India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్డేట్కు సంబంధించి 3గంటల బుల్లెటిన్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 868, ఎమ్మిగనూరు 848, పాణ్యం 917, పత్తికొండ 536, కోడుమూరు 646, మంత్రాలయం 220, ఆదోని 470, ఆలూరు 462మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 23.72% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.
పీఎం విశ్వకర్మ యోజన కార్యచరణ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్న కాళింగి నరసింహ వర్మ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నరసింహ వర్మ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలను అందించారు. కేంద్ర గణేష్ మహోత్సవ సమితిలో సైతం ఆయన సేవలను అందించి హిందూ ధర్మంతో పాటు సంప్రదాయ పరిరక్షణకు కోసం నిరంతరం కృషి చేశారు.
రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం దారుణం జరిగింది. రోకలి బండతో దాడి చేయడంతో కిరణ్(29) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.
గ్రామానికి చెందిన చిటికెల కిరణ్ తన భార్య ప్రణతికి మధ్య శనివారం రాత్రి చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రణతి తన అన్న పగిడి శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. W.కొత్తపల్లి గ్రామం నుంచి శ్రీను రుద్రవరం వచ్చి రోకలి బండతో కిరణ్ తలపైన కొట్టగా మృతిచెందాడు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నాడు. ఆయన ఉదయం 10.05 గంటలకు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్లో 10.45 గంటలకు కర్నూలు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్లోకి చేరుకుంటారు. 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కల్లూరు చెన్నమ్మ కూడలి వద్ద ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.40 గంటలకు చెన్నమ్మ కూడలి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు విమానంలో విశాఖపట్నం వెళ్తారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలొ 2014లో ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. భూమా శోభానాగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఏప్రిల్ 23న షర్మిల నంద్యాలలో నిర్వహించన సభకు హజరై వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. HYDలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఎన్నికలో టీడీపీ గంగుల ప్రభాకర్ రెడ్డిపై 17,928 ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆమెను గెలిపించారు. కానీ ఆమె విజయాన్ని చూడలేకపోయింది.
13న జరిగే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కర్నూల్లోని నాల్గవ తరగతి ఉద్యోగస్తుల కాలనీ వాసులు పేర్కొన్నారు. కాలనీ వాసులు కృష్ణారెడ్డి, లెనిన్, నాగరాజు, బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. 10వేలకు పైగా జనాభా ఉన్న మా కాలనీలో ఒక్క మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా లేదన్నారు. కాలనీ సమస్యలను పరిష్కరించలేని నాయకులు మాకు అవసరం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులను ప్రచారానికి అనుమతించమని హెచ్చరించారు.
కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్త జాబితా ప్రకారం 20,56,203 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది. 2009లో 62.48%, 2014లో 71.21%, 2019లో 79.65% పోలింగ్ నమోదైంది. ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో కొత్త ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసొస్తుందో కామెంట్ చేయండి.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పరిధిలో మే 6 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ జరుగనుందని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా సంబంధిత ప్రక్రియలను నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన అధికారులను ఆదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోడుమూరు పట్టణ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం కారు ట్యాంకర్ను ఢీకొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఎమ్మిగనూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితురాలు భవాని లీలావతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి జడ్చర్ల సమీపంలో ఆటో ఎక్కే ప్రయత్నంలో లారీ ఢీకొనడంతో గాయపడ్డారు. కర్నూల్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈమె మృతికి ప్రధానోపాధ్యాయుడు నారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది సంతాపం తెలిపారు.
Sorry, no posts matched your criteria.