Kurnool

News May 5, 2024

కర్నూలు: ఆ 4 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకం

image

కర్నూలు జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే.. అందులో పత్తికొండ, ఆదోని, ఆలూరు, పాణ్యంలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో మొత్తం 2,204 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 330 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పేర్కొన్నారు. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంపిక చేశారు.

News May 5, 2024

వలసదారులకు ఓటు వేయవద్దు: మాండ్ర

image

ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇతర పట్టణాల నుంచి వచ్చి నందికొట్కూరు నుంచి పోటీచేసే వైసీపీ వలస దారుడైన అభ్యర్థికి ఓటు వేయవద్దని నిత్యం ప్రజల మధ్యనే ఉండే టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్యకు ఓటువేసి గెలిపించాలని నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని శివపురం, లింగాపురం, గోకవరం, ఎదురుపాడు, జడ్వారి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

News May 5, 2024

పార్లమెంటరీ స్థానానికి రెండో ఈవీఎం రాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

కర్నూలు పార్లమెంటరీ స్థానానికి సంబంధించి రెండో ఈవీఎం రాండమైజేషన్ పూర్తి చేశామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కర్నూలు పార్లమెంటు బ్యాలెట్ యూనిట్లకు రెండో విడత ఈవీఎం రాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News May 4, 2024

విధుల నుంచి 45 మంది తొలగింపు: కలెక్టర్

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా.. అందులో 45 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. వివిధ కేటగిరీల కింద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 18 వరకు నమోదు చేశామన్నారు. అందులో 6 కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 4, 2024

6వ తేదీ నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలు: కలెక్టర్

image

మంచానికే పరిమితమై ఇంట్లో నుంచి బయటకు రావటానికి వీల్లేని వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లాలో ఈ నెల 6, 7, 8వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ జీ.సృజన శనివారం తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 228 మంది, మంత్రాలయం 78, ఆదోని 63, కర్నూలు 53, పాణ్యం 159, పత్తికొండ 118, కోడుమూరు 127, ఎమ్మిగనూరులో 171 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

News May 4, 2024

నిప్పుల కొలిమిలా నంద్యాల జిల్లా

image

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత అధికమైంది. గత ఏడాది వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకే ఉన్నాయి. మొదటిసారి నంద్యాల జిల్లాలోని మూడు మండలాల్లో శుక్రవారం దాదాపు 48 డిగ్రీలకు చేరువ కావడం గమనార్హం. బండిఆత్మకూరు, గోస్పాడులో 47.7 డిగ్రీలు, నందికొట్కూరులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

News May 4, 2024

రేపు కర్నూలు జిల్లాకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఎన్నికల ప్రచారానికి ఆదోనికి రానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాఫ్టర్‌ ద్వారా చేరుకుంటారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తిక్కస్వామి దర్గా మీదుగా భీమాస్ సర్కిల్ నుంచి కోట్ల కూడలి వరకు ప్రచార రథంలో రోడ్ షో నిర్వహిస్తారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News May 4, 2024

మంత్రాలయం ఎన్నికల బరిలో ముగ్గురు రాఘవేంద్రరెడ్డి, ఇద్దరు నాగిరెడ్డిలు

image

మంత్రాలయం నియోజకవర్గంలో బరిలో 8మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్రరెడ్డి పేరును పోలిన మరో ఇద్దరు, వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి పేరున పోలిన పేరుతో ఒకరు ఎన్నికల బరిలో ఉన్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి ఆర్. రాఘవేంద్రరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎం. రాఘవేంద్రరెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కె.నాగిరెడ్డి పోటీలో ఉన్నారు.

News May 4, 2024

నంద్యాల: మద్యం మత్తులో భార్యపై భర్త గొడ్డలితో దాడి

image

మద్యం మత్తులో గొడవపడి భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. కొత్తపల్లి మండలం శివపురానికి చెందిన అర్జున్.. అదే గ్రామానికి చెందిన మార్తమ్మను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మద్యానికి బానిసైన అర్జున్ తరచూ తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మార్తమ్మపై దాడి చేయడంతో తల వెనుకభాగం, కుడిచేతి భుజం, మణికట్టు పైభాగం, మోచేతిపై తీవ్రగాయాలయ్యాయి.

News May 4, 2024

నంద్యాల జిల్లాలో ఈ సెగ్మెంట్ సమస్యాత్మకం: సీఈఓ

image

ఏపీలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో నంద్యాల (D) ఆళ్లగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, కేంద్ర బలగాలతో కూడిన భారీ భద్రత నడుమ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.