Kurnool

News October 15, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు నిమ్మల రామానాయుడు, నంద్యాలకు పయ్యావుల కేశవ్ ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.

News October 15, 2024

కర్నూలు జిల్లాలో మద్యం లాటరీ విచిత్రాలు

image

➤ కర్నూలుకు చెందిన ఓ నేత అనుచరులు 246 దరఖాస్తులు చేయగా ఒక్క దుకాణాం కూడా దక్కలేదు
➤ గతంలో గుమస్తాగా పనిచేసిన ప్రతాప్‌కు ఓర్వకల్లు మండలంలోని దుకాణం
➤ నాగలాపురంలో ఒక దుకాణానికి 99 మంది పోటీ.. విజేతగా లక్ష్మీదేవి
➤ అంబమ్మ, అనిత అనే అత్తాకోడళ్లకు రెండు దుకాణాలు
➤ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల 9కిపైగా దుకాణాలు కైవసం
☛ కర్నూలు జిల్లాలో 99 షాపులకు గానూ 10 మహిళలకు
☛ నంద్యాల జిల్లాలో 105కు గానూ 6 మహిళలకు

News October 15, 2024

నంద్యాల మాజీ ఎంపీ కుమార్తెకు 9 వైన్ షాపులు

image

వైన్ షాపుల లాటరీలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజలను అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా తొమ్మిది షాపులు దక్కాయి. చిత్తూరు జిల్లా కలికిరిలో రెండు, పీలేరులో ఓ మద్యం దుకాణాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే చిన్నమండెంలోనూ రెండు దుకాణాలు తగిలాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం గ్రామీణంలోని 32, 34, గుంతకల్లులో 79, కళ్యాణదుర్గంలో 130వ నంబరు దుకాణాలను ఆమె దక్కించుకున్నారు.

News October 15, 2024

కర్నూలు: ఒకే వ్యక్తికి 4 షాపులు దక్కాయి!

image

ఇటీవల వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మీడియాలో పాపులరైన ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ ద్వారా ఏకంగా 4 దుకాణాలు దక్కించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ తీయగా పుట్టపర్తిలో-1, నంద్యాలలో 3 షాపులు ఆయనకు దక్కాయి. కాగా ఆయన చవితి వేళ రూ.29 లక్షలు వెచ్చించి వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

News October 14, 2024

నంద్యాలలో నూతన బస్సులు ప్రారంభించిన ఎంపీ

image

ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి ఫరూక్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో నూతన బస్సులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 14, 2024

నంద్యాల: మద్యం దరఖాస్తుల ద్వారా రూ.40.42 కోట్లు ఆదాయం

image

నంద్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. దరఖాస్తుల ద్వారా రూ.40.42కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

News October 14, 2024

జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి

image

ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News October 14, 2024

KNL: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న (కర్నూలు-99, నంద్యాల-105) మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలుకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్ సెంటినరీ హాల్లో లాటరీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 14, 2024

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

News October 13, 2024

ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు: కర్నూలు ఎస్పీ

image

కర్నూలు (D) హోలగుంద మండల పరిధిలోని దేవరగట్టులో శనివారం రాత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కర్రల సమరం శాంతియుతంగా ముగిసిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, 60 మందికి చిన్నపాటి గాయాలైనట్లు గుర్తించామని పేర్కొన్నారు. సంబరంలా వేడుకలు జరిగాయని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఇతర శాఖల వారికి, మీడియాకు ఆయన అభినందనలు తెలిపారు.