India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపై నంద్యాల MP డా.బైరెడ్డి శబరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా దేశానికి అందించిన సేవలు ఎనలేనివి. నైతిక వ్యాపార పద్ధతుల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని ట్వీట్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని దేవరగట్టులో దసరా పురస్కరించుకొని నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లకు ఎస్పీ బిందు మాధవ్ పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈమేరకు పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పీ వివరించారు. DSPలు-7, CIలు-42, SIలు-54, ASI, HCలు-112, PCలు-362, హోంగార్డులు-95 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు-50తో పాటుగా 3 ప్లాటూన్ల AR పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.
రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.
12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వచ్చినందున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని KC కెనాల్, తుంగభద్ర LLC, హంద్రీనీవా వంటి నీటి సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు నాంది కావాలన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా కర్నూలు జిల్లాలో 889, నంద్యాల జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన బాల ఓబన్నకు తన భార్యను హత్య చేసిన కేసులో ఆళ్లగడ్డ అదనపు జిల్లా జడ్జి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాల ఓబన్న గతేడాది భార్య నేసే నాగమ్మను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు దఫాల విచారణ అనంతరం న్యాయమూర్తి తుది తీర్పును మంగళవారం వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దకడబూరు మండలం పులికనుమ వద్ద ఆటోని బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో వీరేశ్ (13) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ తరలించారు. వీరంతా బసలదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకొని ఆదోని వస్తుండగా ఈ ఘటన జరిగింది. బొలెరో వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
రాష్ట్రంలో FSSAI ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ కమలవర్ధనరావు అంగీకరించారు. ఈ ఒప్పందం మేరకు రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ ల్యాబ్ను నెలకొల్పనున్నారు.
దసరా పండుగ పురస్కరించుకొని గ్రామీణ ప్రజలు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని గోనెగండ్ల సీఐ గంగాధర్ సూచించారు. పండుగ సందర్భంగా పిల్లలు ఇంటి వద్ద ఉంటారని, వారు క్రిమిసంహారక మందులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. చెరువులు, కాలువల వద్దకు పంపకూడదని సూచించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచిరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.