India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైలం డ్యామ్ మూడు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు 84,087 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఒక్క గేటు ద్వారా నీటి విడుదల ప్రారంభించిన అధికారులు 10 గంటల తర్వాత మరో 2 గేట్లను ఎత్తివేశారు. కాగా బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు 1,519 c/s, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600c/s, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 23,250c/s నీటిని విడుదల చేశారు.
కడప జిల్లాలో జరిగిన ప్రమాదం కర్నూలులోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కర్నూలుకు చెందిన సిరిచందనకు తిరుపతికి చెందిన రోహిత్తో ఈ నెల 20న వివాహం జరిగింది. తిరుపతిలో నేడు రిసెప్షన్ పెట్టుకున్నారు. నిన్న కర్నూలు నుంచి తిరుపతికి కారులో బయల్దేరగా.. రైల్వేకోడూరు వద్ద తిరుపతి నుంచి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుచిత్ర(49), ప్రేమ్ కుమార్(55), ఆయన భార్య వాసవి(45) మృతి చెందారు.
రీ సర్వేపై వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులు ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 211 గ్రామాలలో రీ సర్వే పూర్తయిందని, రీ సర్వేలో భూ సమస్యలకు వచ్చిన ఫిర్యాదులను నవంబర్ 30 లోపల పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా DRDA అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ హాల్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హోళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన తోటదళ బసవేశ్వర గ్రూపు SHG మహిళలు తయారుచేసిన జ్యూట్ బ్యాగులను కలెక్టర్కు చూపించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫైజల్, వంశీ అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ ఏబుల్ తెలిపారు. పీఈటీ అలీతో పాటు విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బంది, పలువురు అభినందించారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
కర్నూలు మీదుగా ప్రయాణించే రెండు ప్రత్యేక రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ (07063, 07064) రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
కర్నూలు మీదుగా ప్రయాణించే రెండు ప్రత్యేక రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ (07063, 07064) రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామక పార్కులో డ్రోన్ హబ్ ఏర్పాటుకానుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించనుంది. అక్కడ డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కేంద్రంలో డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్లను సైతం తీసుకొచ్చేందుకు మద్దతిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటించారు.
సైబర్ నేరానికి గురైతే 1930 డయల్ నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలులోని వివిధ ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.