి అంత్యక్రియలు పోలీసు అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. కర్నూల్ టౌన్ జారహాపురం కేసీ కెనాల్ దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారులు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత రెండు రోజులుగా ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు తమ విధులు నిర్వర్తించారని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చి తప్పుదోవ పట్టించే, నిరాధారమైన వ్రాతలు మానుకోవాలని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్లకు చెందిన వై.లక్ష్మీదేవి ఈనెల 16న అదృశ్యం కాగా 17న కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె మృతదేహాం లభ్యమైందని బంధువులు తెలిపారు. మతిస్థిమితం లేని ఆమె కోయిలకుంట్ల నుంచి ట్రైన్కు వెళ్లి ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిందా.. ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రొద్దుటూరుకు తరలించారు.
మహానంది ఆలయంపై నీలివర్ణ కాంతులు, తెల్లటి మేఘాలతో కూడిన మనోహారమైన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ప్రకృతి సోయగాల అందాలతో నల్లమల కొండల నడుమ మహానంది పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. శుక్రవారం మహానంది ఆలయంపై ఉన్న అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎదైనా సమస్య అనిపిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.