Kurnool

News May 12, 2024

నంద్యాల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్లు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో 10,226 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. నంద్యాల జిల్లాలో 16,808 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.

News May 12, 2024

కర్నూలు: 4వేల మంది పోలీసులతో ఎన్నికలకు పటిష్ఠ భద్రత

image

ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి, పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.

News May 12, 2024

నంద్యాల: ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయండి

image

ఎపిక్ కార్డు లేని ఓటర్లు 12 రకాల గుర్తింపు పత్రాలలో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఎపిక్ కార్డు లేనివారు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, అధికారిక గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.

News May 12, 2024

పోలింగ్‌కు సర్వం సిద్ధం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో సోమవారం జరిగే పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1,711 పోలింగ్ స్టేషన్లు, 13.89 లక్షల మంది ఓటర్లు, నంద్యాల పార్లమెంట్‌కు 31మంది, అసెంబ్లీ నియోజకవర్గాలకు 126 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News May 12, 2024

ఈవీఎంలు తరలించే ప్రతి బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు : కలెక్టర్

image

ఈవీఎంలు తరలించే ప్రతి బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో విధుల్లో ఉన్న సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కవర్ అయ్యేలా షామియానాలు, మంచినీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేశారు.

News May 12, 2024

కర్నూలు: పోలింగ్ రోజు అభ్యర్థుల వాహనాలకు పరిమితి

image

పోలింగ్ రోజున రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించిన వాహనాలకు పరిమితి విధించినట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, కార్యకర్తల కోసం ఒక్కొక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక వాహనంలో డ్రైవర్‌తో పాటు ఐదుగురు కంటే ఎక్కువ మందిని అనుమతించమన్నారు. జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన అనుమతులను ప్రదర్శించాలన్నారు.

News May 12, 2024

సిరా ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సృజన ఖండించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News May 12, 2024

కర్నూలు జిల్లాలో పోలింగ్ సిబ్బంది వివరాలు

image

☛ 8 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సిబ్బంది: 12,714
☛ అందుబాటులో ఉన్నవారు : 14,561
☛ అందులో పీఓలు, ఏపీఓలు కలిపి మొత్తం: 4,827
☛ పీఓలు (ఇతర పోలింగ్ సిబ్బంది): 8,974
☛ రెగ్యులర్ ఉద్యోగులు: 7,713
☛ సచివాలయ ఉద్యోగులు: 1,863
☛ అంగన్వాడీలు: 1,087
☛ కాంట్రాక్ట్ ఉద్యోగులు: 174
☛ సూక్ష్మ పరిశీలకులు: 318
☛ సెక్టార్ అధికారులు: 232
☛ బెల్ ఇంజినీర్లు: 24

News May 12, 2024

13న స్థానిక సెలవుగా గుర్తించాలి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా స్థానిక సెలవు మంజూరు చేస్తున్నట్లుఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహణ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు లోకల్ హాలిడేగా పరిగణించాలని ఆదేశించారు.

News May 12, 2024

కర్నూలు: ఒక్క ఏజెంట్‌కే అనుమతి

image

పోలింగ్ కేంద్రంలో ప్రతి పార్టీ నుంచి ఒక్క ఏజెంట్ మాత్రమే లోపల ఉండేందుకు అనుమతి ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రతి పార్టీ ఒక్కో కేంద్రానికి ముగ్గురు ఏజెంట్లను నియమించుకోవచ్చని, వారిలో లోపల మాత్రం ఒక్కరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లోపల ఉన్న ఏజెంట్‌కు రిలీవర్లుగా మిగతా ఇద్దరు వ్యవహరించవచ్చని పేర్కొన్నారు.