Kurnool

News October 23, 2024

అంబేడ్కర్ విగ్రహ స్థానం మార్పుకు గుర్తించిన స్థలాలను పరిశీలిస్తాం: కలెక్టర్

image

నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలం నుంచి మార్పుకు గుర్తించిన ప్రదేశాలను పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో అంబేడ్కర్ విగ్రహ స్థానం మార్పు స్థలాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. డీఆర్ఓ ఏ.పద్మజ, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News October 22, 2024

పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక వసతులు: కలెక్టర్

image

పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్దేశించిన 21 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఇతర, శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రోగ్రాం కింద ఫేజ్ -1,2లో 52 పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు. 10వ తరగతిలో ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు.

News October 22, 2024

కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం..!

image

కర్నూలు మెడికల్ కళాశాలలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. మీసాలు, గడ్డాలు తీసేసి కాలేజీకి రావాలని, అకడమిక్ పుస్తకాలను తమ వద్దే కొనాలని, వేరే వారి దగ్గర కొనొద్దని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితమే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థులను కూడా వేధింపులకు గురి చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదులు అందలేదని ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు.

News October 22, 2024

అర్జీలు రీ ఓపెన్ కాకూడదు: కలెక్టర్

image

గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలు రీ ఓపెన్ కాకుండా వెంటనే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వినతులను స్వీకరించారు. 36 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులు 30 పెండింగ్ ఉన్నాయని చెప్పారు.

News October 22, 2024

శ్రీశైలం మల్లన్న సేవలో సినీ నిర్మాత దిల్ రాజు

image

శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఆయన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.

News October 22, 2024

నంద్యాల పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకి రాదు: అల్లు అర్జున్

image

తన ఫ్రెండ్ <<14415233>>శిల్పా<<>> రవిని అభినందించేందుకే నంద్యాలకు వెళ్లానని.. తనకు బహిరంగసభ, ర్యాలీ నిర్వహించే ఉద్దేశం లేదని’ నటుడు అల్లు అర్జున్ క్వాష్ పిటషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి రాదని తెలిపారు. నంద్యాల 2టౌన్‌ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరావును ప్రతివాదులుగా చేర్చారు. ఈపిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

News October 22, 2024

రాత్రిపూట విద్యార్థులు ఉండట్లేదు.. విచారణ చేపట్టాలి: ఆర్ఎస్‌యూ

image

బనగానపల్లె రవ్వలకొండలోని బాయ్స్ చిన్న పిల్లల బీసీ హాస్టల్లో 70 మంది విద్యార్థులు రాత్రిపూట మాయం అవుతున్నారని బీసీ హాస్టల్ నంద్యాల జిల్లా అధికారి ముస్తక్ బాషాకు ఆర్ఎస్‌యూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ వినతిపత్రం అందజేశారు. హాస్టల్లో 220 మంది విద్యార్థులకు గానూ రాత్రి 140 మంది మాత్రమే ఉంటున్నారని తెలిపారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 22, 2024

సర్వే ప్రక్రియను ఈనెల 24వ తేదీలోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం కింద వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సర్వే ప్రక్రియను ఈనెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఉల్లాస్‌ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ కన్వర్జెన్స్‌ సమావేశం జరిగింది. ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని కోరారు.

News October 21, 2024

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

image

సెప్టెంబర్ నెల 6వ తేదీ కర్నూలు జిల్లా డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్ సెలక్షన్‌లో అండర్-14,16, 18, 20 బాలబాలికల విభాగంలో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఎన్నికైన క్రీడాకారులు వచ్చే నెల 4, 5, 6వ తేదీలలో రాజమండ్రిలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొంటారని అథ్లెటిక్స్ కార్యదర్శి సీ.సుబ్బరత్నాలు ఒక ప్రకటనలో తెలిపారు.

News October 21, 2024

ఏపీఈఆర్సీ ఛైర్మన్, సీఎస్‌ను కలిసిన కలెక్టర్

image

కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏపీఈఆర్సీ 2024-29 ప్లానింగ్ అంశాలపై చర్చించేందుకు కర్నూలుకు విచ్చేసిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను సోమవారం కలెక్టర్ రంజిత్ బాషా కలిశారు. కలెక్టర్ వారికి పూల మొక్కలను అందజేశారు. అనంతరం కలెక్టర్ వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి జిల్లాలోని పలు ప్రాధాన్యత అంశాలను చర్చించారు.