Kurnool

News October 17, 2024

‘నాటి ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే కోసం మా ఇళ్లు కూల్చేశారు’

image

ప్రభుత్వ స్థలంలో రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకుంటే అప్పటి వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హపీజ్ ఖాన్ ఆదేశాల మేరకు అధికారులు మా ఇంటిని కూల్చేశారని కర్నూలు రాహుల్ గాంధీ నగర్ కు చెందిన టి.కుమారి కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు జనవాణిలో ఫిర్యాదు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

News October 17, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని జిల్లా వాసులను చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. మిడుతూరు, మహానంది, ఆళ్లగడ్డ, డోన్ తదితర మండలాల్లో రాత్రి జోరు వర్షం కురిసింది. నేడూ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

News October 17, 2024

ట్రాన్స్ జెండర్‌లకు సమాన అవకాశాలు కల్పిస్తాం: నంద్యాల కలెక్టర్

image

సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్‌లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ట్రాన్స్ జెండర్‌ల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

News October 17, 2024

ఆలూరు: చేనుకు గడ్డి మందు కొట్టిన దుండగులు

image

ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన ఈరమ్మ 9 ఎకరాల్లో రూ.1.50 లక్షల ఖర్చుతో జొన్న పంట సాగుచేసింది. బుధవారం చేనుకు వెళ్లి చూడగా పంటకు ఎవరో గడ్డిమందు కొట్టారని బాధిత మహిళ వాపోయింది. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తన కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 16, 2024

రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర@2047లో భాగంగా నంద్యాల జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న నిర్దిష్ఠ లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై జిల్లా అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

News October 16, 2024

నంద్యాల జిల్లాలో నేడు సెలవు

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.

News October 16, 2024

నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్

image

అల్పపీడన ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరు వాన పడుతోంది. మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల, నంద్యాల, అవుకు తదితర మండలాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణం నెలకొనడంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

News October 16, 2024

కర్నూలు: అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక

image

అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర@ 2047 జిల్లా ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్, హార్టికల్చర్ అభివృద్ధి, వ్యవసాయం, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

News October 15, 2024

కర్నూలు, నంద్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూలు కలెక్టరేట్‌లో 08518-277305, నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో 08514-293903, 08514-293908 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. 24గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 15, 2024

కర్నూలు జిల్లా మంత్రులకు కీలక బాధ్యతలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్‌లకు CM చంద్రబాబు కీలక బాధ్యతల అప్పగించారు. వీరిని పలు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➤ బీసీ జనార్దన్ రెడ్డి – అన్నమయ్య
➤ ఎన్ఎండీ ఫరూక్ – నెల్లూరు
➤ టీజీ భరత్ – అనంతపురం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యారు.