India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విధినిర్వహణలో అసాంఘిక శక్తుల చేతిలో మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ముగ్గురు అమరవీరుల కుటుంబాలు, విధినిర్వహణలో మరణించిన 10 మంది పోలీసు కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలు(బెనిఫిట్స్) అందజేశారు.
కర్నూలు ట్రాఫిక్ CI మనసురుద్దీన్ ఆధ్వర్యంలో సౌండ్ పొల్యూషన్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అతిగా శబ్దం కలిగిస్తూ ఇతర వాహనదారులు, ప్రజలను భయపెడుతున్న 10 మందిని గుర్తించారు. వారి బైకుల సైలెన్సర్లను తొలగించి.. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్నూలు ఎస్పీ జి.బిందు మాధవ్, DSP బాబు ప్రసాద్ సూచనలతో డ్రైవ్ చేపట్టామని.. ప్రజలకు బైకర్లు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇటీవల కర్నూలు, నంద్యాల జిల్లాలకు అధ్యక్షులుగా ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డిలను నియమించగా తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పెద్దిరెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇటీవల కర్నూలు, నంద్యాల జిల్లాలకు అధ్యక్షులుగా ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డిలను నియమించగా తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పెద్దిరెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.
పల్లె పండుగ ద్వారా మంజూరైన పనులు, ఆయా మండలాల్లో పెండింగ్ ఇళ్ల పురోగతిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, PGRS అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండల అధికారులు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన సుందరమ్మ, సుంకన్న దంపతుల చిన్న కుమారుడు సుందరాజ్ 15 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చిన్న తనంలో అప్పులు చేయడంతో తల్లితండ్రులు మందలించారు. దీంతో ఇంట్లోంచి పారిపోయాడని స్థానికులు తెలిపారు. అప్పట్నుంచి అతడి ఆచూకీ కోసం ఎంత వెతికిన దొరకలేదన్నారు. కాగా 16ఏళ్ల తర్వాత శుక్రవారం ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు భావోగ్వేదానికి గురయ్యారు.
నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో శుక్రవారం విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురుమన్న తన కోరిక తీర్చలేదని కోడలిని దారుణంగా హత్య చేశాడు. గ్రామ శివారులోని ఓ మొక్కజొన్న పొలంలో కంకులను ఏరడానికి వచ్చిన కోడలిపై మామ కురుమన్న అత్యాచారనికి యత్నించాడు. అనంతరం అక్కడే ఉన్న బండరాయితో కొట్టి హత్యచేశాడు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో అర్ధరాత్రి అలజడి చెలరేగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సునీల్పై సుమారు 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. యువకుడు తీవ్రంగా గాయపడటంతో తోటి విద్యార్థులు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. గతంలో జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఫ్రెండ్లీగా మాట్లాడాలంటూ విద్యార్థిని పిలిచి చితకబాదినట్లు తెలుస్తోంది.
గుంటూరులో విద్యాసంస్థల అధినేత ప్రకాశ్ను భారీ మొత్తం డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో బోరుగడ్డ అనిల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 20కిపైగా కేసులు ఉండగా కర్నూలులోనూ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ 3వ పట్టణ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈఏడాది జూలై 12న BNS 352, 353చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేయనున్నారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే నేతలు విజయవాడ చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.