Kurnool

News May 8, 2024

రెండో రోజు కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

మంత్రాలయం 145 నియోజకవర్గంలో కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ బ్యాలెట్ ఓటింగ్ రెండో రోజు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 222 నమోదు కాగా, హోమ్ ఓటింగ్ 12 నమోదు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం తహశీల్దార్ పాల్గొన్నారు.

News May 7, 2024

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: రామసుబ్బారెడ్డి

image

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, ఎంపీ అభ్యర్థి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డితో కలిసి కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

News May 7, 2024

మే 10న అండర్-23 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10న ఉదయం 10 గంటలకు కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. అండర్-23, సీనియర్ క్రికెట్ అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్‌ కోసం ఈ ఎంపికలు చేపట్టనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. 2001 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత జన్మించిన వారు అండర్-23కి అర్హులన్నారు.

News May 7, 2024

కర్నూలు: 12గంటల బులిటెన్ విడుదల చేసిన కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెండవ రోజు 12 గంటల బుల్లెటిన్‌ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 587, ఎమ్మిగనూరు 245, పాణ్యం 337, పత్తికొండ 232, కోడుమూరు 320, మంత్రాలయం 97, ఆదోని 319, ఆలూరు 560మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 2325 మంది ఉద్యోగస్తులు ఓటు వేశారు.

News May 7, 2024

కర్నూలు: అత్తను హత్య చేసిన అల్లుడు

image

భార్య కాపురం రాకపోవడానికి అత్తనే కారణామని అల్లుడు హత్య చేసిన ఘటన పాణ్యంలో జరిగింది. అయ్యపురెడ్డి కాలనీకి చెందిన లక్ష్మీ(48) ఆమె కుతూరు రాజ్యలక్ష్మిని 11ఏళ్ల క్రితం శ్రీనివాసులుతో వివాహమైంది. భర్త మద్యానికి బానిసవ్వడంతో రాజ్యలక్ష్మి కొద్దికాలంగా పుట్టింట్లో ఉంటుంది. భార్యను కాపురానికి పంపాలని 5న రాత్రి గొడవకు దిగి అత్త తలపై కర్రతో కొట్టాడు. నంద్యాల ఆసుపత్రి.. కర్నూలు తరలిస్తుండగా మృతిచెందారు.

News May 7, 2024

ఓటు పండగకు శుభలేఖ పంపిన జిల్లా కలెక్టర్

image

వివాహాది శుభ కార్యాలకు ఆహ్వాన పత్రికలను అట్టహాసంగా ముద్రించడం పరిపాటి. ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులు మాత్రమే పంచి పెడతారు. కానీ కర్నూలు కలెక్టర్ జి.సృజన వినూత్నంగా ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మించిన శుభకార్యం వేరే ఏముంది అనుకున్నారు. ‘ఎన్నికల పర్వం దేశానికే గర్వం’ అంటూ ఈ శుభ కార్యానికి జిల్లా పెద్దగా ప్రజలందరికీ ఆహ్వానం పంపారు. మే13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేయాలని కోరారు.

News May 7, 2024

REWIND: నంద్యాల జిల్లాలో సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌

image

నంద్యాల జిల్లా రాజకీయ ప్రస్థానంలో పెండేకంటి సుబ్బయ్యది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. ఆయన 1957 నుంచి 1977 వరకు వరసగా నాలుగుసార్లు నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1978 నుంచి 1984 వరకు ఎంపీగా గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌గా గుర్తింపు పొందారు.1985 నుంచి 88 వరకు బిహర్ గవర్నర్‌గా, 1988నుంచి 90వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు.

News May 7, 2024

కర్నూలు: హోమ్ ఓటింగ్‌లో పాల్గొన్న 634 మంది

image

కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి రోజు హోమ్ ఓటింగ్‌కు సంబంధించి 997 మందికి గాను 634 మంది (64 శాతం) పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. మరో రెండు రోజుల్లో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని 100% ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.

News May 6, 2024

ఎన్డీయే ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం: బైరెడ్డి శబరి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనలో అభివృద్ధిలో వెనుకబడ్డ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 6, 2024

నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

image

సంజామల మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ ఉరుములు, మెరుపులతో  కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు కాసేపు ఎక్కడికక్కడ స్తంభించాయి. అవుకు మండలంలో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఎండల నేపథ్యంలో ఉక్కపోతకు విలవిలలాడిన ప్రజలు.. తాజాగా వర్షం కురవడంతో ప్రకృతిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు.